Skip to main content

Posts

Showing posts from September 20, 2025

ఉరవకొండలో విచ్చలవిడి మద్యం దుకాణాలు: నిబంధనలు గాలికేనా?

అనంతపురం జిల్లా:ఉరవకొండ మండలంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. గ్రామగ్రామాన గొలుసు దుకాణాలు (బెల్టు షాపులు) యథేచ్ఛగా నడుస్తున్నా, వీటిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు మద్యం దుకాణాలను బడి, గుడి ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కళాశాల పక్కనే ఒక మద్యం దుకాణం, మరో దేవాలయం సమీపంలో ఇంకో దుకాణం ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధికార పార్టీ అధినేత గొలుసు దుకాణాలను అరికడతామని బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పాత్రికేయులపై ఆరోపణలు గొలుసు రాత ల కట్టడికి పాత్రికేయుని రేటు రోజుకి రూ 33 /లు ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన కొంతమంది పాత్రికేయులు సైతం అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గొలుసు దుకాణాల నిర్వాహకులు, మద్యం దుకాణాల యజమానులు అక్రమాలను వెలుగులోకి రాకుండా చేయడానికి, నెలకు వెయ్యి రూపాయల ...

అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం

కర్నూలు:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే, అమరావతి ఫ్రీ జోన్ అంశం గురించి కూడా మాట్లాడాలి. రాజధాని ప్రాంతమైన అమరావతిలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ, రాయలసీమ ప్రాంతంలోని చదువుకున్న యువతకు అమరావతి ఫ్రీ జోన్‌గా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిని '5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని' అని అనడం ఎంతవరకు సబబు, న్యాయం, ధర్మం? రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమ ప్రాంతానికి 35% నిధులు తప్పనిసరిగా కేటాయించాలి. కర్నూలు హైకోర్టు బెంచ్: సుదీర్ఘ పోరాట చరిత్ర 16.11.1937 నాటి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం, రాయలసీమలోని కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలి. కానీ అది జరగలేదు. ఆంధ్ర హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోనీ, దానితో అయినా తృప్తి పడదాం అనుకున్నప్పటికీ, అది కూడా నెరవేర్చలేదు. ఏ పాలక పార్టీలు కూడా రాయలసీమ...

మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించారని గుర్తు చేశారు. 2024లో ఎన్నికలకు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రాయలసీమ ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగం చేసి నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

విడపనకల్ మండలం లో అంగన్వాడి సెంటర్ల ఆకస్మిక తనిఖీ - ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ హరిప్రసాద్ యాదవ్.

ప్రీ స్కూల్ హాజరీ శాతంపెరిగేలా చర్యలకు ఆదేశాలు విడపనకల్ మండలంలోని పలు గ్రామాల లోని ఎస్సీ కాలనీలోని గల అంగన్వాడీ కేంద్రాలను  ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గుంతకల్ రెవెన్యూ డివిజనల్ మెంబర్ హరి ప్రసాద్ యాదవ్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువులను పోషన్ ట్రాకర్ యాప్తో పాటు రిజిస్టర్లలో తప్పని సరిగా నమోదు చేయాల న్నారు. కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటిస్తూ పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అలాగే పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తూ ప్రీస్కూల్ హాజరు శాతం పెరిగేలా చూడాల న్నారు. అనంతరం రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలను అందించారు అలాగే విడపనకల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ ను మరియు విడపనకల్ పీ హెచ్ సీ ని సందర్శించారు.   ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు విడపనకల్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ కె.సురేష్ బాబు అలాగే అంగన్వాడి టీచర్లు  విడపనకల్లు  గౌసియా డోనేకల్లు సునీత గడేకల్లు హేమలత మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

పాల్తూరు గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం .

