ఉరవకొండ, జిల్లా గ్రంథాలయ సంస్థ, అనంతపురం ఆధ్వర్యంలో పనిచేయుచున్న శాఖా గ్రంథాలయం ఉరవకొండ నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మండల విద్యాధికారి (M.E.O.) ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. చాచా నెహ్రూకు నివాళులు: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఎంఈఓ ఈశ్వరప్ప పూలమాల వేసి నివాళులర్పించారు. పుస్తక సంపదను సద్వినియోగం చేసుకోండి: ఈ సందర్భంగా ఎంఈఓ ఈశ్వరప్ప విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న అపారమైన పుస్తక సంపదను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. "ఎక్కడ అందుబాటులో లేని పురాతన పుస్తకాలు సైతం గ్రంథాలయాలలో లభిస్తాయి. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత," అని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమకారులైన ఎస్. ఆర్. రంగనాథన్, కల్లూరు సుబ్బారావు, అయ్యాంకి వెంకటరమణయ్య వంటి వారి కృషి వలనే నేడు ఇన్ని గ్రంథాలయాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. సాహిత్యంపై తనకు మక్కువ గ్రంథాలయం ద్వారానే పెరిగిందని, సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకం విలు...
Local to international