Skip to main content

Posts

Showing posts from October 21, 2025

నేవీ చిల్డ్రన్ స్కూల్ పోస్టులకు దరఖాస్తులు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్స్ట్రషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. 

ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో పి డి , పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలి.

  ప్రభుత్వ జూనియర్ కళాశాల ను పాత సమయ పద్ధతిలోనే నిర్వహించాలి ఎందుకనగా చాలామంది విద్యార్థులు బస్సుకు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు ఇందులో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు వారికి సరైన బస్సు సౌకర్యం లేక సతమతమవుతున్నారు కావున జూనియర్ కళాశాల సమయం ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు నిర్వహించాలి అలాగే ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో పి డి లేదా పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలి జూనియర్ కళాశాల విద్యార్థులకు పిఈటిలు లేక వారికి ఆసక్తికరమైనటువంటి క్రీడలలో వెనుకబడే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రతి ఒక్క విద్యార్థిలో ఉండే కళను బయటకు తీసుకువచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కావున తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M. హరూన్ రషీద్ కోరారు.

సమాచారం ఇవ్వని గుత్తి తహసీల్దార్హ, గుంతకల్ల్ ఆర్ డీ ఓ లపై చర్యలు తీసుకోండి, guntak

   ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 21 : గుత్తి మండలం: పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ భూ సమాచారం, అక్రమ మ్యూటేషన్ గురించి అడిగిన సమాచారాన్ని గుత్తి తాసిల్దార్ ఇవ్వలేదు. దీంతో అప్పీలు అధికారి అయిన గుంతకల్ ఆర్డీవోను ఆశ్రయించగా ఆయన సమాచారం అందించలేదు. నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాచారాన్ని సెక్షన్ 7(1 )కింద ఇవ్వకపోతే ఉల్లంఘనే. ఉల్లంఘనా చర్యల్లో భాగంగా సెక్షన్ 20(1) ప్రకారం ఆలస్యానికి గాను బాధ్యత వహించి రోజుకు ₹250 చొప్పున జరిమానా చెల్లించాలని ఆర్ టి ఐ యాక్ట్ లోని సెక్షన్ 20 (2) చెబుతోంది. ఇదే క్రమంలో  అప్పీలు అధికారి ఆర్డీవో సమాచారం ఇప్పించడంలో వైఫల్యం చెందారు. సేవా నిబంధనల ప్రకారం ఆయన కూడా శాఖాపరమైన చర్యలకు బాధ్యులే. అధికారులు ఇద్దరు ఇద్దరే. సమాచారం ఇవ్వని, ఇప్పించని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారుడు/ ఆప్పీలు దారుడు మాలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సమాచారం ఇవ్వని అధికారులు: రెండవ అప్పీల్‌కు దరఖాస్తు గుంటూరు జిల్లా, మంగళగిరి: సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పౌర సమాచార అధికారి (P...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం

  ఆమె ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్ కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో, ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్ వెంటనే హెలికాప్టర్‌ను నెట్టి పక్కకు పెట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..

ఫోటో లో పాప పత్తికొండ పోలీస్ స్టేషన్ లో ఉంది

   పై ఫోటో లో వున్న చిన్న పాప పత్తికొండ పోలీసు స్టేషన్ లో వున్నది. ఈ పాప పత్తికొండ టౌన్ నందు గల SBI బ్యాంక్ వద్ద వారి తల్లి తండ్రుల నుంచి తప్పి పోయి ఒంటరిగా ఉండదాన్ని గమనించి అక్కడి వారు పోలీసు స్టేషన్ నందు అప్పగించడమయినది. కావున పాపను ఎవరయినా గుర్తించి వారి తల్లి తండ్రులకు విషయము తెలిపి ఈ పాపను తల్లి తండ్రుల చెంతకు చేర్చుటకు తమ వంతు సహకారము తెలుప గలరని  ఇట్లు  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  పత్తికొండ UPS