  స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ అనే పదాలు 'స్వచ్ఛ భారత్' మరియు 'గాంధీ జయంతి' వంటి కార్యక్రమాలతో ముడిపడి ఉన్నాయి. అవి ఒకేలా అనిపించినా, వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.విడపనకల్ మండలం ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ     ఇది భారత ప్రభుత్వం 2014లో ప్రారంభించిన దేశవ్యాప్త పారిశుద్ధ్య ఉద్యమం. స్వచ్ఛ భారత్ అభియాన్ (స్వచ్ఛమైన భారతదేశ ఉద్యమం)లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్యక్రమాలు చేపడతాయి.  లక్ష్యం: బహిరంగ మల విసర్జన లేని భారతదేశం (ODF) మరియు పరిశుభ్రమైన దేశంగా మార్చడం.   ఆంధ్రప్రదేశ్ పాత్ర: ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం 'స్వచ్ఛ ఆంధ్ర'గా పిలవబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి, బహిరంగ మల విసర్జనను తగ్గించడానికి, గ్రామాలు మరియు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివి ఉంటాయి. స్వచ్ఛ దివస్ (గాంధీ జయంతి)   అక్టోబర్ 2: ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున 'స్వచ్ఛ దివస్' (పరిశుభ్రతా దినోత్సవం)గా జరుపుకుంటా...

ఎస్ ఆర్ ఐ టి కళాశాల ఆత్మహత్యలపై,, విద్యార్థుల సమస్యలపై యూనివర్సిటీ తక్షణమే విచారణకై డిమాండ్

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జెఎన్టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్యను శనివారం కలిసివిద్యార్థి సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన,  పి డి యస్ యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర, ఏ ఐ ఎఫ్ డి యస్ జిల్లా కార్యదర్శి సిద్దు   మాట్లాడుతూ యస్ ఆర్ ఐ టి  ఇంజనీరింగ్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులను పూర్తిగా వ్యాపార వస్తువుగా మాత్రమే చూడడం జరుగుతుంది విద్యార్థుల ప్రాణాలను తాకట్టు పెట్టి లాభాలకే పరిమితం అవుతున్న ఇలాంటి కళాశాల నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండించాలి ముఖ్యంగా ఆ కళాశాలలో విద్యార్థుల సమస్యల్లో ఆహార విషయంలో గాని తరగతుల నిర్వహించడంలో గాని విద్యార్థులు ఏదైనా బాగాలేదు అంటే ఆ విద్యార్థులపై కక్ష కట్టి వారిని వేధించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటివరకు ఆ కళాశాలలో విద్యార్థుల బలిదానాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి మొన్న ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆ కళాశాలలోని ఉరేసుకొని చనిపోవడం గతింలో మాదిరిగా ఆ మరణానికి సంబంధించి వాస్తవాలను బయటకు రాకుండా కళాశాల యాజమ...

హౌసింగ్ బోర్డ్ బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి*

  ఉరవకొండ : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హౌసింగ్ బోర్డ్ బీసీ బాలికల హాస్టల్ వాడను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.  అనంతపురం లో ఉన్నటువంటి మహాత్మ పూలే విగ్రహం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం  నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు..   ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, ఏ ఐ డి ఎఫ్ ఎస్  జిల్లా ప్రధానకార్యదర్శి సిద్ధు పిడిఎస్యు  నగర అధ్యక్షుడు శంకర్   మాట్లాడుతూ శుక్రవారం రోజున అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డ్ లో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఒక విద్యార్థిని ఆ హాస్టల్ వార్డెన్ వేధింపులకు తట్టుకోలేక సూసైడ్  చేసుకుంది కానీ అధికారులు మాత్రం విద్యార్థిని తప్పు చేసిందంటూ సమాధానం ఇస్తూ నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు ఏది ఏమైనా ఒక విద్యార్థిని హాస్టల్ వార్డెన్ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ విద్యార్థిని పరామర్శించే సమయాన్ని కూడా జిల్లా అధికారులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం   ఈ పరిస్థితుల్లో హౌసింగ్ బోర్డ్ బీసీ కులాలు బాలికల హాస్టల్ వార్డెన్‌ను  తక్షణమే సస్పెండ్ చేయాలి.  పర్యవేక...