Skip to main content

Posts

Showing posts from October 5, 2025

శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్*

ఆంధ్రప్రదేశ్ : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.  .  జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతోన్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై సమీక్షించారు.  తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ప్రేమించాడు..వంచించాడు.

   - విడపనకల్ వజ్రకరూర్ కూడేరు మండలాలకు విలేకర్లు ఏరి? - అన్నా వదినలు, పిల్లలపై దాడి ఘటన పై చర్యలేవి? - వార్తలు రాసిన విలేకరులపై బెదిరింపా?  ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా పచ్చ పత్రికలో పనిచేస్తున్న ఉరవకొండ ఓ విలేఖరి ఒకరిని ప్రేమించి వంచించిన ఘరానా మోసగాడు. విద్యార్థి మృతికి అతను ప్రధాన కారకుడు.కొన్ని రోజులకు క్రితం రాయం పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ప్రేమించాడు. మరో వివాహిత మహిళలతో అక్రమ సంబంధం ఏర్పచుచేసుకొని అమ్మాయిని మోసగించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ససేమిరా అనటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారు. విలేకరి మీద దాడికి పాల్పటం కూడదని భావించిన ఆ కుటుంబీకులు క్షమా బిక్ష పెట్టారు.  కుక్క తోక వంకర అన్న చందంగా : కుక్క తోక వంకర అన్న చందంగా తిరిగి అదే బుద్ధి అవలంబించారు. ఉరవకొండ వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఓ వివాహిత మహిళపై కన్నేశారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బూటకపు వార్తలు రాసి బ్లాక్ మైలింగ్ కు పాల్పడ్డారు. బాధితురాలు భర్తకు ఫిర్యాదు చేయడంతోఆ విలేకరికి గట్టిగా బుద్ధి చెప్పారు. లేనిపక్షంలో...

‎ప్రజా సేవ–భద్రతా సమన్వయంపై మార్గదర్శక సూచనలు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

  ‎ ధర్మవరం:ట్రూ టైమ్స్ ఇండియా ‎జిల్లా శాంతి, అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరం – మంత్రి సత్యకుమార్ యాదవ్  ‎అభివృద్ధి–భద్రతా రంగాల్లో సమిష్టి కృషి చేయాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్ ‎ధర్మవరం, అక్టోబర్ 05:– సత్యసాయి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సతీశ్ కుమార్ ఆదివారం ధర్మవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లాలో ప్రజా సేవా కార్యక్రమాలు, భద్రతా వ్యవస్థ బలోపేతం, ప్రజలతో పోలీసు శాఖ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామరస్య వాతావరణం నెలకొల్పే దిశగా అధికారులు కృషి చేయాలని మంత్రి గారు సూచించారు. — సత్యసాయి జిల్లా అభివృద్ధి, ప్రజా భద్రతా వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కొత్తగా నియమితులైన తమరు ప్రజలతో స్నేహపూర్వక ధోరణిలో వ్యవహరించి, న్యాయపరమైన, బాధ్యతాయుతమైన విధానాలతో జిల్లా భద్రత...

డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ

 Anantapur:True Times India అనంతపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBRBP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రవణ్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు. నిందితుల అరెస్టుకు డిమాండ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇంచార్జ్ నరేష్ కొడవండ్ల మాట్లాడుతూ, దేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం అమానుషమన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేపడతామని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలను అవమానించేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ...

ట్రంప్‌ సుంకాలపై సిపిఐ(ఎం) నిరంతర పోరాటం

  - సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు భారతదేశాన్ని బెదిరించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తుందని సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 5,6 తేదీల్లో విజయవాడలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ”భారతపై ట్రంప్‌ సుంకాల యుద్ధం” అనే పుస్తకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కె.లోకనాధంతో కలిసి ఆయన ఆవిష్కరించారు.  బి.వి.రాఘవులు మాట్లాడుతూ.. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా 50శాతం పన్ను విధిస్తూ ఏకపక్షంగా ప్రకటించడం దారుణమని, రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నామని అదనంగా మరో 25శాతం పన్ను విధించడం మన సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు.  ప్రజలకు అవసరమైన వాటిని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలో ఆ దేశం నిర్ణయించుకునే హక్కుందని, కానీ దీనికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశం ఎక్కడ, ఏం కొనాలో బెదిరించి, లొంగదీసుకునే స్ధితికి చేరుకోవడం గర్హనీయమన్నారు. దానికి ధీటుగా జవాబివ...

శిల్పకళా అద్భుతం లేపాక్షి: పర్యాటకానికి కొత్త ఊపు

   అక్టోబర్ 5:   నాటి శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లుతున్న లేపాక్షి నేడు పర్యాటక కేంద్రంగా సరికొత్త గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఒకప్పుడు సంస్కృతీ, వర్తక కేంద్రంగా విలసిల్లిన ఈ క్షేత్రం, ఇప్పుడు తన అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగులుస్తోంది. విజయనగర వైభవం: రాతి గుట్టపై మైనపు ముద్దలు లేపాక్షిలోని ఎత్తైన రాతిగుట్టపై ఉన్న కఠిన శిలలు విజయనగర సామ్రాజ్య శిల్పుల చేతిలో మైనపు ముద్దలయ్యాయి. కఠినమైన రాతి గుండ్లు సైతం అద్భుత శిల్ప రూపాలుగా రూపుదిద్దుకున్నాయి. శిల్పాలతో పాటు, ఆలయ పైకప్పుపై భారీ తైలవర్ణ చిత్రాలు (ఫ్రెస్కోలు) కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. సుమారు రెండువేల సంవత్సరాల నుంచి తైలవర్ణ చిత్రాలు ఆలయాల్లో అగుపిస్తున్నా, లేపాక్షిలోని పాపనాశేశ్వర స్వామి వీరభద్ర సన్నిధిలోని రంగుల భారీ చిత్రాలు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పవచ్చు. ఈ చిత్రాల ఖ్యాతి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. విరూపణ్ణ, వీరణ్ణల సంకల్పం లేపాక్షి ఆలయ అద్భుతాలను ఆవిష్కరించిన ఘనత విరూపణ్ణ, వీరణ్ణ సోదరులకు దక్కుతుంది. వీరు పెనుకొండ నివాసి నంది లక్కిశెట్టి కుమారుల...