Skip to main content

Posts

Showing posts from October 23, 2025

కర్నూలు బస్సు ప్రమాదంపై బిజెపి నేత దగ్గుపాటి శ్రీ రామ్ దిగ్భ్రాంతి

ఉరవకొండ: కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర బీ జే పీ సీనియర్ నేత దగ్గుపాటి శ్రీ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని విడుదల ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులను ఆదుకోవాలి ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తమ సానుభూతిని తెలియజేశారు. "బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే ఆయన దేశ ప్రధాని, రాష్ట్ర సియం ద్రుష్టి కి తీసుకెళ్లి నట్లు తెలిపారు.  ఏపీ వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారికి అవసరమైన  సహాయాన్ని అందించాలని కోరగా,అధికారులను  ఆదేశించినట్లు బిజెపి నేత దగ్గుపాటి శ్రీ రామ్  వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

ఏపీటీఎఫ్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పట్టు

  ఉరవకొండ (అనంతపురం జిల్లా), అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఉరవకొండ మండల నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన APTF మండల సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, మండల అధ్యక్షులు పాండురంగ, ప్రధాన కార్యదర్శి బీసీ ఓబన్న పర్యవేక్షణలో జరిగింది. ఎన్నికల అధికారిగా భాస్కర్ వ్యవహరించారు. నూతన కార్యవర్గం వివరాలు: సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన మండల కమిటీ వివరాలు: | పదవి | పేరు | |---|---| | గౌరవ అధ్యక్షులు | రెడ్డి లోకేష్ | | అధ్యక్షులు | వేణుగోపాల్ | | ప్రధాన కార్యదర్శి | ఏళ్ళ భువనేశ్వర్ చౌదరి | | గౌరవ సలహాదారు | ఓకే వెంకటేశ్ ప్రభు | | జిల్లా కౌన్సిలర్‌లు | బీసీ ఓబన్న, బి. చంద్రశేఖర్, ఎం. సలీం భాష, రాముడు, ఎం. లలిత, పాండురంగ, రామకృష్ణ, నరసింహులు, ఆదినారాయణ | కీలక డిమాండ్లు: ప్రభుత్వంపై ఏపీటీఎఫ్ ఒత్తిడి నూతన కమిటీ ఎన్నిక అనంతరం జరిగిన సమావేశంలో, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని APTF నాయకులు కీలక డిమాండ్లు చేశారు: ...

వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

  నెల్లూరు జిల్లా /ఉదయగిరి -  - చాకలకొండ పంచాయితీ ఏరియాలో చేరిన గొల్లవారిపల్లిలో విషాదం  - కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందిన నలుగురు

ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికిపైగా సజీవ దహనం కావడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

  వెస్ట్ జోగీశ్వర్‌లోని JMS బిజినెస్ సెంటర్‌లో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు పైఅంతస్తుల్లో కొంత మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం  లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించిన ముంబై అగ్నిమాపక దళం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదానికి గల కారణాలపై రావాల్సిన స్పష్టత.

తిరువూరు వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌

  తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. సోషల్‌ మీడియాలో రచ్చపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం.. ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని పల్లా చెప్పగా.. అవసరం లేదని యూఏఈ నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు  సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం  క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచన.

కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి

  పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బస్సులో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు..బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం  కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(DD 01 AN 9190) ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం

న్యూజిలాండ్ పై భారత్ విజయం

  Womens World Cup 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కాగా వర్షం కారణంగా మ్యాచ్ ని 44 ఓవర్లకు కుదించి.. 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 రన్స్ మాత్రమే చేసింది. దీంతో టీం ఇండియా 53 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తప్పక గెలివాల్సిన ఈ మ్యాచులో విజయం సాధించి భారత్ సెమీస్ చేరింది.

కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

కర్నూల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305 కర్నూలుప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061* కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075 కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814 9052951010 బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు *డా.ఏ.సిరి, జిల్లా కలెక్టర్, కర్నూలు*

కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!

  కర్నూల్ కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారి జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బస్సులో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు (22), తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా (27), పిల్వామిన్‌ బేబి (64), కిశోర్‌ కుమార్ (41) రమేష్‌(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌ (51), దీపక్‌ కుమార్‌ (24), అన్డోజ్‌ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్‌ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (...

తదుపరి సీజేఐ నియామకానికి ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం..

  నవంబర్‌ 23న పదవీ విరమణ చేయనున్న సీజేఐ జస్టిస్‌ గవాయ్‌.. కొత్త సీజేఐ పేరు సిఫారసు చేయాలని జస్టిస్‌ గవాయ్‌ను కోరిన కేంద్రం.. సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌కు తదుపరి సీజేఐగా అవకాశం..

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి...ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

అనంతపురం అక్టోబర్ 23 మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు, టిడిపి నాయకులు అందుబాటులో ఉండాలి* *అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశం*  అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున అనంతపురం నగరంలో అధికారం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నగరంలో డ్రైనేజీల్లో పూడిక కనిపించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ప్రధానంగా ఉన్న మరువ వంక, నడిమి వంక, పలు కాలనీలలో నీటి ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఈ వంకల సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, పోలీసులు అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. డివిజన్లో ప్రజలకు ఏ సమయంలోనైనా స్థానిక టిడిపి నాయకులు అందుబాటులో ఉండి, సహాయం చేయలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అనంతపురం అర్బన్ కార్యాలయం నెంబర్లను...

నిరంతరాయ తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి: మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశం

  అనంతపురం, అక్టోబర్ 23: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని రాంనగర్‌లో గల తన క్యాంప్ కార్యాలయంలో RWS (రూరల్ వాటర్ సప్లై) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జిల్లా అంతటా సీపీడబ్ల్యూఎస్ (Comprehensive Protected Water Supply) పథకాలలో మెరుగుదల కనిపించాలని, ప్రజలకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా, ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలపై మంత్రి అధికారులతో చర్చించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పంపుసెట్లను భర్తీ చేయాలని, ఎస్ఎస్ ట్యాంకులను (Storage Service Tanks) నింపాలని ఆదేశించారు. కొనకొండ్ల ఎస్ఎస్ ట్యాంకులో కూడా మెరుగుదల కనిపించేలా చూడాలని ఆయన సూచించారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యల...

కర్నూలు ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నేతపై సంచలన ఆరోపణలు: ఉద్యోగుల వివరాల లీక్‌తో బ్లాక్ మెయిల్

  కర్నూలు:అక్టోబర్ 23 నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు లీక్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నాయకుడు షేక్ సమీర్‌పై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. నకిలీ ధ్రువపత్రాలు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత, వారి వివరాలను తన కావాల్సిన వారికి అందించి బ్లాక్ మెయిలింగ్‌కు సహకరిస్తున్నారని భాషోపాధ్యాయ సంఘం (LTA) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ శ్యావలి బహిరంగంగా ఆరోపించారు. ముఠా నేత సహకారంతో బ్లాక్ మెయిల్? షేక్ సమీర్, ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను ఇచ్చిన/ఇప్పించిన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను తన వారికి చెప్పి బ్లాక్ మెయిల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారని శ్యావలి ఆరోపిస్తున్నారు. పది మంది ఉద్యోగులపై బ్లాక్ మెయిల్ ఉచ్చు? షేక్ సమీర్ చిరకాల మిత్రుడి కూతురు కూడా "ఫేక్/ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్‌తో" ఉద్యోగం చేస్తోందని శ్యావలి తెలిపారు. ఈమెతో పాటు నకిలీ/తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న మరో తొమ్మిది మందిని ఒక బ్లాక్ మెయి...

రూ. 10కే అద్భుత చికిత్స: యాక్సిడెంట్‌లో భుజం కోల్పోయిన యువకుడికి పునర్జన్మ

  అనంతపురం, అక్టోబర్ 23: ఘోర రోడ్డు ప్రమాదంలో భుజం మరియు చేయి తీవ్రంగా దెబ్బతిన్న ఓ యువకునికి శ్రీలక్ష్మి ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధునిక చికిత్స ద్వారా తిరిగి జీవితాన్ని ప్రసాదించింది. ఆపరేషన్ అనంతర చికిత్సలో అత్యాధునిక ఫిజియోథెరపీ విధానాలను ఉపయోగించి, నామమాత్రపు ఫీజుతో (కేవలం రూ. 10) చికిత్స అందించి, యువకుడి భుజాన్ని, చేతిని యథాస్థితికి తీసుకురావడంలో సెంటర్ బృందం విజయం సాధించింది. 'పది రూపాయల డాక్టర్' సేవలు: బిపిఎల్ (తెల్ల కార్డు) దారులకు కేవలం రూ. 10/- కన్సల్టేషన్ ఫీజు తో ఆధునిక వైద్య చికిత్స అందిస్తున్న ఈ కేంద్రం, అనంతపురం నగరంలో పేదలకు ఆశాదీపంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి రీహాబిలిటేషన్ సెంటర్ వ్యవస్థాపకులు, **'పది రూపాయల డాక్టర్'**గా ప్రసిద్ధి చెందిన డా. కోనంకి శ్రీధర్ చౌదరి, తమ బృంద సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సెంటర్ వివరాలు: | అంశం | వివరాలు | |---|---| | కేంద్రం పేరు | శ్రీ లక్ష్మి ఎముకలు, నరముల ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్| | స్థాపన | 2023 | | చిరునామా | నాయుడు ఎంపైర్, ద్వారక కన్వెన్షన్ సెంటర్ లేన్ వెనుక, గూటి రోడ్, అనం...

రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి' - తహశీల్దార్ మునివేలు

' బొమ్మనహాళ్  అక్టోబర్ 23: చౌక దుకాణాల (రేషన్ షాపుల) డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతి వినియోగదారుడికి నిత్యావసర రేషన్‌ను సక్రమంగా అందించాలని బొమ్మనహాళ్ తహశీల్దార్ మునివేలు స్పష్టం చేశారు. గురువారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో చౌక దుకాణాల నిర్వహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, డీలర్లు పాటించాల్సిన నిబంధనలను, సేవల నాణ్యతను గురించి వివరించారు. కీలక ఆదేశాలు:   సమయపాలన: ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపులను తప్పనిసరిగా తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండాలి.  వృద్ధులకు సేవ: 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు డీలర్లు స్వయంగా ఇంటికి వెళ్లి బియ్యాన్ని అందించాలి.   ఈ-కేవైసీ పూర్తి: మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.  * నిబంధనల అమలు: రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు సేవలు అందించాలని ఆదేశించారు. వినియోగదారుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా డీలర్లు జాగ్రత్తగా చౌక దుకాణాలను నిర్వహించుకోవాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ మ...

ద్వంద్వార్థాల సంభాషణలు సమంజసమా? -రైటర్ జంధ్యాల

  “ మునుపెన్నడూ లేనివిధంగా గత మూడేళ్ల కాలం నుంచి, చిత్రాల్లో వినోదం పేరిట 'అశ్లీలం' చోటు చేసుకుంది. ఇది ఆరోగ్యదాయకం కాదు. కావ్యాలలో ప్రాచీన గ్రంథాలలో బూతు లేదా?- అని కొందరి ప్రశ్న. ఆ కావ్యాలు, గ్రంథాలూ విద్య నేర్చిన చదువరుకు మాత్రమే పరిమితం. పైగా ఆ చదివేవారు సంస్కారవంతులూ. వారి అవగాహన వేరుగా ఉంటుంది. కాని అదే బూతుని చిత్రాల్లో వినిపిస్తే, అక్షర జ్ఞానం లేని పిల్లలకు కూడా సులభంగా అర్థమవుతుంది. "నువ్వొక వాక్యం రాస్తే - దాన్ని ముందుగా నీ తల్లికీ నీ భార్యకీ కూతురికీ వినిపించి వాళ్లు దాన్ని ఒప్పుకుంటేనే ప్రచురించు" అన్న కీ.శే. భమిడిపాటి కామేశ్వర రావు గారి వ్యాఖ్యని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇంట్లో మన పిల్లలు బూతు మాట్లాడితే, దండించే మనం ఇతరుల పిల్లలకి చిత్రాల ద్వారా బూతులు నేర్పడం సమంజసమా? "సెక్స్ చెయ్యడం తప్పు కాదు. తెరమీద చూపించడం తప్పు. వయలెన్స్ తెరమీద చూపించడం తప్పు కాదు - చెయ్యడం తప్పు!" అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత నిర్దేశకుడు డేవిడ్ లీన్. చక్కని హాస్యానికి బదులు ఇవాళ అశ్లీలం చోటు చేసుకోడం చాలా విచారకమైన విషయం. పైగా ప్రేక్షకుల మెచ్చుకుంటున్నారనుకోడం కూడా - న్యా...

