Skip to main content

Posts

Showing posts from September 25, 2025

ఆర్డీటి యఫ్ సీ ఆర్ ఏ కొనసాగించాలని ఆధ్యాత్మిక వేత్త మహారాజ్ ప్రధాని ని డిమాండ్

 కర్ణాటక రాష్ట్రం బంజారా సంఘం నేత ధార్మిక ఆధ్యాత్మిక వేత్త శ్రీ మహారాజ్ ద్వారా భారత దేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ కి దేశస్థాయిలో సేవలు అందిస్తున్న ఆర్ టి టి ని కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు శుక్రవారం కర్ణాటక కు వెళ్లి రూపా నాయక్ నానుసాద్ కుటుంబీకుడు శ్రీ మహారాజును సేవా గడ్ ట్రస్టు ఉపాధ్యక్షులు ఎస్ కేశవ నాయక్ కలిశారు.  ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ సుదీర్ఘకాలం బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం శ్రీ మహారాజ్ దేశ ప్రధానికి కలవడానికి వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానికి ఆర్డిటి పై సమగ్రంగా తయారుచేసిన వినతి పత్రం అందజేయాలని కోరారు. ఈ విషయమై ప్రధాని హోం శాఖ మంత్రి తో చర్చించి తప్పకుండా న్యాయం జరిగేలాగా శ్రద్ధ తీసుకుంటానని శ్రీ మహారాజ్ కేశవ నాయక్ కు హామీ ఇచ్చారు శ్రీ మహారాజును కలిసిన వారిలో బంజారా సంఘం నేత లాల్ సింగ్ కర్ణాటక ప్రసిద్ధ గాయకుడు కుబేర్ నాయక్ ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ కమల్ సింగ్ రాథోడ్ బంగి దుర్గ తదితరులు ఉన్నారు

కోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులు లైసెన్స్ వదులుకోవాలి.

  ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్  కోర్టుల్లో న్యాయవాద వృత్తి చేయకుండా,ఇతర వృత్తుల్లో, వ్యాపారాల్లో లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్న న్యాయవాదులు తమ ప్రాక్టీస్ లైసెన్స్‌ను ఒక నెలలోపు సర్పెండర్ చేయాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఆదేశించింది. కొంతమంది న్యాయవాదులు ప్రైవేట్ కంపెనీలు,ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని,అలాగే వ్యాపారాల్లో నేరుగా పాల్గొంటున్నారని, అయినప్పటికీ,తమ దగ్గర న్యాయవాద వృత్తి చేసేందుకు లైసెన్స్ ఉంచుకుంటున్నారని ఒడిశా బార్ కౌన్సిల్ ముందు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఇలా చేయడం *Advocates Act,1961* నిబంధనలకు విరుద్ధమని ఒడిశా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం.... 👉అడ్వకేట్ నేరుగా వ్యాపారం చేయరాదు. అయితే,ఒక వ్యాపార సంస్థలో Sleeping Partner (రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనని భాగస్వామి)గా ఉండవచ్చు కానీ ఆ వ్యాపారం స్వభావం న్యాయవాద వృత్తి గౌరవానికి విరుద్ధంగా ఉండకూడదు. 👉న్యాయవాది ఒక కంపెనీకి డైరెక్టర్ లేదా ఛైర్మన్‌గా ఉండవచ్చు.అయితే,ఎలాంటి ఎగ్జిక్యూటివ్ విధులు (రోజువారీ పాలన/నిర్వహణ పనులు) చేయరాదు. 👉న్యాయవాది Managing Director లేదా Secr...

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

కడప: - ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న శ్రీ రాముడి విగ్రహం.. - ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు.. - ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు..

వృద్ధాప్య తల్లితండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తి అనుభవించే హక్కు లేదు: సుప్రీంకోర్టు

  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చిచెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన *తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం* అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ తీర్పు వెలువడింది.  తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం.. ఏర్పాటైన ట్రైబ్యునళ్లు..కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.

