Skip to main content

డిసెంబర్ 10న జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి


 

జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. కేశవరెడ్డి

 ఉరవకొండ

డిసెంబర్ 10వ తేదీన అనంతపురంలో లలిత కళాపరిషత్ లో జరుగు సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కేశవరెడ్డి, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ

వేడుకలలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆణిముత్యాలు లాంటి కమ్యూనిస్టు యోధుల కుటుంబాలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఐ 100 సంవత్సరాలలో అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. సిపిఐ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచిందని, ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయం కోసం, ఉద్యమిస్తూనే మత ఉన్మధ విధానాలను ఎండగట్టింది అన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల శివ యజమా భూమి పేదలకు పంచింది అన్నారు. భూస్వాములకు ఎదురొడ్డి పేద ప్రజలకు దాదాపు లక్ష ఎకరాల భూమిని పంచిన ఘనత సిపిఐది అన్నారు. ఉరవకొండ మండలంలో కౌకుంట్ల భూ పోరాటం మరువలేనిది అన్నారు. అంతేకాకుండా సాగునీరు, తాగునీరు సాగునీటి ప్రాజెక్టుల కోసం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై, కృష్ణ జలాలు కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ పార్టీని అనంతపురం జిల్లాలో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి బలోపేతం చేశారన్నారు. అనంతర కాలంలో ఐదు కళ్ళు సదాశివన్ వీకే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో పేదల కోసం అలుపెరుగని ఎన్నో పోరాటాలను నిర్వహించాలన్నారు. 1948 సంవత్సరంలో సిపిఐ పార్టీ మొదటి జిల్లా మహాసభ ఉరవకొండలో నిర్వహించడం జరిగిందన్నారు. ఉరవకొండ ప్రాంతంలో కూడా రాకెట్ల నారాయణరెడ్డి, చాయపురం రంగన్న, కోటిరెడ్డి లాంటి ఎంతోమంది యోధులు కమ్యూనిస్టు పార్టీ లో చురకైన నాయకులుగా పనిచేసే పేదల పక్షాన నిలబడ్డారన్నారు. ఉరవకొండ నియోజకవర్గం లో దాదాపు 49 మంది కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేసిన ఆణిముత్యాల కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కుటుంబాల అందరికీ కూడా డిసెంబర్ 10న జరిగే శతాబ్ది ఉత్సవాల్లో సత్కరించడం జరుగుతుందన్నారు. అనంతపురంలో జరిగే ఈ ఉత్సవాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు చెన్నారాయుడు, సుల్తాన్, గన్నే మల్లేష్, పురిడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...