Skip to main content

Posts

కర్నూలు హైకోర్టు సాధన సమితి అత్యవసర సమావేశం: కీలక డిమాండ్‌లు, కార్యాచరణ ప్రణాళిక!

కర్నూలు: రాయలసీమకు హైకోర్టు బెంచ్ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న కర్నూలు హైకోర్టు సాధన సమితి, 18-10-2025, శనివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, రాజవిహార్ కేంద్రం వద్ద అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు సమావేశంలో మొదటి అజెండాగా, ఇటీవల 16-10-2025న భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లు రాయలసీమ ప్రాంతం కర్నూలుకు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు బెంచ్‌ను ఇస్తామని చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చినందుకు గాను ఇరువురికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సమితి తీర్మానం చేసి, రిజిస్టర్‌లో నమోదు చేసుకుంది. రూ. 600 కోట్లు కేటాయించాలని డిమాండ్ తదుపరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ బాబులు హైకోర్టు బెంచ్ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే రాయలసీమ-కర్నూలుకు ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం శాశ్వత భవనం నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని సమ...

93 ఏళ్లలో తండ్రి అయిన డాక్టర్‌ — 57 ఏళ్ల వయసు తేడా కలిగిన భార్యతో బేబీ!

  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 93 ఏళ్ల వైద్యుడు డాక్టర్‌ జాన్‌ లెవిన్‌ మరోసారి తండ్రిగా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన తన 37 ఏళ్ల భార్య డాక్టర్‌ యాంగ్‌ యింగ్‌ లూతో కలిసి ఐవీఎఫ్‌ (IVF) పద్ధతిలో 2024 ఫిబ్రవరిలో కుమారుడు గాబీకి జన్మనిచ్చారు. ఈ జంట మధ్య 57 ఏళ్ల వయసు తేడా ఉండటమే కాకుండా, లెవిన్‌ వయస్సు కారణంగా ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. డాక్టర్‌ లెవిన్‌కు ఇప్పటికే 60 ఏళ్లు దాటిన ముగ్గురు పిల్లలు, పది మంది మనవళ్లు, ఒక ముని మనవడు ఉన్నారు. అయినా కూడా ఆయన వృద్ధాప్యంలో తండ్రిగా మారడంపై చర్చలు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆయన ఉత్సాహాన్ని ప్రశంసిస్తే, మరికొందరు ఇంత వయసులో పిల్లల్ని కనడం సముచితం కాదని విమర్శిస్తున్నారు. లెవిన్‌ ప్రకారం, “వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను ఇంకా సజీవంగా ఉన్నాను, జీవితం పట్ల ఉత్సాహం కోల్పోలేదు. నా భార్యతో కలిసి కొత్త జీవితాన్ని స్వాగతించడం సంతోషంగా ఉంది,” అని తెలిపారు. మరోవైపు, ఆయన భార్య యాంగ్‌ యింగ్‌ లూ కూడా తన భర్త ఆరోగ్యంగా ఉన్నారని, కుమారుడితో ఆనందంగా జీవిస్తున్నారని చెప్పింది. వైద్య నిపుణులు మాత్రం పెద్ద వయసులో తల్లి...

మెలియాయిడోసిస్ లక్షణాలు ఇవే — జాగ్రత్తగా ఉండాలి

  ట్రాపికల్ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ మెలియాయిడోసిస్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి బర్క్‌హోల్డేరియా సూడోమాలి (Burkholderia pseudomallei) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా మట్టి, నిల్వ నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు గాయాల ద్వారా, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి శరీరంలోకి చేరాక, 48 గంటల్లోనే ప్రాణాంతక స్థితికి తీసుకువెళ్ళే ప్రమాదం ఉంది. వైద్య నిపుణుల ప్రకారం, మెలియాయిడోసిస్ లక్షణాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. మొదటగా తీవ్ర జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత న్యుమోనియా, శ్వాసలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, లివర్ లేదా ప్రొస్టేట్‌లో అబ్బెస్‌లు (పుళ్ళు) ఏర్పడవచ్చు. కొంతమందిలో ఈ వ్యాధి సెప్సిస్ అనే తీవ్రమైన రక్త ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్‌కి అత్యంత సులభంగా గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వర్గ...

సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి – హరీష్ బాబు

తాడిమర్రి, అక్టోబర్ 17:– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ తాడిమర్రి మండలంలోని సీ.సీ. రేవు మరియు మరి మేకలపల్లి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యపై తక్షణ స్పందన వ్యక్తం చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (CBR) ద్వారా ముంపు కారణంగా ప్రస్తుత రహదారి పూర్తిగా ఉపయోగించరానిదిగా మారి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందిన వెంటనే, మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆర్ & బి శాఖ మరియు పులివెందుల బ్రాంచ్ కెనాల్ (PBC) అధికారులకు కొత్త రహదారి నిర్మాణంపై సంయుక్త ఇన్స్పెక్షన్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు.  మంత్రి ఆదేశాల మేరకు, శుక్రవారం ఆర్ & బి అధికారులు, PBC ఇంజినీర్లు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు లు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి, కొత్త రహదారి వేయడానికి అనువైన ట్రాక్ మరియు సైట్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ,.. ముంపు కారణంగా ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి జరుగుతోంది. రో...

శ్రీ జగద్గురు కరిబసవ స్వామి గవిమఠ సంస్థానం:

- లక్ష్యంతో మసకబారుతున్న ఆధ్యాత్మిక కేంద్రం ఉరవకొండ :  అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో గల శ్రీ జగద్గురు కరిబసవ స్వామి గవిమట సంస్థానం ఒకప్పుడు 770 మఠాలకు మూల మఠంగా, గొప్ప ఆధ్యాత్మిక శైవ క్షేత్రంగా విరాజిల్లింది. కోట్లాది రూపాయల విలువైన స్థిర చరాస్తులు ఉన్న ఈ మఠం, శ్రీ కరిబసవ స్వామి జీవ సమాధి క్షేత్రంగా భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఈ సంస్థానం యొక్క ప్రతిష్ట నానాటికీ మసకబారేలా చేస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలక్ష్యం పాలైన గురువుల విగ్రహాలు మఠంలోని జీవ సమాధి క్షేత్రంలో కొలువై ఉన్న పలువురు గురువుల విగ్రహాలు ఆలనా పాలనకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. మొదటి చిత్రం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. విగ్రహానికి వేసిన రంగులు పాలిపోయి, శిథిలావస్థకు చేరి, కళ్ళు కూడా సరిగా కనిపించని స్థితిలో ఉన్నాయి. భక్తుల పూజలకు దూరమవుతున్న ఈ విగ్రహాల నిర్వహణపై మఠం పెద్దలు దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ధ్వంసమైన బసవేశ్వర విగ్రహాలు: శాస్త్ర విరుద్ధమని భక్తుల ఆగ్రహం రెండవ చిత్రం మఠం ఆవరణంలోని మరో దుస్థితిని కళ్ళకు కడుతోంది. గోడ పక్కన ప్రతిష్టించి...

ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు....... రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

  - గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువే .  - గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రలో పెడుతుంది . నెల్లూరు :నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ........ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు. అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగినా, వైసిపి నాయకులు దానిని టిడిపి తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం చంద్రబాబుకు లోకేష్ కు ఐటి రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు. దాదాపు కోటి ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్తు గూగుల్ డేటా సెంటర్కు అవసరమని ఆ విద...

విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలి – మంత్రి సంధ్యారాణి ఆదేశాలు

సాలూరు: జాండీస్‌, మలేరియాతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె శనివారం స్వయంగా సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. “విద్యార్థులు పూర్తిగా కోలుకునేంతవరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. ఒక్క విద్యార్థి ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదు,” అని ఆమె స్పష్టం చేశారు. సాలూరు పరిసర ప్రాంతాల్లోని పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) డాక్టర్లు సమ్మెలో ఉన్న కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది విద్యార్థులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, అక్కడి వైద్య సిబ్బందికి మంత్రి సంధ్యారాణి ప్రత్యేక సూచనలు చేశారు. ఆమె వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, “సిబ్బంది కొరత ఉన్నా కూడా విద్యార్థుల వైద్యం విషయంలో ఎటువంటి ...