Skip to main content

Posts

ముస్లిం దూదేకుల సర్టిఫికెట్ల నమోదుకు డిమాండ్

  హాల్ టికెట్లలో 'ముస్లిం'గా మార్చాలని లెనిన్ బాబు వినతి ఉరవకొండ డిసెంబర్ 4: ఇండియన్ హిందూ దూదేకులగా విద్యార్థుల సర్టిఫికెట్లు, హాల్ టికెట్లలో జరుగుతున్న నమోదుకు బదులుగా ఇండియన్ ముస్లిం దూదేకులగా నమోదు చేయాలని కోరుతూ నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు లెనిన్ బాబు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఈ సందర్భంగా లెనిన్ బాబు మాట్లాడుతూ, నూర్ భాషా దూదేకుల, పింజారి, లద్దాఫ్ అని పిలవబడే తమ కుల పూర్వీకులు ఎన్నో తరాలుగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి పాటిస్తున్నారని తెలిపారు. తమ పుట్టుక నుంచి మరణం వరకు అన్ని కార్యక్రమాలు ఇస్లాం పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని, తమ కులం ముస్లిం మైనారిటీలలో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. అయితే, అవగాహన లోపం కారణంగా స్కూళ్లలో ఉపాధ్యాయులు తమ పిల్లల సర్టిఫికెట్లలో, చదువులలో కొలమానంగా చూపిస్తూ పది (10వ) తరగతి హాల్ టికెట్ల నందు బీసీల నందు హిందూ దూదేకులగా నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గుర్తించి, మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తమ విద్యార్థుల హాల్ టికెట్లు, టీసీలు (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు), ఇతర సర్టిఫికెట్ల నందు ఇండియన్ ...
   ​అనంతపురం, నార్పల మండలం: ప్రభుత్వం పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ అంటూ నినాదాలు ఇస్తున్న వేళ... క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజలను, రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం దుగుమర్రి గ్రామం నిరూపించింది. భూమి మ్యుటేషన్ కోసం ఒక VRO (గ్రామ రెవెన్యూ అధికారి) ఏకంగా ₹38,000 లంచం డిమాండ్ చేసిన ఆడియో లీక్ కావడంతో జిల్లాలో సంచలనం రేకెత్తింది. ​అవినీతి ధైర్యం... అహంకారం: దుగుమర్రి గ్రామానికి చెందిన రైతు తన భూమి మ్యుటేషన్ కోసం VRO వెంకోబరావు స్వామి వద్దకు వెళ్లగా, అధికారి అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించినట్లు ఆడియో స్పష్టం చేస్తోంది. "సంతకం కావాలంటే ₹38,000 ఇవ్వాల్సిందే" అని నేరుగా లంచం డిమాండ్ చేయడమే కాకుండా, MRO (మండల రెవెన్యూ అధికారి) ప్రమేయం గురించి రైతు ప్రశ్నించగా, "నా వాటా నాకు ఇచ్చేయాల్సిందే... MRO తో మీరే మాట్లాడుకోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం రెవెన్యూ వ్యవస్థలోని దారుణమైన స్థితిని కళ్లకు కట్టింది. ​ప్రజాధనం కాదు, దోపిడీ: ఇది లంచగొండి రాజ్యం! ప్రభుత్వ పథకాలు, సేవలు ఇంటికే వస్తాయని చెబుతున్నా... రైతులకు తమ స...

సిగ్గులేని వ్యవస్థ: రెవెన్యూ శాఖలో VROల దోపిడీ ​"లంచం ఇస్తేనే సంతకం... MRO తో మీకేం పని?": రైతులను పీడిస్తున్న నార్పల VRO

  ​అనంతపురం, నార్పల మండలం: ప్రభుత్వం పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ అంటూ నినాదాలు ఇస్తున్న వేళ... క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజలను, రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం దుగుమర్రి గ్రామం నిరూపించింది. భూమి మ్యుటేషన్ కోసం ఒక VRO (గ్రామ రెవెన్యూ అధికారి) ఏకంగా ₹38,000 లంచం డిమాండ్ చేసిన ఆడియో లీక్ కావడంతో జిల్లాలో సంచలనం రేకెత్తింది. ​అవినీతి ధైర్యం... అహంకారం: దుగుమర్రి గ్రామానికి చెందిన రైతు తన భూమి మ్యుటేషన్ కోసం VRO వెంకోబరావు స్వామి వద్దకు వెళ్లగా, అధికారి అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించినట్లు ఆడియో స్పష్టం చేస్తోంది. "సంతకం కావాలంటే ₹38,000 ఇవ్వాల్సిందే" అని నేరుగా లంచం డిమాండ్ చేయడమే కాకుండా, MRO (మండల రెవెన్యూ అధికారి) ప్రమేయం గురించి రైతు ప్రశ్నించగా, "నా వాటా నాకు ఇచ్చేయాల్సిందే... MRO తో మీరే మాట్లాడుకోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం రెవెన్యూ వ్యవస్థలోని దారుణమైన స్థితిని కళ్లకు కట్టింది. ​ప్రజాధనం కాదు, దోపిడీ: ఇది లంచగొండి రాజ్యం! ప్రభుత్వ పథకాలు, సేవలు ఇంటికే వస్తాయని చెబుతున్నా... రైతులకు తమ సొ...

