అమరావతి : (నవంబర్ 22) ఏపీ రాష్ట్రంలో 9 అర్బన్ లోకల్ బాడీలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ ప్రత్యేక పాలన 2026 మే 5 వరకు లేదా స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇందులో రాజాం, రాజమండ్రి, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పొడిగించబడిన 9 అర్బన్ లోకల్ బాడీలు 1)రాజమండ్రి 2)రాజాం 3)భీమవరం 4)నరసరావుపేట 5)చీరాల 6)మార్కాపురం 7)కావలి 8)గుడివాడ 9)జగ్గయ్యపేట
Local to international