సింహాసనాలు వద్దు, రాజులు వద్దు': ప్రపంచవ్యాప్తంగా 'నో కింగ్స్' ఉద్యమం ఉధృతం

' అమెరికా, అక్టోబర్ 23: ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులు ఉన్నఉన్న నాయకత్వాలకు వ్యతిరేకంగా అమెరికా వీధుల్లో ప్రారంభమైన "నో కింగ్స్" (No Kings) ఉద్యమం ఇప్పుడు సార్వత్రిక నిరసనగా మారింది. 'ప్రజలే అధికారం' (People are the Power) అనే నినాదంతో, రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే లక్ష్యంగా పౌరులు పసుపు రంగు దుస్తులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నియంతృత్వ ధోరణే ప్రధాన కారణం: ఈ ఉద్యమం తలెత్తడానికి ప్రధాన కారణం అమెరికన్ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల నియంతృత్వ ధోరణి మరియు అధికారం కేంద్రీకరణ. ఎన్నికలు, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రజల్లో ఏర్పడిన భయం, నాయకుడి చుట్టూ అధికారం కేంద్రీకృతం కావడంపై పెరుగుతున్న ఆందోళన ఈ ఉద్యమానికి మూలమైంది. 'అధికారం ఒక్క వ్యక్తి చేతిలోకి వెళ్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది' అనే భావన బలంగా మారింది. ఉద్యమానికి దారితీసిన కీలక అంశాలు:  నాయకుడి చుట్టూ అధికారం కేంద్రీకరణ: పాలకులలో నియంతృత్వ ధోరణి పెరగడం.   వ్యక్తి ఆరాధన (Cult of Personality): నాయకులను విమర్శకు అతీతులుగా, దేవుళ్లలా ఆరాధించే ధోరణి.  * వ్యవస్థల...

బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరు: మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశం

  ఉరవకొండ అక్టోబర్ 23:  ఆర్థిక,మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఉరవకొండ నియోజకవర్గంలోనిపెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురువారం పరిశీలించారు. ఇదే క్రమంలో ఆయన బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నాడు మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం, బెలుగుప్ప మండలం, శీర్పి గ్రామం వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శీర్పి చెరువు మరియు బెలుగుప్ప చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరు వెళ్లే కాలువను, ముఖ్యంగా పంపింగ్ స్టేషన్ 9, 10 నుండి నీరు సరఫరా అయ్యే మార్గాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, "జీడిపల్లి రిజర్వాయర్ నుండి పంపింగ్ స్టేషన్ 9, 10 ద్వారా బెలుగుప్ప, శీర్పి చెరువులకు నీరందించాలి. మా ప్రభుత్వం అన్ని చెరువులకు నీరు అందించేందుకు కట్టుబడి ఉంది" అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) గుంతకల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసనాయక్, డిఈ వెంకటరమణ, ఏఈఈ ఏ.సుదర్శన్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కల్తీ మద్యం పాపాత్ముడు జగనే

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ అమరావతిఅక్టోబర్ 23  : కల్తీ మద్యం పాపాత్ముడు జగనే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అయిదేళ్ల జగన్ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యానికి అధికారిక ముద్ర విచ్చలవిడిగా అమ్మకాలు చేశారన్నారు.
  దుబాయ్  దుబాయ్‌లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రోడ్‌ షోకు హాజరైన యూఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.  ఏపీలోని వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.* రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం*  దుబాయ్ దేశం టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందింది. టెక్నాలజీతో వచ్చే లాభాలను అర్థం చేసుకుని నేను ఐటీని ప్రమోట్ చేశాను. నాడు ఐటీని అందిపుచ్చుకున్నవాళ్లే ఇప్పుడు పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజాలుగా ఎదిగారు.  2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం. తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ 2071 నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. •భవిష్యత్ అంతా ఇన్నోవేషన్లు..వినూత్న ఆలోచనలదే. అమరావతిలో రూ.100కోట్లతో గ్రంధాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శోభా గ్రూప్ కు ధన్యవాదాలు.  నేను శోభా గ్రూప్ ప్రతినిధులను ఎప్పుడూ కలవలేదు... కానీ ఏపీకు...

ప్రభుత్వ ఆసుపత్రిలోసిబ్బంది నిర్లక్ష్యం.: మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్.

  ఉరవకొండ అక్టోబర్ 23 ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోరోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం  వహిస్తున్నారంటూ మాజీ  ఎం పీ టి సీ విజయ్ఉ  కుమార్ ఆరోపించారు. పట్టణంలోని గురువారం రోజున సుధాకర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కిందికి పడ్డాడు అతనికి చెయ్యికి కాలుకు తీవ్రంగా తగిలాయి దానిని గమనించి స్థానిక వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అక్కడ డాక్టర్లు కాంపౌండర్లు నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని  మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్  ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు

_కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప రైతులకు చేస్తుంది శూన్యం అంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎద్దేవా_

విడపనకల్:అక్టోబర్ 23 విడపనకల్ మండల కేంద్రంలోనున్న ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కరణం పుష్పావతి భీమరెడ్డి అధ్యక్షతన,ఇన్చార్జ్ ఎంపీడీవో సత్యబాబు ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులు సమస్యలపై వాడి వేడిగా చర్చ సాగింది.రబీ సీజన్ ఆరంభమైనప్పటికీ సబ్సిడీపై పప్పుశనగ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదంటూ అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు.ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచే ఎటువంటి సమాచారం లేదన్న వ్యవసాయ అధికారి.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతు,ఏవో భాస్కర్,వైస్ ఎంపీపీ మోదుపల్లి సునీత,డిప్యూటీ తాహాసిల్దార్ చంద్రశేఖర్ మరియు వివిధ శాఖ అధికారులు,పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు._

The Basavannalu (bulls ))that tilled /sowed for 9 Hours without fatigue

  Anantapur District (Bommanahal): An extraordinary event occurred in Anantapur district, proving that even with increasing mechanization in agriculture, the effort in traditional methods, especially the invaluable contribution of livestock, remains priceless. A pair of bulls (known locally as Basavannalu) belonging to Ampanna Swamy, a farmer from Govindawada village in Bommanahal mandal, earned the appreciation of the farmers by successfully completing the tilling/sowing of 20 acres for cowpea cultivation in just 9 hours. Without Rest or Fatigue... The cultivation work began at 5 AM on Thursday and was completed by 2 PM. This means the cowpea seeds were successfully sown across 20 acres in a mere 9 hours. Three farmers – Revanna, Ramudu, and Gudruvannappa – assisted farmer Swamy in shifts during this process. However, while the human participants changed, these Basavannalu ('bulls') surprisingly carried on the work continuously, with great enthusiasm and without any sign of fa...

వజ్రకరూరు రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక: రైతుల సమస్యలపై గళమెత్తిన నాయకులు

  వజ్రకరూరు (అనంతపురం జిల్లా): వజ్రకరూరు మండల రైతు సంఘం మహాసభ మండల కేంద్రంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు, అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి. వి. రూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు, డిమాండ్లు: సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యల గురించి చర్చ జరిగింది. రైతులు, రైతు నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా:  గిట్టుబాటు ధర లేమి: పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమై, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు.   భూములు కార్పొరేట్లకు అప్పగింత: జిల్లాలో, ముఖ్యంగా మండలంలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం దారుణమని, ఇది రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని హెచ్చరించారు.   నీటిపారుదల: హంద్రీనీవా ద్వారా మండలంలో పిల్ల కాలువలు (Distributary Canals) వెంటనే పూర్తి చేయాలని, తద్వారా ప్రతి ఎకరాకు సాగ...

అద్భుత ప్రతిభ చాటిన 'బసవన్నలు' : 9 గంటల్లో 20 ఎకరాల అలసంద సాగు పూర్తి!

  అనంతపురం జిల్లా (బొమ్మనహాల్): వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ, సాంప్రదాయ పద్ధతుల్లోని కృషి, ముఖ్యంగా పశు సంపద అందించే సహకారం వెలకట్టలేనిది అని నిరూపించే అపూర్వ ఘట్టం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బొమ్మనహాల్ మండలం, గోవిందవాడ గ్రామానికి చెందిన అంపన్న గారి స్వామి పొలంలో అలసంద సాగు కోసం ఉపయోగించిన జోడెద్దులు (బసవన్నలు) కేవలం 9 గంటల్లో 20 ఎకరాల సాగును పూర్తి చేసి రైతుల మన్ననలు పొందాయి. అలుపు సొలుపు లేకుండా... సాగు పనులు గురువారం ఉదయం 5 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు పూర్తయ్యాయి. అంటే, కేవలం 9 గంటల వ్యవధిలో అలసంద పంట విత్తనాన్ని 20 ఎకరాల్లో విజయవంతంగా సాగు చేశాయి. ఈ ప్రక్రియలో రైతు స్వామి తరఫున రేవన్న, రాముడు, గుడ్రు వన్నప్ప అనే ముగ్గురు రైతులు వంతుల వారీగా పాల్గొన్నారు. అయితే, మనుషులు మారినా, ఈ బసవన్నలు మాత్రం 'తగ్గేదే లేదంటూ' ఎలాంటి అలుపు సొలుపు లేకుండా, ఏకధాటిగా, అత్యంత ఉల్లాసంగా సాగును కొనసాగించడం అందరినీ అబ్బురపరిచింది. వాటి అద్భుతమైన కృషిని చూసి రైతులంతా ఉద్వేగానికి లోనై, "సహాబాష్ బసవన్నలు!" అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రైతులు కేరింతలు, ఈలలతో ఎద్దుల...