Skip to main content

రాయలసీమ నీళ్లన్నీ సముద్రం పాలు,అభివృద్ధి అంతా అమరావతి పాలు!


 

రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి,నీళ్లు రెండు కళ్ళు. అయితే కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం కృష్ణా నదిపై 146.79 టీఎంసీలు,పెన్నా నదిపై 75.62 టీఎంసీలు మొత్తంగా 222.41 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండిపోయాయి. 

     కృష్ణా నదిపై నిర్మించిన జలాశయాలలో 1789 టీఎంసీలు,పెన్నా నదిపై నిర్మించిన జలాశయాలలో 103.78 టీఎంసీలు,మొత్తంగా 1892.78 టీఎంసీలు మాత్రమే నిలుపుకోగలుగుతున్నాము. వీటిలో సగం తెలంగాణా వాటా,శ్రీశైలం నీరు విద్యుత్ ఉత్పత్తి పేరుగా మీదుగా నాగార్జునసాగర్ కు.అయితే ప్రతి సంవత్సరం కృష్ణ,పెన్నా నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్న నీరు సుమారు 3000 టీఎంసీలు, అంటే సగం నీటిని సముద్రం పాలు చేస్తున్నాము.ఈ నీరంతా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోనే ప్రవహిస్తున్నది.దీనిని బట్టి పాలకవర్గాలకు రాయలసీమపై కనికరం,లేదనిఅర్థమవుతుంది

       1956నుండి శ్రీ బాగ్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రాయలసీమ నాయకులే ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తూ, పరాయి ప్రాంతంలో నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారు.

       మూడు పంటలు పండించే ప్రాంతంలోనే ప్రాజెక్టులు,జాతీయ ప్రాజెక్టులు,ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేస్తున్నారు.ఎప్పుడైనా తక్కువ వర్షాలు వచ్చినప్పుడు నీటిని స్టోరేజ్ చేసుకునేందుకు అక్కడ వ్యవస్థలన్నింటినీ అందులకు సిద్దం చేసి, రాయలసీమ ప్రాంతంలో మాత్రం తుంగభద్ర,కృష్ణా, పెన్నా నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయకుండా,తుంగభద్ర,శ్రీశైలం ప్రాజెక్టులను పూడికతో నింపుతూ వృధాగా నీటిని సముద్రం పాలు చేస్తున్నారు. 

     తుంగభద్ర,కృష్ణ ప్రాజెక్టుల పూడికతో నష్టపోతున్న నీటిలో సుమారు 60 టీఎంసీల నీటిని నిలుపుకోవడానికి

ఎటువంటి భూసేకరణ ఖర్చు లేకుండా,సిద్దేశ్వరం దగ్గర తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేయవచ్చు.ఆ పని మాత్రం చేయకుండా కృష్ణానదికి తోరణంలా తీగల వంతెన నిర్మించి,వరద నీటికి స్వాగతం పలికి,మద్యకోస్తాకు నీరంతా సాగనంపడానికి సిద్ధమై, మరోసారి రాయలసీమ ద్రోహానికి తెర లేపింది నేడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబల్ ఇంజన్ సర్కార్.

ఈ అన్యాయాలను చూస్తున్న రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...