కర్నూలు, సెప్టెంబర్ 28, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ డిమాండ్ మరోసారి చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని విధాన మండలిలో హామీ ఇవ్వడం ఈ అంశానికి తాజా ఊపునిచ్చిందని హై కోర్ట్ సాధన సమితి నేత, సీనియర్ న్యాయ వాది జీ వి కృష్ణ మూర్తి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తో ఈ ప్రకటన తో రాయలసీమ ప్రజల్లో, న్యాయవాదుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసింది. సుదీర్ఘ పోరాటం, తాజా హామీ 2019 నుండి వివిధ ప్రభుత్వాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తీర్మానాలు చేసినా, న్యాయ రాజధానిగా ప్రకటనలు చేసినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ నెల 27, 2025 శనివారం నాడు ఆంధ్ర విధాన మండలిలో హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో మాట తప్పమని స్పష్టం చేసింది. ఈ హామీ కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్ల ఆందోళన నేపథ్యంలో రావడం గమనార్హం. సాధన సమితి నిరసన ముగింపు కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్లు ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భ...
Local to international