Skip to main content

Posts

Showing posts from October 7, 2025

గుంటూరు జిల్లా: వేములూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – కమ్మల రత్న సాగర్ పరిస్థితి విషమం

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామం సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొనుగుపాడు గ్రామానికి చెందిన కమ్మల రత్న సాగర్ (40) తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, రత్న సాగర్ కుటుంబం పిడుగురాళ్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు వేగంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రత కారణంగా రత్న సాగర్ బైక్ నుండి దూరంగా పడిపోగా, ఆయన శరీరానికి తీవ్రమైన గాయాలు తగిలాయి. కాళ్లు, చేతులు, తల భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడికి చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపీ ఉన్నత విద్యా మండలి సిఫార్సు: ₹26 కోట్ల అక్రమ వసూళ్లే కారణం!

  తిరుపతి :ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 08 ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APCHE) సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు వసూలు చేసిన ఆరోపణల నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఏకంగా ₹26 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేసిందనే ఆరోపణలపై ఏపీ ఉన్నత విద్యా మండలి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అధిక ఫీజుల అక్రమ వసూళ్లు నిజమేనని మండలి నిర్ధారించింది. కీలక ఆదేశాలు, జరిమానా: విచారణ ఫలితాల ఆధారంగా ఉన్నత విద్యా మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది:   ₹26 కోట్లు తిరిగి చెల్లింపు: విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ₹26 కోట్లను 15 రోజుల్లోగా వారికి తిరిగి చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది.  ₹15 లక్షల జరిమానా: అక్రమ వసూళ్లకు గాను యూనివర్సిటీపై ₹15 లక్షల జరిమానా విధించింది. గుర్తింపు రద్దుకు సిఫార్సు: ఈ తీవ్రమైన అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్యా మండలి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు ...

ఇకపై ఆధార్‌ ఉంటేనే "ట్రైన్ టికెట్‌

  ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 08 రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం.. ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్‌ నంబరు ఆధార్‌తో లింక్‌ అయి ఉండాలి. లింక్‌ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ టికెట్లు పొందగలరు, లింక్‌ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు....

శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవం: వాల్మీకి విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్ ఘన నివాళులు

అనంతపురం:ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవాన్ని మంగళవారం అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని పాతూరు విద్యుత్ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ వాల్మీకి సర్కిల్లోని శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు పుష్పామాలాలంకరణ చేసి, ఘన నివాళులు అర్పించారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మరియు ఇతర ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ కూడా శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిపిఓ నాగరాజునాయుడు, వాల్మీకి డైరెక్టర్, నాయిబ్రాహ్మణ డైరెక్టర్, ఆయా సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

అమిడ్యాలలో 13 లక్షల వ్యయంతో దేవస్థానం నిర్మాణం

ఉరవకొండ:ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07 భక్తి, సామాజిక ఐక్యత ఉట్టిపడేలా... అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలోని ఆమిడ్యాల మేజర్ గ్రామపంచాయతీలో నేడు అంగరంగ వైభవంగా వాల్మీకి మహర్షి నూతన విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. వాల్మీకి కుటుంబాలు సమిష్టిగా నిలబడి, చారిత్రక ఘట్టంగా నిలిచే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా వాల్మీకి కుటుంబీకులు, తమ ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి కోసం ఏకమై, స్వచ్ఛందంగా చందాలు పోగు చేసుకున్నారు. గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో వాల్మీకి దేవస్థానం పేరిట ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడి నిర్మాణానికి సుమారు ₹13 లక్షలకు పైగా వెచ్చించడం స్థానికుల అకుంఠిత భక్తికి నిదర్శనం. 80 వేల విగ్రహం, లక్షల విరాళాలు నేడు ప్రతిష్టించనున్న స్వామివారి విగ్రహాన్ని దాత దాసరి వెంకటేశులు రూ. 80,000 వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు. దేవస్థానం పనులు పూర్తి కావడం, విగ్రహం సిద్ధం కావడంతో, దైవ విగ్రహాన్ని చంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో ఆమిడ్యాల గ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఉద్యమం: 'కోటి సంతకాల' కార్యక్రమానికి శ్రీకారం

  అమరావతి,ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పలు నిరసన కార్యక్రమాల కార్యాచరణను ఆయన ఖరారు చేశారు.  కోటి సంతకాలు' సేకరణ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.     ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల సంతకాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు లక్ష్యం విధించారు.   'రచ్చబండ' కార్యక్రమాలు: ఈ నెల 10 నుంచి 22 వరకు రాష్ట్రంలో వివిధ సమస్యలపై 'రచ్చబండ' పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.  గవర్నర్‌ను కలవనున్న జగన్: ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలపై దృష్టి సారించాలని కోరుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ నేతలు నవంబర్ 26న గవర్నర్‌ను కలవనున్నారు.  నిరసన ప్రదర్శనలు: జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా నిరసనలకు వైఎస్సార్‌సీపీ...