మహాకవి శ్రీ శ్రీ రచన

 కుదిరితే పరిగెత్తు.. ,  లేకపోతే నడువు...  అదీ చేతకాకపోతే...  పాకుతూ పో.... ,  అంతేకానీ ఒకే చోట అలా  కదలకుండా ఉండిపోకు...  ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని,  'స్నేహితుడొకడు మోసం  చేశాడని,' ప్రేమించినవాళ్ళు వదిలి  వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా?  దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే  ఎగిసి ఎగిసి పడుతుంటే...     తలుచుకుంటే...  నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు  కూడా...  నీ ముందు తలదించుకునేలా  చేయగల సత్తా నీది,  అలాంటిది ఇప్పుడొచ్చిన  ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే  ఎలా? సృష్టిలో చలనం ఉన్నది  ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,  ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే...  బయలుదేరు...   నిన్ను కదలనివ్వకుండా చేసిన  ఆ మానసిక భాదల  సంకెళ్ళను తెంచేసుకో... ,   పడ్డ చోటు నుండే పరుగు  మొదలుపెట్టు...  నువ్వు పడుకునే ...

న్యాయమూర్తులకు శిక్ష విధించే కొత్త చట్టాలు ఏమిటి?

 ఢిల్లీ: సాధారణంగా, న్యాయమూర్తులు న్యాయ స్వాతంత్ర్యం (judicial independence) సూత్రం కారణంగా ఇతర పౌరుల మాదిరిగా సాధారణ క్రిమినల్ చట్టాల కింద శిక్షించబడరు. న్యాయ పాలనకు ఇది చాలా ముఖ్యం. అయితే, దీని అర్థం వారు చట్టానికి అతీతులు అని కాదు. న్యాయమూర్తుల దుష్ప్రవర్తనను మరియు తీవ్రమైన కేసులలో, నేరపూరిత ప్రవర్తనను పరిష్కరించడానికి యంత్రాంగాలు ఉన్నాయి. కొత్త చట్టాలు మరియు న్యాయమూర్తుల జవాబుదారీతనం న్యాయమూర్తులకు శిక్ష విధించడం మరియు క్రమశిక్షణకు సంబంధించిన చట్టాలు సాధారణంగా ఒక దేశం యొక్క న్యాయ లేదా రాజ్యాంగ చట్రంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆమోదించబడిన ప్రతి కొత్త చట్టం యొక్క పూర్తి జాబితాను నేను అందించలేను, కానీ నేను కొన్ని ముఖ్యమైన పరిణామాలు మరియు సాధారణ సూత్రాలపై సమాచారాన్ని ఇవ్వగలను. ఉదాహరణకు, భారతదేశంలో, కొత్త క్రిమినల్ చట్టాలలో భారతీయ న్యాయ సంహిత, 2023 ఒక ముఖ్యమైన అభివృద్ధి. ఇది భారతీయ శిక్షా స్మృతిని (Indian Penal Code) భర్తీ చేస్తుంది. ఈ చట్టం నేరాలకు సంబంధించిన నిబంధనలు మరియు వాటి శిక్షలకు ప్రసిద్ధి చెందింది. ఇది "న్యాయమూర్తి"ని అధికారికంగా న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి...

సోషల్ మీడియాలో దుర్వినియోగం పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున.

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అనుచిత కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ముందు నాగార్జున తరఫున న్యాయవాది ప్రవీణ్ణానంద్ వాదనలు వినిపించారు. న్యాయవాది వాదిస్తూ—“నాగార్జున ఇప్పటివరకు 95 సినిమాల్లో నటించారు. రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడైన ఆయనను ఉగ్రవాదిగా పేర్కొంటూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జూదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రొమాంటిక్ సంబంధాల పేర్లు అంటగడుతున్నారు. అంతేకాకుండా, ఏఐతో తయారు చేసిన వీడియోలను యూట్యూబ్ షార్ట్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారాన్ని తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలి” అని విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్ల...

శాసనసభ, మండలిలో ఏఐ ఆధారిత హాజరు నమోదు

శాసనసభ, శాసనమండలిలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు వారి సీట్లలో కూర్చున్న వెంటనే ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) సాంకేతికత ద్వారా ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. సభకు హాజరైన, హాజరుకాని సభ్యుల వివరాలు నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు చేరనున్నాయి. ఈ వ్యవస్థ అమలు బాధ్యతను హైదరాబాదుకు చెందిన డ్యురాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్దిష్ట సమయానికి సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసిన ఫొటోలతో సరిపోల్చి జాబితాను సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత సభలో పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభ్యుడి ముఖ లక్షణాలను డేటాలో 175 వెక్టార్ పాయింట్ల రూపంలో నమోదు చేస్తారు. కెమెరాలు 180 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతి గంటకు సభ్యుల ఫొటోలు సర్వర్‌కు పంపిస్తాయి. అక్కడి ప్రత్యేక సాఫ్ట్వేర్, ముందే నిక్షిప్తం చేసిన వెక్టార్ పాయింట్లతో పోల్చి హాజరైన, గైర్హాజరైన సభ్యుల జాబితాను రూపొందిస్తుంది. ఇప్పటివరకు సభ్య...

