Skip to main content

Posts

సర్పంచ్ అభ్యర్థులకు ఈటెల హెచ్చరిక.

 హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకూడదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు. “తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. ఇవి లీగల్‌గా చెల్లుబాటయ్యే ఎన్నికలు కావని జాగ్రత్తగా ఉండాలి. కోర్టు రాజ్యాంగబద్ధంగా లేవని కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోటీదారులు భారీగా నష్టపోయారు” అని ఈటెల గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు హడావుడిగా ఖర్చు చేయకుండా పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు ఆగాలని ఈటెల పిలుపునిచ్చారు.

ఆర్ డి టి సేవలకు బ్రేకులొద్దు.. ఫెరా పునరుద్ధరణే ముద్దు

 - అసెంబ్లీ లో ఎం ఎల్ ఏల్ లు:పరిటాల సునీత, బండారు శ్రావణి పునరుద్దరణ చర్చలు. -జిల్లా వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసన జ్యాలలు  -ట్రూ టైమ్స్ ఇండియా: ప్రభుత్వ0 ఆర్ డి టి సేవలకు బ్రేకు లేయోద్దంటూ అలాగే ఫెరా చట్టాన్ని పునరుద్ధరించాలన్ని అభివృద్ధి కామకులు బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, ఆర్ డి టి మాజీ ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, జై కిసాన్ ఫౌండర్ నాగమల్లి ఓబులేశు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.   ఆర్ డి టి సేవా సంస్థప్రభుత్వ సేవలకు ధీటుగా సేవలందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మంచిని స్వాగతించాలన్నారు. అనంతపురం కరువు జిల్లాలో స్థాపించి జిల్లా ఆమూలాగ్రం ఎస్సీ,ఎస్టీ,బడుగు బలహీన వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందించిన ఘనత ఆర్ డి టి కే దక్కుతుందన్నారు.   గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు నడుం బిగించిందన్నారు. విద్యా బోధనకు అవసరమైన పాఠశాలలో నిర్మించి, తద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘన కీర్తి ఆర్డిటిదే అనివారు కొనియాడారు.  వైద్యం కోసం ఆసుపత్రులు నిర్మించి తద్వారా పేదలకు రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు...

హోంవర్క్ చేయలేదని బాలుడిపై క్రూరశిక్ష.

చండీగఢ్‌ పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. హోంవర్క్ చేయలేదని ఏడేళ్ల 2వ తరగతి బాలుడిని ప్రిన్సిపాల్‌ అమానుషంగా శిక్షించాడు. చిన్నారిని కిటికీకి తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా, స్కూల్ బస్సు డ్రైవర్‌తో విచక్షణారహితంగా కొట్టించాడు. ఈ ఘటనతో విద్యార్థి భయభ్రాంతులకు గురయ్యాడు. చూసిన ఇతర పిల్లలు కూడా వణికిపోయారు. చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారిపై ఈ రకమైన శారీరక, మానసిక హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యావేత్తలు, తల్లిదండ్రులు “ఈ విధమైన మనస్తత్వం ఉన్నవాళ్లు స్కూల్ నడిపే అర్హత ఉన్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. విద్య అనేది భయం కాదు, ప్రేరణ కావాలి అని వారు హితవు పలికారు.

ఎన్టీఆర్ బేబీ కిట్‌లో కొత్తగా రెండు వస్తువులు

  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఉచితంగా అందించే ఎన్టీఆర్ బేబీ కిట్లో రెండు కొత్త వస్తువులు చేర్చారు. ఇటీవల కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అందులో ఫోల్డబుల్ బెడ్ మరియు కిట్ బ్యాగ్ చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు బేబీ కిట్‌లో దోమతెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, దుస్తులు, న్యాప్‌కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ ఇలా మొత్తం 11 వస్తువులు ఉండేవి. తాజాగా కొత్త రెండు వస్తువులు చేరడంతో సంఖ్య 13కి పెరిగింది. గతంలో ఒక్కో కిట్ ఖర్చు సుమారు రూ.1,504 కాగా, ఇప్పుడు అదనంగా రూ.450 వ్యయం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి: అసాంఘిక జీవులుగా మారిన కోతులు! రోగులు బెంబేలు,

  ఉరవకొండ (అనంతపురం జిల్లా): ట్రూ టైమ్స్ ఇండియా: పేద ప్రజలకు వైద్యం అందించే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ప్రస్తుతం కోతుల దండయాత్రతో దడ పుట్టిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వారి బంధువులు కోతుల వీరంగంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇవి కేవలం ఆహారాన్ని లాక్కోవడమే కాకుండా, రోగుల ఆరోగ్యానికి, భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించాయి. వార్డుల్లోకి చొరబాటు, ఆహార లూఠీ మీరు పంపిన చిత్రాలు ఆసుపత్రి లోపల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కారిడార్లలో, ముఖ్యంగా రోగులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలకు సమీపంలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కిటికీల గ్రిల్స్‌ లోపల మరికొన్ని కోతులు మాటు వేసి ఉండగా, ఒక కోతి కింద కూర్చుని, ఒక నల్లటి వస్తువుతో పాటు పండ్లను లాక్కొని తింటున్న దృశ్యం ఆసుపత్రిలో భద్రత ఎంత లోపించిందో తెలుపుతోంది. "మా పిల్లాడి కోసం తెచ్చిన పండ్ల పొట్లం, బ్రెడ్ అంతా లాక్కెళ్లిపోయాయి. కోతులు ఒక్కసారిగా వస్తే భయమేసి మా మంచాల కింద దూరాం. రాత్రయితే నిద్ర కూడా పట్టడం లేదు" అని ఓ రోగి సహాయకురాలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్య, భద్రతా ప్రమాదాలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోతుల సంచారం కేవలం ఆహా...

ఆఖరికి సినిమాలనూ వదలని అమెరికా అధ్యక్షుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్ విధించారు. అయితే, అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.              ఇక, సినిమా రంగంపై టారీఫ్‌లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మన సినిమా బిజినెస్‌ను అమెరికా నుంచి దొంగిలిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్దఎత్తున ప్రభావం పడనుంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్‌సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది..

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు మృతి పై విచారణ

  -ఓ వైద్యుడు, నర్సు పై వేటు కు రంగం సిద్ధం. -కొట్టాలపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీ, అందుబాటు లో లేని సిబ్బంది గురించి ఆరా.   ట్రూ టైమ్స్ ఇండియా :ఓ డాక్టర్, నర్స్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి ఘటన, మరియు కొట్టాలపల్లి పీ హెచ్ సీ సిబ్బంది అందుబాటులో లేరని వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు( త్రి సభ్యులతో కూడిన బృంద )విచారణ చేపట్టారు.  ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఈనెల 26వ తేదీన వజ్ర కరూర మండలం చాబాల గ్రామానికి చెందిన ఆహారన్ అనే ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. అందులో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబికాదేవి, డిసిహెచ్ఎస్ డేవిడ్ సెల్వ రాజు, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పీడియాట్రికల్ డాక్టర్ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి గతంలో ఆ బాలుడు ఎక్కడ వైద్య చికిత్స చేయించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అందించారు విధుల్లో ఉన్న డాక్టర్లు ...