వరంగల్ సీపీ ఎదుట మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి లొంగుబాటు.

వరంగల్‌ : నిషేధిత సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ సౌత్ బస్తర్‌ డివిజనల్ కమిటీ కార్యదర్శి మంద రూబెన్‌ అలియాస్‌ కన్నన్న @మంగన్న @సురేష్‌ (67) మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఎదుట లొంగిపోయాడు. రూబెన్‌ హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందినవాడు. 1979లో కాజీపేట ఆర్‌.ఈ‌.సి.లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రభావంతో ఉద్యమంలో చేరాడు. 1981 నుంచి 1986 వరకు బస్టర్‌ ప్రాంతంలో నేషనల్‌ పార్క్‌ దళ కమాండర్‌ లంక పాపిరెడ్డి నేతృత్వంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 1991లో చత్తీస్గఢ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఏడాది తర్వాత జైలును తప్పించుకొని మళ్లీ పార్టీలో చేరాడు. 1999లో పార్టీ నాయకుడు రామన్న సాక్షిగా బీజాపూర్‌ జిల్లాకు చెందిన పొడియం భీమేతో వివాహం జరిగింది. 2005 వరకు చురుకుగా పనిచేసిన రూబెన్‌ తర్వాత అనారోగ్యం కారణంగా కార్యకలాపాలనుంచి దూరమై గ్రామంలో కోళ్లు, గొర్రెలు పెంచుతూ జీవించాడు. అయితే, అదే సమయంలో పార్టీ దళాలకు ఆహారం, వసతి, సమాచారం అందించే బాధ్యతలు తీసుకున్నాడు. తన వయస్సు, అనారోగ్యం, ...

మహర్షి వాల్మీకి ఆశయాలు ఆదర్శప్రాయం: వై. భీమ రెడ్డి

  ఉరవకొండ, అక్టోబర్ 07, ట్రూ టైమ్స్ ఇండియా: వాల్మీకి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తనయుడు వై. భీమ రెడ్డి నిన్న ఉరవకొండ నియోజకవర్గంలోని తమ స్వగ్రామం కొనకొండ్లలో మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులర్పించారు. భీమ రెడ్డికి గ్రామ సర్పంచ్, వాల్మీకి సంఘం నాయకులు స్థానిక బస్టాండ్ ఆవరణలోని వాల్మీకి మందిరం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి జీవితంపై ప్రశంసలు: ఈ సందర్భంగా వై. భీమ రెడ్డి మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అని కొనియాడారు. పామరుడిగా ఉన్న వ్యక్తి సన్మార్గంలో నడచి, భగవంతుని కృపకు పాత్రుడై, సాక్షాత్తు రామాయణాన్ని రచించగలిగే ఉన్నత స్థితికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు. వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వాల్మీకులు లేదా బోయ కులస్తుల ఆరాధ్య దైవంగా నిలిచిన వాల్మీకి మహర్షి జయంతిని తమ స్వగ్రామంలో జరుపుకోవడం మరింత శుభప్రదమని తెలిపారు. ...

ఉరవకొండలో నేడు అందుబాటులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

  ఉరవకొండ: ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ బుధవారం (08-10-2025) ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం 10:30 గంటలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రి కార్యాలయం తెలియజేసింది. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ శ్రేణులతో చర్చించేందుకు మంత్రి ఉరవకొండకు రానున్నట్లు సమాచారం.

14 మందికి 9.05 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్

  ధర్మమ వరం :ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: సామాన్య నిరుపేదలకు కూడా కార్పొరేట్ తరహాలో వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం టిడిపి కార్యాలయంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 14 మంది లబ్దిదారులకు 9 లక్షల 5 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పరిటాల శ్రీరామ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి వైద్యాన్ని చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసే విధంగా... చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే ఈ 15 నెలల కాలంలో వైద్య రంగానికి ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని వారిని... సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలా మందికి సహాయం అందించినట్లు చెప్పారు.

గడేకల్లులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

ఉరవకొండ:న్యూస్ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07 _విడపనకల్లు మండలం గడేకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వాల్మీకి సోదరులు.వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు వాల్మీకి సోదరులు మాట్లాడుతూ హిందూ మానవ సమాజానికి ఆదర్శనీయుడైన వాల్మీకి మహర్షి రామాయణం అనే గ్రంథాన్ని రచించారని,మన మనస్సు మారితే ఎవరైనా మహానుభావులుగా ఎదగగలరని చేసి చూపించడమే కాకుండా,మానవాళికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి,మన కులదైవమైనటువంటి వాల్మీకి మహర్షి అని కొనియాడారు.ఆయన చూపిన సత్యం,ధర్మం,నీతి మార్గాల్లో మన వాల్మీకి వంశస్థులు నడుచుకుంటూ సమాజానికి సేవ చేయడంతో పాటు,అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.సాయంత్రం వాల్మీకి చిత్రపటాన్ని బంగారు వర్ణంతో అలంకరించిన అశ్వరథంలో పెట్టి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు హంపయ్య,దేవేంద్ర,గోపాల్,శేఖర్,భీమేష్(మాస్),హేమంత్,కృష్ణ,దస్తగిరి,రాముడు, సంజీవ్,లక్ష్మీకాంత్,నెట్టి,నాగరాజు,హరి,తిప్పేరుద్ర,సీతప్ప,అంజి,తిక్కన్న,సాయి,కిషోర్,పెద్దయ్య పలువురు వాల్మీకి సోదరులు పాల్గొన్నారు_

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్: పేదలకు వైద్యం అందని ద్రాక్షేనా? - కేశవ నాయక్

  ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: అమరావతి/హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు, ప్రొఫెసర్లు లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూనే, ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులు నిర్వహించడంపై గిరిజన ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సంపాదన ధ్యేయంగా మారి, విలాసవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేద, బలహీన వర్గాలకు అన్యాయం కేశవ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, కేవలం అధిక డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల పేదలు, నిరుపేదలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షలాది రూపాయల జీతం ఇస్తున్నప్పటికీ, ఆ జీతంతో సంతృప్తి చెందకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తూ, సంపాదనే ద్వేయంగా పనిచేస్తున్నారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం నాణ్యత తగ్గి, పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది" అని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున...

వాల్మీకి జయంతి: దేశమంతటా ఘనంగా వేడుకలు

  ట్రూ టైమ్స్ ఇండియా బృందం:అక్టోబర్ 07 అనంతపురం: ఆదికావ్యం రామాయణాన్ని రచించిన మహర్షి, కవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి జయంతిని దేశవ్యాప్తంగా అక్టోబరు 9, 2025 (గురువారం) నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో వాల్మీకి మహర్షి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి సమాజం (బోయ/బెస్త్) సహా అనేక వర్గాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. వాల్మీకి మహర్షి కేవలం రామాయణాన్ని అందించడమే కాకుండా, తన జీవిత మార్పు ద్వారా మనిషిలో పరివర్తన ఎంత ముఖ్యమో లోకానికి చాటిచెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయన ఆశయాలను, రామాయణం అందించిన ధర్మాన్ని స్మరించుకున్నారు. మాలపాటి శ్రీనివాసులు అభినందనలు వాల్మీకి జయంతి సందర్భంగా, ప్రముఖ వార్తా సంస్థ ట్రూ టైమ్స్ ఇండియా పత్రికా బృందం నాయకులు మాలపాటి శ్రీనివాసులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహర్షి వాల్మీకి అందించిన జ్ఞానం, రామాయణం నేటి సమాజానికి ఆదర్శమని మాలపాటి శ్రీనివాసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. "వాల్మీకి మహర్షి మన సంస్కృతికి, సాహిత్యానికి అందించిన సేవల...

సంతకాల సేకరణ, స్థానిక ఎన్నికలపై అనంతపురం కాంగ్రెస్ కీలక సమావేశం

  ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: అనంతపురం: ఏఐసీసీ, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశం అక్టోబరు 8, 2025 బుధవారం జరగనుంది. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ సెక్రెటరీ (ఆంధ్రప్రదేశ్) శ్రీ గణేష్ కుమార్ యాదవ్, ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ మస్తాన్ వలి, మరియు జిల్లా ఇంఛార్జ్ శ్రీ టి. నర్సింహులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ప్రధాన చర్చనీయాంశాలు ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలపై చర్చ జరగనుంది:  ఓట్ల దొంగ, గద్దె దిగు' సంతకాల సేకరణ: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా నిర్వహించనున్న 'ఓట్ల దొంగ, గద్దె దిగు' కార్యక్రమం కింద సంతకాల సేకరణపై కార్యాచరణ రూపొందించడం.  స్థానిక సంస్థల ఎన్నికలు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయం (సమయత్వం) మరియు వ్యూహాలపై చర్చించి, దిశానిర్దేశం చేయడం. డీసీసీ అధ్యక్షుల పిలుపు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు వై. మధూ సూధన్ రెడ...

గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం.. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  జార్ఖండ్ ట్రూ టైమ్స్ ఇండియాఅక్టోబర్ 07: జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.  అక్కడి గర్ల్స్ హాస్టల్‌లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌పై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో పది మంది యువతులు ఉండటం సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో హాస్టల్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.  కాలేజీల్లో చదువుతున్న యువతులు డబ్బుల కోసం ఇలా దారితప్పుతున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వాల్మీకులకు కత్వరలో ళ్యాణ మండపాన్ని నిర్మిస్తామన్న పరిటాల శ్రీరామ్

ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07: వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమేనని.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో శ్రీరామ్ పాల్గొన్నారు.  ముందుగా ఎర్రగుంట సర్కిల్ వద్ద నూతనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు వాల్మీకి సంఘం నాయకులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంఘం నాయకులను అభినందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో శ్రీరామ్ పాల్గొని మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకునే విధంగా విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించే విధంగా ఉంటుందన్నారు.  వాల్...

బిహార్‌ ఎన్నికల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 17 కీలక మార్పులు

దిల్లీ: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మొత్తం 17 కీలక మార్పులను ప్రకటించింది. ఈ నూతన సంస్కరణలు త్వరలో జరగనున్న బిహార్‌ శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి రానున్నాయి. ముఖ్య సంస్కరణలు: ఓటరు నమోదు, పోలింగ్‌ బూత్‌ల వద్ద సౌకర్యాలు  త్వరిత ఓటరు కార్డు డెలివరీ: ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లోనే ఓటరు కార్డు (EPIC) డెలివరీ చేయబడుతుంది.  బూత్‌ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు: పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు.  ఓటర్ల సంఖ్య తగ్గింపు: ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు తగ్గించారు.  EVMలలో మార్పులు: EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) బ్యాలెట్ పేపర్‌లపై అభ్యర్థి కలర్ ఫొటో ముద్రణ, అక్షరాల సైజును పెద్దదిగా చేస్తారు.   బూత్ స్థాయి సిబ్బందికి శిక్షణ: బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), BLO (బూత్ లెవల్ ఆఫీసర్), BLO సూపర్వైజర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వబడుతుంది. పర్యవేక్షణ, భద్రత పెంపు  100% వెబ్ కాస్టింగ్: ప్రతి పోలింగ్ బూత్‌లో నూరు శాతం వెబ్ కాస్టింగ్ తప్పనిసరి. ...

సవేరా కు వెళ్తే నీకు చావేరా

అనంతపురం ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:  వైద్యో నారాయణో హరి" అంటే వైద్యుడు నారాయణుడైన భగవంతునితో సమానం అని అర్థం    హాస్పిటల్లోనే ముప్పు ఉందంటే ఎవరిని నమ్మాలి సోమవారం రోజున కళ్యాణ్ దుర్గం లో ఒక మహిళకు ప్రమాదవశాత్తు ఒక కట్టే పుల్ల చెవికి పొడుచుకింది, వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని బయలుదేరారు  సవేరాకు తీసుకువెళ్లాలని చెప్పడంతో అనంతపురంలోని సవేరా హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది, చిన్న దెబ్బకు ఐసీయూలో అడ్మిట్ అవ్వాలని మనిషికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే 30000 రూపాయలు డబ్బు చెల్లించాలని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు....  కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ కు వెళ్దామని నిర్ణయించుకుని మరొక హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ ఆ కట్టెపుళ్లను సూక్ష్మంగా తొలగించడం జరిగినది ఇదేమి అంత ప్రమాదం కాదని చెవి పై భాగమున కుచ్చుకుంది కాబట్టి ఎటువంటి సమస్య లేదని అక్కడి వైద్యులు చెప్పడం ద్వారా కుటుంబ సభ్యులు ఊపిరిపించుకున్నారు....  సవేరా లో ప్రాణానికి ముప్పు ఉందని మొదటి డబ్బు చెల్లించాలని చెప్పడం ద్వారా కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయ...

మహర్షి వాల్మీకి జయంతి: ఘన నివాళులర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్

  ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07+ ఉరవకొండ: శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉరవకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ మహర్షి వాల్మీకి చిత్రపటానికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు పుష్పామాలాలంకరణ చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వాల్మీకి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతో పాటు  రేగాటి నాగరాజు, మోపిడి మాజీ సర్పంచ్ప  జంగడి గోవిందు,మోపిడి  రాజగోపాల్లు ఆమిద్యాల బావిగడ్డ ఆనంద్,వురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.