అపరిశుభ్రతకు ఆనవాళ్లు పెన్నొబిలంలో కోనేర్లు.

 ప్రచారం ఉరవకొండ. శుభ్రం గోరంత. - శ్రీ లక్ష్మీ నరసింహని సాక్షిగా అడుగడుగునా అపరిశుభత్ర సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దిగువన ఉన్న కోనేరులో చెత్త చెదారం అపరిశుభ్రత తాండవిస్తుంది దేవస్థానం దిగువన ఉన్న పుట్టుశిల ఉద్భవ లక్ష్మమ్మ కోనేరు నిండా చెత్త చెదారం పేరుకుపోయింది. దేవస్థానానికి వచ్చే భక్తులు కోనేరు నుంచి వెదజల్లే దుర్వాసన కంపు భరించలేక పోతున్నారు అమ్మ వారి శరణ నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనీసం శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆయన శుభ్రం చేయించాలన్న ఇంగితం అంటూ దేవస్థానం అధికారికి గాని సిబ్బందికి గాని ఇంగితం లేకపోయింది అధికారులు సిబ్బంది నెలకు వేలు జీతాలు దొబ్బేస్తున్నారు వచ్చామా? వెళ్ళామా? జీతం పొందామా? అనే ముచ్చటగా మూడు సూత్రాలను శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా అమలు పరుస్తున్నారు. పాల గోపురం దిగువున ఉరవకొండ కు చెందిన అన్న సత్రం పక్కన ఉన్న కోనేరు అపరశుభ్రతతో తాండవిస్తుంది ఇక ఉరవకొండ కు వెళ్లే మార్గంలో ఉన్న నాలుగు స్తంభాల కోనేరు జాడ కనిపించడం లేదు ప్రధాన కోనేరు అపరిశుభ్రతకు కేరాఫ్ గా నిలుస్తాయి. వీటిలోని అపరిశుభ్ర...

పయ్యావుల సోదరుల సహకారంతో నెర్రమెట్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శశ్రీ

 . నెర్రమెట్ల: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం నెర్రమెట్ల గ్రామంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం ఒక ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పయ్యావుల సోదరుల సహకారంతో విజయవంతంగా జరిగింది. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్లు పావని, షఫీ, నాగ రత్నయ్యలతో పాటు ఇతర వైద్య బృందం పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల జబ్బులకు సంబంధించిన పరీక్షలు చేసి, తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో సీనియర్ నాయకులు తిప్పారెడ్డి, భీమప్ప, గురుమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ శివప్ప, హైస్కూల్ కమిటీ చైర్మన్ చిత్తానంద, మరియు బిందు శేఖర్ రెడ్డి ఉన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నెర్రమెట్ల గ్రామంలో ఇలాంటి ఆరోగ్య శిబిరం నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు తక్కువగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహ...

దోమల నివారణకు వేల్పుమడుగు గ్రామంలో ఫాగింగ్

  పెద్దకొట్టాలపల్లి (ఉరవకొండ): దోమల బెడదను నివారించి, ప్రజలను వ్యాధుల బారి నుండి కాపాడే ఉద్దేశ్యంతో పెద్దకొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గురువారం ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జయకుమార్ నాయక్ ఆదేశాల మేరకు, ఉరవకొండ సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి మునఫ్ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బందితో కలిసి, గ్రామంలోని ప్రతి వీధిలోనూ పెరి త్రయం అనే మందుతో ఫాగింగ్ చేశారు. ఈ పొగ వలన డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను కలిగించే దోమలు చనిపోతాయి. గ్రామంలో దోమల సంఖ్యను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఫాగింగ్ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఎం.ఎల్.హెచ్.పి. రోషిణి, మరియు ఆశా కార్యకర్తలు నాగమ్మ, మహాలక్ష్మితో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు దోమల నుండి రక్షణ పొందేందుకు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు సూచించారు.

