Skip to main content

లక్ష్యం మేరకే అనుకున్న టైంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు కలిసి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.

మంత్రివర్యులు దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, జంట సొరంగాల డివాటరింగ్ పనులు, అలాగే ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఇతర నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ –

“వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లాను త్వరిగా ప్రకటిస్తాం. మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడ్‌లో పూర్తి చేస్తాం. కానీ వైసీపీ నాయకులకు పనీపాట లేక రోడ్లపై కోటి సంతకాల సేకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని అన్నారు.


జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు – ముఖ్యాంశాలు:

  • వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
  • మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను నిపుణుల బృందంతో పరిశీలించారు.
  • ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్ డివాటరింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
  • డివాటరింగ్ పనులు పూర్తి కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • “ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఏజెన్సీలకు, అధికారులకు కూడా లక్ష్యం ఉండాలి,” అని మంత్రి స్పష్టం చేశారు.
  • 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్దేశించారని, దానిని సకాలంలో పూర్తి చేయని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • టన్నెల్ లైనింగ్, బెంచింగ్ పనులు వెంటనే ప్రారంభించేందుకు అధికారులు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
  • ₹456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్‌కు పూర్తి చేయాలని ఆదేశించారు.
  • “వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతుల సాగు, తాగునీటి సమస్యలు తీర్చుతాం,” అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.




Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...