ఒక్క ఛాన్స్ ప్లీజ్.-కరెంట్ గోపాల్

  పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడే ఒక్క అవకాశం కల్పించాలని కరెంట్ గోపాల్,,గుంతకల్ డివిజనల్ పోలీసు అధికారిని కోరారు. ఆయన పేరు గోపాల్. ఇంటిపేరు ఉక్కీసుల. ఉక్కీసుల గోపాల్ అంటే ప్రజలు గుర్తుపట్టరు కానీ ఆయనను కరెంట్ గోపాల్ అని పిలిస్తే ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. ఉక్కీసుల గోపాల్ అలియాస్ కరెంటు గోపాల్ అంటే కరెక్ట్ గోపాల్ అనే పేరు అయన సంపాదించుకున్నారు.  వృత్తి రీత్యా ఆయన గ్రామపంచాయతీలో సీనియర్ ఎలక్ట్రీషియన్ గా ఎలాంటి అరమరికలు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరి మెప్పు పొందారు.  ప్రవృత్తి రీత్యా ఆయనలో దేశభక్తి భావనలు అణువు అణువులో నిండిపోయాయి.  దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల చరిత్రలు ఆయనకు కొట్టిన పిండి. వారి జయంతోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు వివరించి వారిలో దేశభక్తి భావనలు పెంపొందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం కోసం తహతహలాడిపోయారు. దీంతో గుంతకల్ పోలీస్ డివిజన్ అధికారి శ్రీనివాసులను సోమవారం కలిసి పోలీసు సేవలను కొనియాడే ఒక్క ఛాన్స్ తనకు ఇ...

భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాను: నటి రేణూ దేశాయ్

  తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటానని నటి రేణూ దేశాయ్ తెలిపారు. “ఆద్య, అకీరా చిన్నవాళ్లే కాబట్టి కొన్నేళ్లు ఇక్కడ ఉంటాను. తర్వాత సన్యాసినిగా జీవిస్తాను,” అని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఇప్పుడు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో ఛాన్స్లు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఓకే చేశానని, త్వరలో ఆ సినిమా ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.
  రైస్తో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి.! రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి..! సెంట్రల్ & స్టేట్ ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని సివిల్ సప్లైస్ మంత్రి నదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు షాపులు అందుబాటులో ఉంటాయి.. అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు.. ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయమూ అందుబాటులోకి రానుంది...

ఏపిలో 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలో పోస్టింగ్‌లు: మంత్రి అచ్చెన్నాయుడు

  6 వేల ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడి గత ఐదేళ్లలో ఒక్క రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని విమర్శ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మంత్రి సమస్యలున్నా ఉద్యోగులందరికీ డీఏ ఇచ్చామని వ్యాఖ్య‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు నియామకాల ఆవశ్యకత ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో పోలీసు శాఖలో నియామకాలు చేపట్టలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని, వీరికి త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదు .. డీజీపీని నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు డీజీపీని వివరణ కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని డీజీపీకి ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా జరుగుతున్న పేకాట శిబిరాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో, కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జూదం నిర్వహించడం, ఆడడం రెండూ నేరమని, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం శిక్షార్హమైన చర్యలని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు. పోలీసు అధికారులు ఈ అంశంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది...

గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు

  పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ సూచనలు, మద్దతు లేకపోవడంతో వాటికి నిప్పు పెట్టడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. దీని వల్ల దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఓ వైపు పంట వ్యర్థాలకు నిప్పుపెడుతున్న వారిని.. మరో వైపు అదే పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్న వారిని కలిశారు మీడియా ప్రతినిధి సరబ్‌జిత్ ధాలివాల్. పంజాబ్ ఫతేఘర్‌ జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమ పంట వ్యర్థాలను..విద్యుదుత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తోంది. ఇది కాలుష్యం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ పంట వ్యర్థాలను అమ్మడం ద్వారా రైతులు కూడా లాభపడుతున్నారు. ‘పంటవ్యర్థాలు ఓ రకమైన ఇంధనం . చౌకైన ఇంధనం. దీని ప్రాధాన్యత చాలా మందికి తెలీదు.. దీంతో సులభంగా విద్యుదుత్పత్తి చేయచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మేం ప్రయత్నించాం... విజయం సాధించాం. ముందుగా ఈ వ్యర్థాలన్నీ బాయిలర్‌లో వేస్తాం. బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటిఆవిరి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్తును ఉపయోగించి మేం మా ఫ్యాక్టరీని నడిపిస్తున్నాం’ అని చెప్పారు గణేష్ ఎ...

బాబోయ్.. వాట్సాప్ కొత్త రూల్ అంట.. ఇకపై మెసేజ్‌లు అదేపనిగా పంపితే అంతే.. లిమిట్ దాటితే బ్లాక్ చేస్తుంది..!

వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో స్పామ్ మెసేజ్ తీవ్రత పెరుగుతోంది. ఈ స్పామ్ కంటెంట్ కు చెక్ పెట్టేందుకు మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. వాట్సాప్ యూజర్లు, బిజినెస్ అకౌంట్లకు తెలియని నంబర్‌లకు పంపగల మెసేజ్ సంఖ్యను పరిమితం చేసే కొత్త రూల్ త్వరలో అమల్లోకి రానుంది. మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు తెలియని వ్యక్తులకు పదే పదే మెసేజ్ పంపే యూజర్లు, బిజినెస్ అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్‌ను తగ్గించడానికి త్వరలో మెసేజ్ లిమిట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందుకోసం మెసేజ్ లిమిట్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. అనంతరం వాట్సాప్ యూజర్ల అందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. *కొత్త నిబంధనలివే :* ఇప్పుడు, ఒక వాట్సాప్ యూజర్ లేదా మర్చంట్ అకౌంట్ పంపిన ప్రతి మెసేజ్ సమాధానం వచ్చిందా లేదా అనేది లెక్కిస్తుంది. తెలియని వ్యక్తికి సందేశం పంపితే వారు ఆన్సర్ ఇవ్వకపోతే ఆ మెసేజ్ నెలవారీ పరిమితిలో లెక్కిస్తుంది. ఆ తర్వాత లిమిట్ విధిస్తుంది. *లిమిట్ దాటితే అలర్ట్ :* వాట్సాప్ మెసేజ్ లిమిట్ దగ్గరపడే కొద...

నేనున్నాను... మంత్రి సత్య కుమార్ యాదవ్

తాడిమర్రి, అక్టోబర్ 21 :– ధర్మవరం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారని, వారికి ఏ ఆపదొచ్చినా తాను అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా కల్పించారు. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన సాకే విగ్నేష్ ను మంత్రి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు పరామర్శించారు. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పిన్నదరి గ్రామానికి చెందిన సాకే విగ్నేష్ (3 సంవత్సరాలు) అనే బాలుడికి గుండె సంబంధిత అత్యవసర చికిత్స అవసరం ఉండటంతో, మంత్రి చొరవతో తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బాలుడు విజయవంతంగా శస్త్రచికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం పిన్నదరి గ్రామానికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాబు ఆరోగ్యం క్షేమంగా ఉందని మంత్రి కి నివేదించారు. అనంతరం మంత్రి వె...

ఈశ్వరమ్మ దేవస్థానం పరిసరాల మురుగు దుస్థితిపై బీజేపీ నేత జోక్యం

  స్పందించని పంచాయతీ: జేసీబీతో చెత్త తొలగింపు ఉరవకొండ: అక్టోబర్ 21: ఉరవకొండ పట్టణంలోని ఈశ్వరమ్మ దేవస్థానం పరిసరాలు తీవ్ర దుస్థితికి చేరాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీరు, పెరిగిన కంపచెట్లు పేరుకుపోవడంతో ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థానిక నాయకుడుదగ్గుపాటి శ్రీరామ్ స్వయంగా రంగంలోకి దిగారు. దేవస్థానం పరిసరాల శుభ్రత కోసం జేసీబీ (JCB) యంత్రాన్ని ఏర్పాటు చేయించి, పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తకుప్పలు, పాడైన రోడ్లు, మూసుకుపోయిన మురుగు కాలువలను ఆయన పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతదగ్గుపాటి శ్రీ రామ్ మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యం, దేవాలయ పవిత్రత కోసం ఇలాంటి చర్య తప్పనిసరి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల తరపున ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది" అని వ్యాఖ్యానించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "...

పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం: జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ

  -పోలీస్ సంస్మరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా బోయ గిరిజమ్మ ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ అన్నారు. పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. మంగళవారం (21.10.2025) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసు అమరవీరుల స్మారక స్తూపానికి పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... అహర్నిశలు శ్రమించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖ త్యాగాలను కొనియాడారు. వారి సేవలకు జిల్లా ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమములో అనంతపురం జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, ఇతర పుర ప్రముఖులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడప మహాసభల ప్రచార వ్యూహంపై ఐసా చర్చ

 (శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ): ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాబోయే సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభల ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వేమన మాట్లాడుతూ... డిసెంబర్ 6, 7 తేదీలలో కడప నగరంలో జరగనున్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన ప్రచార కార్యక్రమాల గురించి నాయకులకు వివరించారు. ఈ మహాసభల ప్రాధాన్యతను, విద్యార్థి సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి భీమేష్, యూనివర్సిటీ కార్యదర్శి కృష్ణ, ఇతర ముఖ్య నాయకులు యమన, వెంకటేష్, ఆనంద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల ప్రచారంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది..

ఉరవకొండలో సత్యసాయి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: బీజేపీ గిరిజన మోర్చా డిమాండ్

  ఉరవకొండ  అక్టోబర్ 21: ఆధ్యాత్మికవేత్త, అవతార పురుషుడు శ్రీ సత్యసాయి బాబా విద్యనభ్యసించిన మరియు తన అవతార ప్రకటన చేసిన పుణ్యక్షేత్రమైన ఉరవకొండలో ఆయన జ్ఞాపకార్థం ఒక వైద్య యూనివర్సిటీ లేదా వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడు కేశవ నాయక్ డిమాండ్ చేశారు. ఉరవకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడిన కేశవ నాయక్... బాబా ఇక్కడి శ్రీ కరిబసవ స్వామి ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యనభ్యసించారని, ఈ ప్రాంత విద్యార్థిగా ఎదిగి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారని గుర్తు చేశారు. అయితే, ఆయన జన్మస్థలమైన పుట్టపర్తికి ఇచ్చినంత ప్రాధాన్యతను ఉరవకొండకు ఇవ్వలేదని, తిరిగి ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చిన బహుమతి (రిటర్న్ గిఫ్ట్) ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఉపయోగం వైద్య యూనివర్సిటీ ఆవశ్యకత: సత్యసాయి ట్రస్టు వారు ఈ చారిత్రక అంశాన్ని గుర్తించి తక్షణమే ఉరవకొండలో వైద్య యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కేశవ నాయక్ కోరారు.   సామాజిక ప్రయోజనం: వైద్య కళాశాల ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు...

​కరెంటు కష్టాలు: దీపావళి అమావాస్య రోజు పెట్రోల్ బంకుల్లో పడిగాపులు

  విడపన కల్  క్టోబర్ 21: ​విడపనకల్ (అనంతపురం జిల్లా): పండుగ రోజున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం (అక్టోబర్ 21) దీపావళి అమావాస్య సందర్భంగా, విడపనకల్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకుల్లో కరెంటు లేని కారణంగా ఇంధనం పోయడం నిలిచిపోయింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ​జనరేటర్లు ఉన్నా పనిచేయడం లేదు: ​జి. మల్లాపురం సమీపంలోని పెట్రోల్ బంకులకు కరెంటు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, అవి నామమాత్రంగానే ఉండి, పనిచేయడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. "జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో సరైన సదుపాయం లేకపోవడం దారుణం. వర్షాకాలం కావడంతో పెట్రోల్ అయిపోయి, మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాము" అని పలువురు ప్రయాణికులు తెలిపారు. ​ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా? ​విడపనకల్ గ్రామంలో గతంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా, అందులో రెండు రద్దయ్యాయి/నిలిచిపోయాయి. ప్రస్తుతం నడుస్తున్న ఒకే ఒక్క బంకు కూడా కరెంటు ఉంటేనే పనిచేసే పరిస్థితి ఉంది. ​పక్క...

​అంతర్గత భద్రతకు నిత్యం పోలీసుల కృషి: కరెంట్ గోపాల్

ఉరవకొండలో ఘనంగా అమరవీరుల దినోత్సవ వేడుకలు ఉరవకొండ  అక్టోబర్ 21: ​దేశ రక్షణ, అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉరవకొండలో మంగళవారం (అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ​పోలీసుల దేశభక్తి, నిబద్ధత, అంకిత భావాన్ని వేయి నోళ్ళ కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు. ​ర్యాలీ, సంస్మరణ సభ నిర్వహణ ​పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా, స్థానిక పోలీస్ గ్రౌండ్‌లో పేరేడ్ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి టవర్ క్లాక్ కూడలి దాకా విద్యార్థులు (బాలికలు, బాలురు) పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టవర్ క్లాక్ కూడలి వద్ద నిర్వహించిన సంస్మరణ సభలో అధికారులు ప్రసంగించారు. కార్యక్రమంలో ముఖ్య విషయాలు: ​చరిత్రను గుర్తు చేసిన కరెంట్ గోపాల్: సీనియర్ ఎలక్ట్రీషియన్ కరెంట్ గోపాల్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడానికి గల కార...

చందన బ్రదర్స్' అధినేత కన్నుమూత

  చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.