Skip to main content

Posts

Showing posts from October 18, 2025

సహోద్యోగులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ యూపీ కోర్టు భవనం పైనుంచి దూకి మహిళా స్టెనో ఆత్మహత్య

Canpoor యూపీ కాన్పూర్ లోని ఓ కోర్టు భవనం ఆరో అంతస్తు నుంచి దూకి శనివారం నేహా సంఖ్వర్ అనే 30 ఏళ్ల మహిళా స్టెనోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఆమె 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిందని మృతురాలి తాత తెలిపారు. కానీ ఆమె ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి నిరంతరం వేధింపులకు గురయ్యారని చెప్పారు. తోటి ఉద్యోగులు ఈ వేధింపులకు పాల్పడ్డారని నేహా కుటుంబం ఆరోపించింది~£

మిస్ యూ మాలేపాటి భానుచందర్

  మాలేపాటి భానుచందర్ ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదంలో ముంచివేసింది. మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు కుమారుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి అన్న కుమారుడిగా.. దగదర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులుగా.. ఎంతోమందికి కొండంత అండగా ఉన్న మాలేపాటి భానుచందర్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని శోక సంద్రంతో వేడుకుంటున్నాను.

పొగడ పువ్వులు...

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. వేయి మారేడు దళాల కంటే ఒక తామరపువ్వు ఉత్తమం. వేయి తామరపూల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం. వేయి పొగడపూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. వేయి ఉమ్మెత్త పూల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. వేయి ములక పూల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. వేయి తుమ్మి పూల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం. వేయి ఉత్తరేణి పూల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. వేయి దర్భ పూల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్ఠం. వేయి జమ్మి పూల కంటే ఒక నల్లకలువ ఉత్తమం...

రాళ్లపాడు ఘటనకు అధికార మదమే కారణం – బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్

గుంటూరు జిల్లా రాళ్లపాడు ఘటనపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతోనే ఈ దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. అధికారపార్టీ నేత వాహనంతో దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన రామచంద్రయాదవ్, మృతుని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాళ్లపాడు లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ప్రభుత్వం చట్టవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా రెండు నాల్కల ధోరణితోనే సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో బిసిలపై అనేక దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ దాడులను చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. బిసి బిడ్డ అమరనాథ్ గౌడ్ హత్య, దళిత డాక్టర్ సుధాకర్ మరణాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో బిసిలు, దళితులతో పాటు అధికారంలోకి రావడానికి సహకరించిన వర్గాలపై కూడా దాడులు జరిగాయి. ఆయన నేరాలను అరికట్టకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు,” అని రామచంద్రయాదవ్ వ్యాఖ్యా...

16 నెలల్లో సగం గోపాలపట్నం - నరవ కొండ తవ్వేసిన మైనింగ్ మాఫియా!

కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతుందా విశాఖపట్నం జిల్లా పరిధిలోని గోపాలపట్నం – నరవ కొండ పరిసర ప్రాంతాలు గత 16 నెలలుగా మైనింగ్ మాఫియా బీభత్సానికి గురవుతున్నాయి. చట్టపరమైన అనుమతులు లేకుండా రాత్రివేళల్లో భారీ యంత్రాలతో కొండలను తవ్వి, ట్రక్కుల ద్వారా రాళ్లను తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు, పర్యావరణ శాఖ, పోలీసు విభాగం మౌనం పాటించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొండల తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల భూగర్భ జలాలు తగ్గిపోగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని గోపాలపట్నం, నరవ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలు ఈ మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళనలో ఉన్నారు.

నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ

  నేమకల్లు, అక్టోబర్ 18: బొమ్మన హా ల్ మండల పరిధిలోని నేమకల్లు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేద మంత్రోచ్చారణల మధ్య తెల్లవారుజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ: భక్తులు బావిలో నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి స్వామివారి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం:  పంచామృతాభిషేకం   కుంకుమార్చన   ఆకుపూజ   ప్రత్యేక పుష్పాలంకరణ వంటి విశేష పూజలను నిర్వహించారు. సందర్శనకు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు

ఇండియా అక్టోబర్ 18 భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు చేరాయి. యూపీలోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమే అన్నారు. పాక్‌ దుస్సాహసానికి తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. యూపీ.. రక్షణ పరిశ్రమ కారిడార్‌కు మైలురాయిగా నిలుస్తుందన్నారు.

అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు అహ్వానం

  కడప జిల్లా..అక్టోబర్ 18: ముఖ్యమంత్రిని కలిసిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి*  కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందించారు.  జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని... ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.  ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.

మీ కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటాం

 అనారోగ్యంతో బాధపడుతున్న 63 మందికి ఆర్థిక భరోసా: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ  ఉరవకొండ (పెద్దకౌకుంట్ల,) అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్  చొరవతో, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలోని 63 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెద్దకౌకుంట్ల గ్రామంలోని శ్రీ పయ్యావుల కేశవ్  స్వగృహంలో, వారి సోదరులు శ్రీ పయ్యావుల శ్రీనివాసులు  ఈ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థిక భారం మోస్తున్న కుటుంబాలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో, మొత్తం ₹37,37,355 (ముప్పై ఏడు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయల) విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చెక్కులను పంపిణీ చేసిన శ్రీ పయ్యావుల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, "ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఆరోగ్య సమస్యల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ సహాయం అందిస్తున్నాం" అని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ గారి ఆదేశాల మే...

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం: తీవ్ర విమర్శలు!

  ఉరవకొండ అక్టోబర్ 18:: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి (సీఎం), ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) ఫొటోలను తప్పనిసరిగా వేలాడదీయాలన్న ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలను అనంతపురం జిల్లాలోని ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ అధికారులు పూర్తిగా ఉల్లంఘించడం తీవ్ర వివాదానికి దారితీసింది. కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు లేకపోవడంపై ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక మంత్రి ఫొటో, దాతల ప్రస్తావన: అనుమానాలకు తావు అధికారులు చేసిన అత్యంత విచిత్రమైన పని ఏమిటంటే... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు కనిపించని చోట, ఆర్థిక మంత్రి ఫొటోను మాత్రం వేలాడదీయడం. దీనికి తోడు, ఆ ఫొటోను "దాతలు అందించారని" పేర్కొనడం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది:   నిధుల కొరతే కారణమా?: కేవలం సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను సమకూర్చుకోవడానికి కూడా అధికారులు సొంతంగా నిధులు కేటాయించుకోలేని దుస్థితిలో ఉన్నారా? ఇది కార్యాలయ నిర్వహణపై ప్రశ్నలు వేస్తోంది.    నిర్లక్ష్యం కాదా?: స్పష్టమైన ఆదేశాలు ఉన్నా... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేయకపోవడం బాధ్...

ప్రైవేటికరణతో పేదలు వైద్య విద్యకుదూరం

  ఉరవకొండ అక్టోబర్ 18: వైద్య కళాశాలల ప్రవేటీకరణను అడ్డుకుంటామని జెబిపి జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రైవేటీకరణ పై రౌండ్ టేబుల్ సమావేశం లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రవేటీకరణకు అప్పగిస్తే సామాన్య, మధ్యతరగతి, హరిజన, గిరిజన కుటుంబాలకు వైద్య విద్య అవకాశాలు కనుమరుగౌతాయన్నాడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రవేటీకరణ విధానానికి స్వస్తి చెప్పాలని లేకుంటే భవిష్యత్లో అన్ని వర్గాల ప్రజలను, సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జెబిపి అర్బన్ ఇన్చార్ కొడవండ్ల నరేష్. జైభీమ్ రావ్ భారత పార్టీ. జిల్లా కన్వీనర్ వడ్డేర్ల వీర. వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్. నాయకులు .శుఖ్య నాయక్. ప్రసాద్ నాయక్. చేపల సర్పంచ్ మల్లెల జగదీష్. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం పురుషోత్తం. ముష్టుర్...

ఈ నెల 19 నుంచి 24 వరకు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు హాజరు.

ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ తిమింగళం – నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి

ఏసీబీ వలలో.. కమర్షియల్ తిమింగళం..!  -- నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి -- వేధిస్తూ అక్రమ వసూళ్లు -- వాణిజ్య శాఖలో అలజడి  విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖలో ఏళ్లుగా వేర్లు వేయి పాతుకుపోయిన అవినీతి రాక్షసులను వేటాడటంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారిగా తన కఠినత్వాన్ని చాటింది. గురువారం సాయంత్రం గవర్నర్‌పేట డివిజన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సాధారణ అటెండర్‌గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు రంగే చెరిపారు. శ్రీనివాస్ వ్యాపారులను తరచూ బెదిరిస్తూ, తన అధికార పరిధిని మించిపోయి వారిపై తనదైన శైలిలో ఒత్తిడి తెచ్చి అక్రమ వసూళ్లు జరుపుతున్నాడన్న ఫిర్యాదులు చాలాకాలంగా ఏసీబీ దృష్టికి వచ్చాయి. పలు సార్లు పన్ను తనిఖీల పేరుతో వ్యాపారులను వేధించి నగదు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలపై అధికారులు గమనిస్తున్నారు. గతంలో కూడా అతను ఇలాంటి ఆరోపణలతో ఏసీబీ దాడుల్లో చిక్కి, 2017లో సస్పెన్షన్‌కు గురైనప్పటికీ, అలవాటును మార్చుకోలేకపోయాడని సహచరులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం అతను అవంతి ట్రాన్స్‌పోర్ట్ యజమానిని తనిఖీల సాకుగా బెదిరించి వేలల్లో లంచం వసూలు చేస్తుండగా, కచ్చితమైన సమ...

ఏ ఐ ఎఫ్ డీ ఎస్ సత్య సాయి జిల్లా కమిటీ రద్దు చేయడం జరిగింది. AIFDS.

 ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సీఎం సిద్దు  అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరియు సంఘ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయాలు అమలుపరచకుండా రాష్ట్ర కమిటీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సంఘం విషయాలు ఇతరులకు తెలియజేస్తన్నరు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయినాథ్ రెడ్డిని సంఘం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది. సంఘ సభ్యత్వాలు మరియు ఆర్థిక నిధులు కొన్ని కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ చర్చించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏఐఎఫ్డిఎస్ సత్యసాయి జిల్లా కమిటీ రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, పోలీసులు, మేధావులు, విద్యాశాఖ అధికారులు గమనించాలన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి నడుస్తున్న ఏఐఎఫ్డిఎస్ నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై ఇదే తరహా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారని త్వరలో నూతన కమిటీ ప్రకటిస్తామని వారు తెలియజేశారు.

కేజీబీవీ పాఠశాలలో స్థానికంగా లేని ఎస్ఓ లను వెంటనే సస్పెండ్ చేయాలి*

  -అఖిల భారత విద్యార్థి సమాఖ్య :చందు తగ్గుపర్తి ఉరవకొండ : అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలకు నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నారాయణ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కరుణాకర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వం నాడు నేడు కింద చేపట్టిన పనులు 80% శాతం పూర్తికాగా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేజీబీవీకి సంబంధించి ఎక్కడా కూడా పెండింగ్ లో ఉన్న పనులు చేపట్టకుండా కేజీబీవీ పాఠశాలలను గాలికి వదిలేసిందన్నారు కావున వెంటనే పెండింగ్ లో ఉన్న పనులను సరిపడా నిధులు కేటాయించి పూర్తిచేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ కి సంబంధించి ప్రతి పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలినీ,ప్రహరీ గోడలు నిర్మించాలనీ, ప్రతి తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్టుకు బోధనేతర పోస్టులు భర్తీ చేయాలనీ కోరారు. అదేవిధంగా ఎవరైతే కేజీబీవీ పాఠశాలలో స్థానికంగా లే...