Skip to main content

Posts

Showing posts from November 10, 2025

అనంతపురంలో 'ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్'కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శంఖుస్థాపన

  అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఈరోజు (మంగళవారం) అనంతపురం నగరంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) కు సంబంధించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. జెఎన్టీయూ మార్గంలో ఉన్న సిరికల్చర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు. ముందుగా ఆయన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ తదితరులతో కలిసి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు వివరాలు  ప్రాంగణం: సిరికల్చర్ కార్యాలయంలోని ప్రాంగణం   విస్తీర్ణం: 4 ఎకరాల విస్తీర్ణంలో   మంజూరైన నిధులు: ఈ ప్రాజెక్టు కోసం రూ. 16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణంతో అనంతపురం నగరంలో పారిశ్రామిక అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీ పేలుడు.. ఒకరి అరెస్ట్

  ఢిల్లీలో పేలుడు ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటన గురించి విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందన్నారు. నెమ్మదిగా వచ్చిన కారు.. రెడ్లైట్ దగ్గర ఆగి ఆగగానే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని తెలిపారు. కారు వెనకాలే ఉన్న మరిన్ని కార్లకు మంటలు అంటుకుని పేలుడు తీవ్రత పెరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం... పోలీసుల అదుపులో కారు యజమాని!

ఢిల్లీ దిల్లీ కారు పేలుళ్ల కేసులో మాజీ యజమాని సహా ఇద్ద రు అరెస్ట్ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘటనలో 13 మంది మృతి, 24 మందికి గాయాలు పేలుడుకు ఉపయోగించిన కారు హరియాణాకు చెందినదిగా గుర్తింపు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్న భద్రతా ఏజెన్సీలు రెడ్‌లైట్ వద్ద ఆగిన కారులో సంభవించినట్లు వెల్లడించిన పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, దాని యజమానితో పాటు, గతంలో కారు సొంతదారును కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్‌ పేరిట కారు రిజిస్టర్ అయి ఉండగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్‌ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని రెడ్‌లైట్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెంద...

మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్..

 మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్.. అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారిందినిన్న సాయంత్రం నుండి పాప ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద పాప ఆచూకీ కనుక్కున్న అమలాపురం పట్టణ పోలీసులు. అమలాపురం పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి పాప ఆచూకీ కనుక్కున్న పోలీసులు.. మరికొద్ది సేపట్లో పట్టణ సిఐ వీరబాబు పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.........

దిల్లీలో పేలుడు.. పోలీసులకు హైఅలర్ట్‌

దిల్లీ నగరంలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపివున్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో ఆందోళన నెలకొంది. వెంటనే దిల్లీ పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఏడు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అపోహలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన..... లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. "ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.  ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది  రిమాండ...

పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం – వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

  పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించే పిపిపి (PPP) విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థుల మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా వైయస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ రెడ్డి , శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రాయల్ గార్లు పలు కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సంతకాలు చేయించి పిపిపి విధానానికి వ్యతిరేకంగా తమ మద్దతు తెలియజేశారు. “కూటమి ప్రభుత్వం కుట్రలతో పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ, ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజా వ్యతిరేక చర్య,” అని అమరనాథ్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులు తమ కుటుంబాలకు, సమాజాన...

గుండె వ్యాధిగ్రస్తురాలికి సీఎం సహాయ నిధి చెక్కు – పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా అందజేత

  పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి అడ్డాల లక్ష్మీ పద్మావతి గారికి గుండె సంబంధిత వ్యాధికి పేస్‌మేకర్ అమర్చే చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 86,050ల ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది. ఈ చెక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధితురాలికి అందజేశారు. గుండె వ్యాధితో బాధపడుతున్న శ్రీమతి లక్ష్మీ పద్మావతి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కోరుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి అర్జీ సమర్పించగా, ఆయన సిఫార్సుతో ఈ సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు మేలు చేకూరుస్తోందని పేర్కొన్నారు.

పెన్నహోబిళం ఆలయ రథం నిర్మాణంపై విరాళాల సొమ్ము ఏమైంది, ఆలస్యానికి కారణమేంటి?భక్తుల సూటి ప్రశ్న?

  పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత ప్రధానమైన శ్రీస్వామివారి రథం నిర్మాణం ఆలస్యం అవుతున్న తీరుపై భక్తులు, గిరిజన సంఘం వ్యవస్థాపకులు సుంకే నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ఆలయ అభివృద్ధి పనుల కంటే ముందుగా, రథోత్సవానికి అతిప్రధానమైన నూతన రథాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.  విరాళాల సొమ్ము ఏమైంది? ఆలయం ఆధునికీకరణ పనులు తరువాత చేపట్టినప్పటికీ, రథ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళంగా సేకరించిన మొత్తం కోటి రూపాయల సొమ్ము ఏమైందని సుంకే నాయక్ ప్రశ్నించారు.  మూడేళ్లుగా ఆలస్యం ఎందుకు? దాదాపు కోటి రూపాయల విరాళాలు సేకరించి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రథం నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోందనే ప్రశ్నలు భక్తులమదిని తొలిచి వేస్తున్నాయని గిరిజన సంఘం అధ్యక్షులు సుంకేనాయక్ ధ్వజ మెత్తారు.  నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? రథం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం అవసరమో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయ ఆదాయ వనరులు, మాన్యాలు, భక్తుల విరాళాలతో ఆదాయం సమకూరుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం క...

జనసమస్యల పరిష్కారానికి ముందడుగు – జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు

 నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.  గారి సూచనలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో భాగస్వామ్య పద్ధతిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నియంత్రణ దిశగా గ్రామాల్లో గ్రామస్తులు, పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రజలకు ఆస్తి నేరాలు, నివారణ చర్యలు, సైబర్ మోసాలు, గాంజా–ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే మహిళలు మరియు బాలబాలికలపై నేరాలు, చట్టాలు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో తగాదాలు, గొడవలు లేకుండా సామరస్యంగా జీవించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం, గంజాయి వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అరికట్టడంలో గ్రామస్థులు సహకరించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టి, చెడు ప్రవర్తన కలిగిన వారిని పోలీసు అధికారులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ...

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు – మైనార్టీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అజారుద్దీన్ మైనార్టీ సంక్షేమ రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆధునికీకరణకు వీహెచ్‌పీ విజ్ఞప్తి

అనంతపురం  జిల్లా, ఉరవకొండ మండలంలో వెలసిన పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అత్యవసరంగా, సమగ్రంగా ఆధునికీకరించాలని, అభివృద్ధి చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), అనంతపురం జిల్లా శాఖ దేవాదాయ ధర్మదాయ శాఖకు అధికారికంగా విన్నవించింది. ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ, ఈ మహిమాన్వితమైన, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన మహా పుణ్యక్షేత్రం అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్థంగా తయారైందని వీహెచ్‌పీ ఎత్తి చూపింది. ఆదాయ వనరులు, మాన్యాలు, భక్తుల విరాళాలతో ఆదాయం సమకూరుతున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం కారణంగా ఆలయం అధ్వాన్నంగా తయారైందని సంస్థ పేర్కొంది. ఆలయ అభివృద్ధికి కీలక డిమాండ్లు జిల్లా అధ్యక్షులు శ్రీ తాళంకి వెంకట రత్నమయ్య సంతకంతో కూడిన ఈ లేఖలో భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, పర్యాటక కేంద్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి, ఆలయ శోభను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన 19 అంశాలను ప్రస్తావించారు.   పాలక మండలి పునరుద్ధరణ: పాలక మండలి లేని కారణంగా నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని, కావున పాలక మండలిని తక్షణమే పునరుద్ధరించాలని వీహె...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఉషోదయ స్కూల్ విద్యార్థులు

  ఉరవకొండ: అనంతపురం జిల్లా నందు నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఉరవకొండ శ్రీ ఉషోదయ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైయ్యారు. ఈనెల 14 15 16వ తారీఖున కాకినాడ నందు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఈ చిన్నారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజనేయులు, హఫీజ్ అహ్మద్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మద్యం రవాణా అరికట్టండి