చాబాల దర్గా ఆలయ పునర్నిర్మాణానికి రూ. 50,116 విరాళం

చాభాల: అనంతపురం జిల్లా, వజ్రకరూరు: వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ చాబాల దర్గా వన్నూరు స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక కుటుంబం ఒకటి పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేసింది. కీ.శే. చల్ల సంజీవ రెడ్డి గారి కుమారులైన కీ.శే. చల్ల ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు రూ. 50,116 మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని గురువారం ఉదయం 11 గంటల సమయంలో చల్ల ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలు అయిన శివలింగప్ప, ధనుంజయ, కేరా పరమేష్లకు అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మాజీ సర్పంచ్ సి. ఎర్రిస్వామి, లింగమూర్తి, చికెన్ సెంటర్ అశోక్, తలారీ చెన్నప్ప, కొలిమి మొహమ్మద్, మగ్గం మూర్తి, జీకే రాంబాబుతో పాటు గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విరాళం ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలోని భక్తులు, ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

26న ఎక్సైజ్ కేసులోని వాహనాల వేలం

ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి ప్రభుత్వానికి జప్తు కాబడిన 05 ద్విచక్ర వాహనాలు మరియు ఒక టాటా సుమో వాహనాలకు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ నందు ఈ నెల 26వ తేదీన శుక్రవారం నాడు అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వేలం నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వారు 26.09.2025 తేదీన ఉదయం 11.00 గంటలకు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఆధార్ కాపీ, పాన్ కాపీ తో హాజరు అయ్యి Rs.3000/- దరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చనని సీఐ రవి చంద్ర తెలిపారు.

అనంత ప్రైవేట్ కళాశాల మరణాల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

 *ఎస్ ఆర్ ఐ టి కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జేఎన్టీయూ పరిపాలనా భవనం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది* *ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఉరితాడే శరణమా?* ఎస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలి!* విద్యార్థి సంఘాలు(AIFDS,PDSU, AISA,) ఆధ్వర్యంలో అనంతపురము జేఎన్టీయూ పరిపాలన విభాగం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి సిద్దు,పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీరేంద్ర ప్రసాద్, ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, మాట్లాడుతూ  యస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిగ్గు తేల్చాలనీ జెఎన్టియుసి గారికి రిజిస్టర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ కళాశాలపై ఎలాంటి కమిటీ వేయకపోగా విద్యార్థిని మరణించి ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం ఇప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు ఒక పక్క విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోటున్న ఇప్పటికీ ప్రభుత్వం కనీసం విద్యార్థి మరణపై కారణాలు చెప్పడం లేదని ప్రభుత్వన్నీ తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలపడం జరిగింది. యస్ ఆర్ ఐ టి కళాశాలలో చోటు చేసుకున్న వ...

ప్యూన్‌ కొలువు కోసం 25 లక్షల దరఖాస్తులు

 జైపూర్: దరఖాస్తుదారుల్లో ఇంజినీరింగ్‌,ఎంబిఎ,పిహెచ్‌డి,పిజి అభ్యర్థులు కూడా బిజెపి పాలిత రాజస్థాన్‌లో నిరుద్యోగతాండవ జైపూర్‌ : దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. చదువుకు తగిన జాబ్‌ రాకపోవడంతో ఏదో ఒక జాబ్‌లో సెటిలవ్వాలన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్‌ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు వస్తే.. rajasఉద్దరిస్తామంటూ సమస్యల్ని పట్టించుకోవటంలేదనటానికి ఉదాహరణలు ఎన్నో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలుఉన్నా భర్తీచేయటంలేదు. నిరుద్యోగం ఎంతగా ప్రబలుతున్నదో చెప్పటానికి బిజెపి పాలిత రాజస్థాన్‌లో ఇటీవల ప్యూన్‌ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం 53,479 ప్యూన్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు పదో తరగతి అర్హత కాగా.. దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ/బిటెక్‌, ఎంఎస్‌సి, ఎంబిఎ, లా, పిహెచ్‌డి చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. ప్యూన్‌ పోస్టుల కోసం సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థ...

పరువు నష్టం నేరం కాదు.. మార్పులు అవసరం: సుప్రీంకోర్టు

  పరువు నష్టం చట్టాన్ని నేరరహితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్య 'ది వైర్' న్యూస్ పోర్టల్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అంగీకారం జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ వేసిన పరువు నష్టం కేసును సవాల్ చేసిన జర్నలిస్టులు ఇదే అంశంపై రాహుల్ గాంధీ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని గుర్తు చేసిన కపిల్ సిబాల్ అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్నట్లు ప్రకటించిన సుప్రీం ధర్మాసనం పరువు నష్టం చట్టాన్ని నేరరహితంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ 'ది వైర్' సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'ది వైర్' న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన కొన్ని కథనాలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ ప్రొఫెసర్ అమితా సింగ్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో 'ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం' (ది వైర్ మాతృసంస్థ), దాని ఎడిటర్ అజోయ్ ఆశీర్వాద్‌లకు జారీ అయిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టును...

శృంగేరి పీఠం బ్రాంచ్‌లో దారుణం.. 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన స్వామీజీ!

ఢిల్లీ ఢిల్లీలోని ఆశ్రమ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత బాలికలు నిందితుడు స్వామి చైతన్యానంద పరారీ స్వామితో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించిన శృంగేరి పీఠం నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్‌తో ఉన్న వోల్వో కారు స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో జరిగిన దారుణం వెలుగు చూసింది. పేద విద్యార్థినులకు విద్యాదానం చేయాల్సిన ఓ స్వామీజీనే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి తమను లైంగికంగా వేధించాడంటూ 17 మంది విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్-గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులను స్వామి చైతన్యానంద లక్ష్యంగా చేసుకున్నారు. అసభ్యకరమైన భాష వాడటం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడ్డారని బాధితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. స్వామి డిమాండ్లకు ఒప్...

న్యాయం కావాలి.. హై కోర్ట్ సాధన సమితి.

శ్రీబాగ్ ఒప్పందం అమలు, హైకోర్టు ఏర్పాటు కోసం కర్నూలులో న్యాయవాదుల నిరసన దీక్షలు కర్నూలు: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, అలాగే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో కర్నూలు న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నిరసన దీక్షలో పాలుపంచుకున్న ప్రముఖులు నాలుగో రోజు జరిగిన ఈ నిరసనలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. చంద్రుడు, రమణ నాగరాజు, రామాంజనేయులు, జి.వి.కృష్ణమూర్తితో పాటుగా ఇతర న్యాయవాదులు కూడా దీక్షల్లో కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు కేవలం న్యాయవాదులే కాకుండా, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మద్దతుగా హాజరయ్యారు. వివిధ పార్టీల సంఘీభావం ఈ నిరసన దీక్షలకు మద్దతుగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు అనంత రత్నం మాదిగతో పాటు, మహిళా నాయకురాళ్ళు సలోని, హైమావతి, లలితమ్మ కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయవాదులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా వా...

అసెంబ్లీ లో అనుబంధ భవనం ప్రారంభం. మంత్రి పయ్యావుల

, అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన అనుబంధ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్  అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నూతన అనుబంధ భవనం ముఖ్యంగా శాసనసభ్యులు మరియు మంత్రుల కార్యకలాపాలకు మరింత సౌకర్యాన్ని అందించే ఉద్దేశ్యంతో నిర్మించబడింది. ఇందులో సమావేశ మందిరాలు, కమిటీ గదులు, మరియు ఆధునిక కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ భవనం అందుబాటులోకి రావడం వల్ల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ముఖ్యంగా వివిధ కమిటీల సమావేశాలు, మరింత సులభతరం అవుతాయి. ఇది శాసనసభ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. గతంలో శాసనసభ కార్యకలాపాలు, ముఖ్యంగా శాసనసభ్యుల వ్యక్తిగత కార్యాలయాలు మరియు ఇతర అనుబంధ విభాగాలు, తాత్కాలిక భవనాలలో లేదా పరిమిత వసతులతో నడిచేవి. కొత్త భవనం ఈ లోపాలను తీరుస్తూ, అందరికీ ఒకే ప్రాంగణంలో అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీనివల్ల శాసనసభ్యులు మరియు అధికారుల మధ్య సమ...

దసరా సెలవులు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు

 విద్యార్థుల మధ్య తారతమ్యం సృష్టించడం సరైనది కాదు. ఇది వివక్షతకు దారితీస్తోంది* ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కణేకల్ మండలం పత్రిక సమావేశం లో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ.* దసరా సెలవులు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్న ప్రైవేట్,కార్పొరేట్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే, కణేకల్, రాయదుర్గం, కేంద్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా విద్యార్థులను బలవంతంగా పాఠశాలలకు రప్పిస్తూ తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. మండల విద్యాశాఖాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెలవులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించడంప...