Skip to main content

Posts

Showing posts from October 25, 2025

వృద్ధుడిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టిన వ్యక్తి

  ఢిల్లీలోని సరితా విహార్‌లో వృద్ధుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో విచక్షారహితంగా దాడి చేశాడు. తన అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేశారనే అనుమానంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఓ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆ ఇద్దరిలో ఈ వృద్ధుడు ఒకడని భావించి దారుణంగా కొట్టాడు. అడ్డు చెప్పిన మహిళను కూడా బెదిరించాడు. నడిరోడ్డుపై ఈ ఘటన జరిగినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

హైదరాబాద్ లో .. ఏయే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడెప్పుడు

  1979 లో TCS  1982 లోCMC (ఇప్పుడు TCS లో మెర్జ్ అయింది ) 1986 లో అమెరికా హెడ్ ఆఫీస్ గ ఉన్న Intergraph   1987 లో "మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్"  పేరుతో టెక్ మహీంద్రా సోర్స్ -చల్లా శ్రీధర్ మరి IT నేనే తెచ్చాను అని  1995 లో సీఎం అయిన బాబు డప్పు ఏంటో మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌..  6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు.  దానిపేరు హైటెక్‌ సిటీ.  నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఐటీ స్పేస్‌ కట్టడానికి అప్పటి సీఎం  ఎన్‌.జనార్థన్‌రెడ్డి (21 మే 1992 )పునాది వేశారు.  చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు.  1995 లో చంద్రబాబు సీఎం అయ్యాక  రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు.  ఐటీ, అనుబంధ ఎగుమతులు: చంద్రబాబు దిగిపోయే నాటికి  2003–04లో -రూ.5,660 కోట్లు  వైఎస్సార్‌ హయాము  2008 -09 లో - రూ.32,509 కోట్లు  నిజానికి హైదరాబాద్  వేగంగా అభివృద్ధి చెందింది YS హయములోనే  అని 2015 లో JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు.

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు ...
 ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC.. హైదరాబాద్‌ - బెంగళూరు ప్రయాణం మేము 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు! కానీ RTC బస్‌లో అయితే హైదరాబాద్‌ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు. కారణం ఏమిటంటే.. 🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్‌ అయి ఉంటుంది.. 🔹 సగటు వేగం 70–75 KM.. 🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM - దాదాపు డబుల్! RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు! అందుకే… RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ! గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి. వేగం కావాలి ప్రాణం పోవాలి అంటే ప్రైవేట్ వాహనం ఎంచుకోండి, కానీ “నిదానమే ప్రదానం” అంటే RTC మీకోసం ఉంది. నిధనమే ప్రధానం. ట్రెండు మారిందంటూ ఆర్టీసీ బస్సులు ఎద్దుల బండి తో పోలుస్తున్నారు. ఇలాంటివన్నీ జరిగిన ప్రజలు మారరు. ఇంటి నుంచి బయటికి వెళ్లే తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు లేని కాలం బతుకుతున్నాం జర అర్థం చేసుకోండి బ్రదర్🙏🙏🙏

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం  ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు వెండిని కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక రంగాల్లోనూ విస...

అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష

 అమెరికా       న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డ మెహుల్ గోస్వామి అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. 15 ఏళ్ళు జైలు శిక్ష~

వచ్చే నెల 5లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే పూర్తి చేయాలి

ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చ స్వంత స్థలము కలిగివుండి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. దీనిపై తహసీల్దార్లు వేగంగా స్పందించి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గృహ నిర్మాణ శాఖ పి.డిలు, ఈ.ఈలు డి.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ వెరిఫికేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– బి.ఎల్.సి. హౌసింగ్ కార్యక్రమం, ఎన్టీఆర్ హౌసింగ్ 2016 నుండి 2019 వరకు పెండింగ్ లో ఉన్న ఇళ్లను మొబైల్ యాప్ లో సర్వే చేయటం, 2021 నుంచి 2024 వరకు మంజూరై పూర్తైనవి, ఇంకా పనులు జరుగుతున్నవి.. అసలు ఇళ్లే నిర్మించుకోని వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాల గురించి చర్చించారు. ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో సర్వే జరుగుతున్న విషయంపై ప్రధానంగా చర్చించారు. ఇందులో తహసీల్దార్ల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతోందని కొందరు అధికారులు చెప్పారు. ఈ సమస్యను రెవెన్యూ అధ...

పేదలకు ఆరోగ్య సహాయం – రూ.61.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం, అక్టోబర్ 25:— ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మొదటగా, ధర్మవరం ప్రాంతానికి చెందిన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 25 మంది రోగులను సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో మోకాళ్ల శస్త్రచికిత్స కోసం బెంగళూరులోని వైదేహి హాస్పిటల్‌కు ప్రత్యేక బస్సు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రోగులకు శస్త్రచికిత్స ఖర్చులు సహా అన్ని వైద్య సదుపాయాలను సంస్కృతి సేవా సమితి ట్రస్ట్ పూర్తిగా భరిస్తుంది. ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందించడంలో సంస్కృతి సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సేవ చేయడం ద్వారానే మనిషి జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తుందని, రోగులు త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తరువాత అదే...

స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం

స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం అభివృద్ధి అనేది హామీ కాదు – ఆచరణలో చేసి చూపిస్తున్నాం – మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి, అక్టోబర్ 25:– ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలంలోని డి. చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు నిర్మించిన కొత్త బిటి రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,.... స్వతంత్రం వచ్చినప్పటినుండి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న పత్యాపురం గ్రామం మరియు పత్యాపురం తండా ప్రజల అవసరాల నిమిత్తం ఈ బిటి రహదారి నిర్మించి, ప్రజల వినియోగానికి అందించడం నాకు ఆనందంగా ఉంది. ఈ రహదారి మొత్తం పొడవు 1060 మీటర్లు ఉండగా, ₹85.00 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేయబడింది. పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు ఈ బిటి రహదారి చాలా కాలంగా గ్రామ ప్రజల ఆకాంక్షగా ఉండేది. ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తికావడంతో తండా ప్రాంత ప్రజలకు రాక...

ఉరవకొండలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ

-ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నవంబర్ 1న నూతన వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొననున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆమిద్యాలలో వాల్మీకి మహర్షి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నవంబర్ 1వ తేదీన ఘనంగా జరగనుంది. విగ్రహ ప్రతిష్ఠ వివరాలు  నిధుల సేకరణ: గ్రామంలోని వాల్మీకి కుటుంబాలు చందాలు వేసుకుని ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గుడి నిర్మాణం: గ్రామ బహిరంగ ప్రదేశంలో సుమారు ₹13 లక్షల పైగా వెచ్చించి ప్రత్యేకంగా వాల్మీకి దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. గుడి నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. విగ్రహం: స్వామివారి విగ్రహాన్ని చంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో తరలించి గ్రామంలో ఏర్పాటు చేశారు.   విగ్రహం విలువ: ఈ విగ్రహాన్ని దాత దాసరి వెంకటేశులు ₹80,000 వెచ్చించి తయారు చేయించారు. కొంతమంది నాయకులు కూడా పెద్ద ఎత్తున నగదు విరాళాలు అందించారు. కార్యక్రమానికి ఏర్పాట్లు నవంబర్ 1న జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన వాల్మీకి కుటుంబాలతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు, నాయకులు, అధికారులు తరలిరానున్నారు....

బైక్ ను కావేరి ట్రావెల్స్ ధీ కొట్ట లేదని వెల్లడి

 Kurnool october 25 స్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు. పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి.. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని వెల్లడి.. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డ యువకులు.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌.. రోడ్డు మీద చెరో వైపు పడిపోయిన శంకర్‌, ఎర్రిస్వామి. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ తలకు బలమైన గాయాలు.. స్పాట్‌లో మృతి చెందిన శంకర్‌.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వెళ్లిన వీ కావేరి ట్రావెల్స్‌ బస్సు.. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్లిన బస్సు. బస్సు ప్రమాదంతో భయపడి పారిపోయిన ఎర్రిస్వామి.. సీపీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు.

సోలార్ పవర్ హబ్‌గా రాయదుర్గం: దర్గా హోన్నూరు సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

   రాయదుర్గం నియోజకవర్గం సోలార్ పవర్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. బొమ్మనహల్ మండలం, దర్గా హోన్నూరు గ్రామంలో శనివారం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి విద్యుత్ వ్యూహం ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు, ఇతర ప్రాంతాలకు అదనపు విద్యుత్తును సరఫరా చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.   పెట్టుబడులు: టాటా, ఎన్టీపీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు.  రాయదుర్గం ప్రాధాన్యత: బొమ్మనహల్ మండల పరిధిలోని ఎల్.బి.నగర్ గ్రామంలో త్వరలో సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్యం: రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేయ...

అనంతపురం జిల్లాలో అదృశ్యమైన ఆర్. లాలి బాయి ఆచూకీ కోసం అత్యవసర గాలింపు

  అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలంలోని రూపా నాయక్ తండాకు చెందిన 45 ఏళ్ల గిరిజన మహిళ ఆర్. లాలి బాయి అదృశ్యంపై ఆర్. హేమ్లా నాయక్ అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి వినయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన వేడుకున్నారు. అదృశ్యం, ఫిర్యాదు వివరాలు  తన భార్య ఆర్. లాలి బాయి సెప్టెంబర్ 28, 2025 న ఇంటి నుంచి కర్నూలు జిల్లా, ఆలూరు మండలములోని అరికెర తండాలో ఉన్న వారి అమ్మగారి గ్రామానికి వెళ్లిందని హేమ్లా నాయక్ తెలిపారు.   ఆమె వయస్సు సుమారు 45 సంవత్సరాలు .   రెండు, మూడు రోజుల వరకు ఆమె వారి బంధువుల ఇళ్లలో విచారించగా, అక్కడికి రాలేదని చెప్పినారు.   దీంతో వారు రెండు, మూడు రోజులు వెతికిన తర్వాత, సెప్టెంబర్ 30, 2025 న వజ్రకరూరు పోలీసు స్టేషన్ నందు ఎస్.ఐ.కి ఫిర్యాదు ఇచ్చారు (ఎఫ్.ఐ.ఆర్. నెం. 117). విచారణ మరియు అరెస్ట్   పోలీసులు సీ.సీ. కెమెరాలో తనిఖీ చేసి చూడగా, ఆమె రాచువారిపల్లికి చెందిన యల్. సురేష్ తో పాటు వెళ్లినట్లు తెలిసింది.   పోలీసు వారు అతనిని వెంటనే అరెస్టు చేశారు.   అయినప్పటికీ, నిందితుడు విచారణలో పొంత...

అనంతపురంలో కలకలం: గిరిజన మహిళ అదృశ్యంపై పోలీసుల నిర్లక్ష్యంపై ఆవేదన!

  ఉరవకొండ  అక్టోబర్ 25: అనంతపురం జిల్లాలో అదృశ్యమైన గిరిజన మహిళ ఆర్. లాలి బాయి కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు పట్టుబడినప్పటికీ తన తల్లి ఆచూకీ దొరకకపోవడంపై ఆమె కుమార్తె కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యుల ఆవేదన   నిర్లక్ష్యంపై ప్రశ్నించిన భర్త: గిరిజన మహిళ అదృశ్యంపై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ లాలీ బాయి భర్త ఆర్. హేమ్లా నాయక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  కుమార్తె రోదన: "మా అమ్మ బ్రతికి ఉందా లేక చంపేశారా? నిగ్గు తేల్చండి" అంటూ లాలీ బాయి కుమార్తె రోదిస్తోంది.  ప్రధాన ప్రశ్న: నిందితుడు యల్. సురేష్ పోలీసులకు దొరికినప్పటికీ ఆమె ఆచూకీ తెలుసుకోవడంలో ఎందుకింత నిర్లక్ష్యం జరుగుతోందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు వివరాలు  అదృశ్యం: లాలి బాయి సెప్టెంబర్ 28, 2025 న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యారు.   ఫిర్యాదు: సెప్టెంబర్ 30, 2025 న వజ్రకరూరు పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు నమోదైంది (FIR No 117).   నిందితుడి మాటలు: అరెస్టయిన నిందితుడు సురేష్ ఒకసారి చంపేశానని, మరొకసారి దాచి పెట్టానని పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెప్తున్నా...

విశాఖ ఆర్డీఓ వేధింపుల ఉదంతం: సీఎంఓ అధికారిపై చర్యలు తీసుకోండి – కాకతీయ సేవా సమితి డిమాండ్

  బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలి; ప్రభుత్వం మారినా అధికారి తీరు మారలేదని ఆగ్రహం ఉరవకొండ, అక్టోబర్ 23: విశాఖపట్నం ఆర్డీఓ (RDO) శ్రీలేఖను వేధింపులకు గురిచేస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ముఖ్య ఉన్నతాధికారిని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఉరవకొండ తాలూకా కాకతీయ సేవా సమితి అధ్యక్షులు, సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు ఓ ప్రకటనలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినప్పటికీ, సదరు అధికారి తీరులో మార్పు రాలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ శ్రీలేఖపై కక్ష సాధింపుగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, "సదరు సీఎంఓ అధికారి చేసే అరాచకాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన శ్రీలేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం సరైన పద్ధతి కాదు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లెక్క చేయలేదనే దురుద్దేశంతోనే ఆ అధికారి శ్రీలేఖను ఇబ్బందులకు గురి చేస్తున్నారని" తెలిపారు. నిజాయితీ గల అధికారి అయిన శ్రీలేఖకు ఆమె కమ్మ కులమే శాపమైందని ఆ ఉన్నతా...

అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ ప్రజలు.

  అమరావతి అక్టోబర్ 25' దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. AP తొలి స్థానంలో, తెలంగాణ రెండో ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. కేరళ (29.9), తమిళనాడు (29.4), కర్ణాటక (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2%, ఛత్తీస్గఢ్లో 6.5% మంది ఉండటం గమనార్హం..