పుత్తూరు:- ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, పుత్తూరు వారి చే పాలమంగళం, సచివాలయం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో దినకర్ గాండ్ల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడమైనది. 150మంది రోగులకు కంటి పరిక్షలు, బ్లడ్, షుగర్, ఎముకలు,ఈసీజీ పరీక్షలు చేసి 45000/-విలువ గల మందులు ఉచితంగా ఇవ్వడమైనది.కంటి పరీక్షలు చేయించు కొన్న వారిలో 27 మందికి శుక్లలు వల్ల కంటి ఆపరేషన్ కి సెలెక్ట్ చేయడమైనది. ఉషోదయ వాకర్స్ అసోసియేయిన్ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేటి రవిరాజు, కార్యదర్శి రామ్ మోహన్ వర్మ, పాల్గొని క్యాంపు నిర్వహించినారు. ఆస్టర్ నారాయణ ద్రి హాస్పిటల్ డాక్టర్ అర్జున్, పి. ఆర్. ఓ. మౌళి మరియు సిబ్బంది పాల్గొన్నారు.వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ బాలకృష్ణ, పి. ఆర్. ఓ వెంకటేష్, సంధ్యా పాల్గొన్నారు. ఈ క్యాంపు కు భాస్కర్ నాయుడు, ఉపసర్పంచ్, నరసింహాశెట్టి,రవి నాయుడు, జనార్దన్ రెడ్డి, సెందిల్, లీలావతి మరియు గ్రామ సభ్యులు పాల్గొని మెడికల్ క్యాంపు దిగ్విజయముగా జరిపించిన్నారు.