న్యాయ వ్యవస్థ లో న్యాయ వాదులుఒక కీలక స్తంభం. -న్యాయవాది కోమటి రెడ్డి స్వాతి

  ఘనంగా న్యాయ వాద దినోత్సవ వేడుకలు ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 3: ​న్యాయవాద దినోత్సవాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న జరుపుకుంటారని తెలంగాణ హై కోర్ట్ సీనియర్ న్యాయవాది కోమటి రెడ్డి స్వాతి అన్నారు. ​ఈ దినోత్సవాన్ని భారతదేశపు తొలి రాష్ట్రపతి, సుప్రసిద్ధ న్యాయవాది, పండితుడు, భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా జరుపుకోవడం ఆనవాయితీ. అని ఆమె తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కేవలం స్వాతంత్ర్య సమరయోధులు, రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, ఆయన అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన సేవలను గౌరవిస్తూ, న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్రను గుర్తుచేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారని స్వాతి తెలిపారు. ​న్యాయవాద దినోత్సవం రోజున న్యాయం, సత్యం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే ప్రతి న్యాయవాదిని గౌరవిస్తారు. ​సమాజంలో న్యాయం: న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక కీలకమైన స్థంభం. వారు చట్టబద్ధతను పరిరక్షించడంలో, పౌరుల హక్కులను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ​మార్గదర్శకత్వం: చట్టపరమైన చిక్కుల్లో ఉన్న సాధారణ ప్రజలకు మార్గనిర్దేశం చేసి, న్యాయం జరిగేలా పోరాడతార...

అనంతపురం కలెక్టరేట్‌లో మంత్రి పయ్యావుల సమీక్ష -​ప్రజా దర్బార్‌పై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష

  ​ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 3రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ​జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్తో కలిసి ఆయన మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం అమలు తీరుపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంలో వేగం, నాణ్యతపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ఈ సమావేశంలో డీఆర్‌ఓ ఏ. మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, డీఎస్పీ మహబూబ్ భాష, హౌసింగ్ పీడీ శైలజ, డ్వామా పీడీ సలీమ్ భాష, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, జడ్పీ సీఈఓ రామసుబ్బయ్య సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

వాయుగుండం ప్రభావం: నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన!

   అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారిపోయింది. నేడు, బుధవారం (03-12-2025) ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది.  నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. 🌧️ ఇతర జిల్లాలకు వర్షపాతం అంచనా దక్షిణ కోస్తాంధ్ర, గుంటూరు మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని SDMA పేర్కొంది.  * కోస్తాంధ్ర: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  * రాయలసీమ: రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. 📍 నిన్నటి వర్షపాతం వివరాలు మంగళవారం (02-12-2025) సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమ...

10వ తరగతి పరీక్ష ఫీజు దోపిడీ: ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

  ​ప్రభుత్వ ధర ₹125 అయితే, కార్పొరేట్ ఫీజు ₹1000కి పైనే ​అనంతపురం, ఆంధ్రప్రదేశ్: పదవ తరగతి పరీక్ష ఫీజు విషయంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో అనంతపురం డీఈఓ (DEO) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ​ప్రధాన డిమాండ్లు: ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు ₹125 మాత్రమే కాగా, జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ₹800 నుంచి ₹1000 వరకు వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఉన్నతాధికారులకు డబ్బు చెల్లించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులకు బహిరంగంగా చెబుతున్నాయని వారు ఆరోపించారు. ​దోపిడీని ఆపాలని డిమాండ్: పరీక్ష ఫీజులే కాకుండా, పుస్తకాలు, మెటీరియల్స్ పేరుతో కూడా వేల రూపాయల దోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి, అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ​అధికారుల స్పందన: ధర్నా అనంతరం ఏఐఎస్...