చెక్  పోస్ట్ తనిఖీ ఉరవకొండ : ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు విడపనకల్ మండలం , విడపనకల్ , డొనేకల్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. నాగమద్దయ్య, అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్‌ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ చెక్ పోస్ట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమంగా వచ్చే మద్యం రవాణాను పూర్తిగా అరికట్టాలని చెక్పోస్ట్ అధికారులు బ్రహ్మయ్య, రఫీ లకు, సిబ్బందికి తగిన మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎక్సైజ్ సిఐ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోండి: ఏవీఎస్ హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీ, కండిషన్ లేని బస్సులపై ఆంధ్ర విద్యార్థి సంఘం ఆగ్రహం ఉరవకొండ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) తీవ్రంగా మండిపడింది. అక్రమ ఫీజుల వసూళ్లు, ప్రమాదకరమైన బస్సుల నిర్వహణ, అర్హత లేని ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం నాడు జరిగిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) లో ఏవీఎస్ నేతలు ఈ మేరకు సమగ్ర ఫిర్యాదు సమర్పించారు.  జీవోలను లెక్కచేయని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 1,, 52,, 53 లకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నిబంధనలను పాటించకుండా మిస్టర్ రాజ్యాంగ ఫీజులు (అధిక మొత్తంలో ఫీజులు) వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని ఏవీఎస్ నాయకులు ఆరోపించారు.  విద్యార్థుల భద్రతకు ముప్పు: బస్సులు, డ్రైవర్ల లోపం విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ పాఠశాలలు చలగాటమాడుతున్నాయి అని ఏవీఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.   బస్సులు: గ్రామీణ ప్ర...

న్యాయ పోరాటానికి లభించిన విజయం: కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పరిశీలనకు హైకోర్టు ఆదేశం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమ సర్వీసులను క్రమబద్ధీకరించనందుకు ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఈ అంశాన్ని చట్టబద్ధంగా పరిశీలించి ఆరు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతివాదులను (ప్రభుత్వ అధికారులను) ఆదేశించింది.  శ్రీ జస్టిస్ న్యాపతి విజయ్ అక్టోబర్ 31, 2025 నాడు వ్రట్ పిటిషన్ నెం: 24439/2024 పై ఈ చారిత్రక ఉత్తర్వులు జారీ చేశారు.  కేసు పూర్వాపరాలు: 18 ఏళ్ల సేవకు గుర్తింపు కోసం పోరాటం డి. ఉమాదేవి (కదిరి, శ్రీసత్యసాయి జిల్లా) సహా మొత్తం 10 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరిలో కొందరు స్త్రీలు ఉన్నారు, కొందరు పురుషులు ఉన్నారు.  సేవా కాలం: పిటిషనర్లందరూ 2007 వ సంవత్సరం నుండి (సుమారు 18 ఏళ్లుగా) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లుగా (తెలుగు, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బోటనీ, హిస్టరీ వంటి సబ్జెక్టులలో) పనిచేస్తున్నారు.  చట్టపరమైన...

జైల్లో ఖైదీల మద్యం పార్టీ వీడియో లీక్ – బెంగుళూరులో సంచలనం

  బెంగుళూరు:బెంగుళూరు సెంట్రల్ జైలులో మళ్లీ వివాదాస్పద వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల ఐసిస్‌ రిక్రూటర్‌కి జైలులో VIP సౌకర్యాలు కల్పిస్తున్న వీడియో లీక్ అయి చర్చనీయాంశమవగా, ఇప్పుడు మరో వీడియో బయటకు రావడం సంచలనం రేపుతోంది. తాజాగా లీకైన వీడియోలో కొంతమంది ఖైదీలు జైల్లోనే మద్యం సేవిస్తూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైల్లో ఇంత సౌకర్యం ఎలా లభిస్తుందో అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, వీడియోలో కనిపించిన ఖైదీల వివరాలు సేకరిస్తున్నారు.

కానిస్టేబుళ్ల శిక్షణ వెంటనే ప్రారంభించాలంటూ ఏఐవైఎఫ్ డిమాండ్

 అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో 2022లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణను తక్షణమే ప్రారంభించాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నవంబర్ 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో కూడా వినతిపత్రం సమర్పణ కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ సచిన్ రాజేంద్ర గారికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. నాయకుల వ్యాఖ్యలు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ — 2022 నవంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ, ఫిజికల్, మెయిన్స్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసి తుది ఫలితాలు ప్రకటించారు. దాదాపు 6,100 మంది యువతులు, యువకులు విజయవంతమయ్యారు. అయినప్పటికీ నాలుగేళ్లు గడిచినా శిక్షణ ప్రారంభం కాలేదు. ఇది యువతకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది” అని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంపికైన అభ్యర్థులు మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంట...

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

  తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు.సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. “జయ జయ హే తెలంగాణ” గీతం రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రజల్లో గర్వభావం నింపింది.ఆయన మరణం సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు._