Skip to main content

Posts

పని ‘హక్కు’కాదట

 ! పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు.న్యాయమైన,సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది.గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది. అంతేకాదు,నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి.దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక హక్కులు.‘భారత ప్రజాస్వామ్యా నికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు’అంటారు నానీ ఫాల్కీవాలా. పనిహక్కు అనేది ప్రజలకు ఉత్పాదక పనిలో పాల్గొనే ప్రాథమిక హక్కును సూచిస్తుంది.దీనిని 1948 ఐరాస మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో పొందుపరిచారు.భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఆర్టికల్‌ 21, 41 ప్రకారం…జీవించే హక్కులో భాగంగా పనిచేసే హక్కుకు హామీ ఇస్తుంది.ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ అసంభవం’ అంటారు గాంధీజీ. కానీ,ఆర్థిక స్వాతంత్య్రం…పని లేకుండా సాధ్యం కాదు.పని-కేవలం ఆదాయం సంపాదించే మార్గం మాత్రమే కాదు,అది ఒక వ్యక్తికి గౌరవం,సామాజిక భాగస్వామ్యం,ఆత్మగౌరవాన్ని కల్పించడం. ‘జాతీయ కార్మిక విధానం 2025-2047 ముసాయిదా’ కొద్ది రోజుల్లో అమలులోకి రాన...

శ్రీశైలం దర్శనం: పయ్యావుల శ్రీనివాసులు

  శ్రీ శైలం మంత్రి పయ్యావుల కేశవ్ గారి సోదరులు పయ్యావుల శ్రీనివాసులు గారు ప్రముఖ శైవక్షేత్రం అయిన శ్రీశైలం దేవస్థానంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని ప్రధాన దైవాలైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.  దర్శనం: వారు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.  పండితుల ఆశీర్వాదం: దర్శనానంతరం ఆలయానికి చెందిన వేద పండితులు శ్రీనివాసులు కి ఆశీర్వచనం అందించారు. ఈ ఆశీర్వచనం హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  సన్మానం: వేద పండితులు సంప్రదాయబద్ధంగా శాలువాలు కప్పి, తీర్థ ప్రసాదాలు అందించి శ్రీనివాసులు గారిని సన్మానించారు.ఈ పర్యటన వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటనగా జరిగింది.

విరుగుడు లేని విషం.. ఆముదం గింజలతో ఉగ్రవాదుల కొత్త వ్యూహం.. దేశంలో విధ్వంసానికి ప్లాన్!

  ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రెసిన్ విషం తయారీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంతో మనిషి ప్రాణాలను తీయగల 'రెసిన్' అనే విషాన్ని ఆయుధంగా వాడేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ విషానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఇటీవల గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్) అరెస్ట్ చేసిన హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్, రెసిన్ తయారుచేసే పనిలో ఉన్నట్లు తేలడంతో నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. సులభంగా లభ్యం సాధారణంగా లభించే ఆముదం గింజల నుంచి రెసిన్‌ను తయారుచేస్తారు. గింజలను గుజ్జుగా మార్చి, ఒక ప్రత్యేక విధానంలో ఈ విషాన్ని సంగ్రహిస్తారు. మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ కుట్ర బయటపడింది. మన దేశంలో ఆముదం గింజలు చాలా సులభంగా లభిస్తాయి. ఆన్‌లైన్‌లో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమ్ముతుండటం ఇప్పుడు పెను ముప్పుగా మారింది. రెసిన్ పొడి, ద్రవం లేదా పొగమంచు రూపంలోకి మార్చి ఆహారం, నీటిలో కలపడం ద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో ప్రయోగ...

బకాయిల చెల్లింపుపై సీపీఎం వినతి

 . ఉరవకొండ మండలంలో పెండింగ్‌లో ఉన్న రూ. 33 లక్షలకు పైగా నిధులు 40 రోజులుగా 'వెండర్ ఖాతా'లోనే నిధులు; లబ్ధిదారులకు అందని మొత్తం సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు స్పందించాలని సీపీఎం డిమాండ్‌  ఉరవకొండ మండలంలో వివిధ పథకాల కింద రైతులకు, ప్రజలకు రావాల్సిన రూ. 33.98 లక్షల రూపాయల బకాయిలను వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని సీపీఎం పార్టీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్కిస్టు) మండల నాయకత్వం ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గారిని కోరింది. నిధులు విడుదలై 40 రోజులు గడిచినా, ఇంకా 'వెండర్ అకౌంట్'లోనే నిలిచిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా సీపీఎం నాయకులు ఎన్. మధుసూధనన్ నాయుడు కె. సిద్దప్ప కలిసి ఎంపీడీవోకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.  పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలు ప్రభుత్వం గత 40 రోజుల క్రితమే 'వెండర్ అకౌంట్'లోకి జమ చేసినప్పటికీ, కస్టమర్ల (లబ్ధిదారుల) ఖాతాలకు జమ చేయకుండా పెండింగ్‌లో ఉన్న నిధుల వివరాలను సీపీఎం నాయకులు ఈ విధంగా వివరించారు:  ఉద్యాన పంటల బకాయిలు (డీఆర్‌డీఏ ద్వారా): రూ. 66,38,68/-   హౌసింగ్ మరియు వాటర్ ...

డాక్టర్ అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగం ఇచ్చారు. సీ యం. చంద్రబాబు

 75 ఏళ్ల భారత రాజ్యాంగ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ హైలైట్స్..! ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడు తూ మన రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచింది.. చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛఅని అన్నారు.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం ఇచ్చారు.. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి.దేశంలోని ప్రతి ఒక్కరికీ ఎలాంటి తారతమ్యం లేకుండా అంబేడ్కర్ ఓటు హక్కు ఇచ్చారు.. చాలా గొప్పవని భావించిన దేశాల్లో కూడా మొదట్లో మహిళలకు ఓటుహక్కు లేదు.దేశంలో ఎన్నో పాలసీలు చూశాను.. 2014లో 11వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోంది.. 2038 నాటికి భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోంది2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం.ప్రజాస్వామ్యం దారి తప్పినప్పుడు న్యాయవ్యవస్థే దాన్ని గాడిన పెడుతుంది.. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయిసోషల్ మీడియాలో ప్...

మన రాజ్యాంగం నాలుగు స్తంబాలపై నిలబడి ఉంది.. సీ జే ఐ గవాయ్.

   అమరావతి : మన రాజ్యాoగం నాలుగు స్తంబాలపై నిలబడి ఉంది. ప్రతి పౌరుణ్ణి దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అంబేద్కర్ రచించారని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ఉద్ఘాటించారు . 75 ఏళ్ల భారత రాజ్యాంగ సదస్సులో CJI జస్టిస్ బీఆర్ గవాయ్ అదిరి పోయింది. CJIగా ఇది ఆయన చివరి కార్యక్రమం.. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి.. CJIగా నా చివరి కార్యక్రమం కూడా అమరావతిలోనే కావడం విశేషం.ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూమరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను.. సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు.ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది.. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ.. అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలి.అOబేద్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంగా భావించలేదు.. కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారు. కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం.. కొన్ని అంశాల్లో అది చాలా కఠినం.రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే.. మొదటి రాజ్యాంగ సవరణ చేసుకున్నాం.. రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగానికి మొదటి సవరణ చేసుకున్నాం.రాజ్యాంగ...

18న మార్కా పురం లో ప్రజా దర్బార్

   మార్కాపురం "ప్రజా దర్బార్" కార్యక్రమం ప్రకటన | వివరాలు | సమాచారం | |---|---| | తేదీ | నవంబర్ 18, 2025 | | వారం | మంగళవారం | | సమయం | ఉదయం 10:00 గంటలకు | | వేదిక | ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం, మార్కాపురం పట్టణం | | ఆధ్వర్యం | మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు |  ముఖ్య అంశాలు  ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు.  నియోజకవర్గ ప్రజలు తమకు ఉన్న ఏ సమస్య ఉన్నా ఈ "ప్రజా దర్బార్" కార్యక్రమానికి నేరుగా విచ్చేసి అధికారులకు విన్నవించుకుని, సమస్యలను పరిష్కరించుకోగలరు.   అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని ప్రజలకు విజ్ఞప్తి.