Skip to main content

Posts

సహోద్యోగులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ యూపీ కోర్టు భవనం పైనుంచి దూకి మహిళా స్టెనో ఆత్మహత్య

Canpoor యూపీ కాన్పూర్ లోని ఓ కోర్టు భవనం ఆరో అంతస్తు నుంచి దూకి శనివారం నేహా సంఖ్వర్ అనే 30 ఏళ్ల మహిళా స్టెనోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఆమె 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిందని మృతురాలి తాత తెలిపారు. కానీ ఆమె ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి నిరంతరం వేధింపులకు గురయ్యారని చెప్పారు. తోటి ఉద్యోగులు ఈ వేధింపులకు పాల్పడ్డారని నేహా కుటుంబం ఆరోపించింది~£

మిస్ యూ మాలేపాటి భానుచందర్

  మాలేపాటి భానుచందర్ ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదంలో ముంచివేసింది. మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు కుమారుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి అన్న కుమారుడిగా.. దగదర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులుగా.. ఎంతోమందికి కొండంత అండగా ఉన్న మాలేపాటి భానుచందర్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని శోక సంద్రంతో వేడుకుంటున్నాను.

పొగడ పువ్వులు...

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. వేయి మారేడు దళాల కంటే ఒక తామరపువ్వు ఉత్తమం. వేయి తామరపూల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం. వేయి పొగడపూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. వేయి ఉమ్మెత్త పూల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. వేయి ములక పూల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. వేయి తుమ్మి పూల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం. వేయి ఉత్తరేణి పూల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. వేయి దర్భ పూల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్ఠం. వేయి జమ్మి పూల కంటే ఒక నల్లకలువ ఉత్తమం...

రాళ్లపాడు ఘటనకు అధికార మదమే కారణం – బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్

గుంటూరు జిల్లా రాళ్లపాడు ఘటనపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతోనే ఈ దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. అధికారపార్టీ నేత వాహనంతో దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన రామచంద్రయాదవ్, మృతుని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాళ్లపాడు లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ప్రభుత్వం చట్టవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా రెండు నాల్కల ధోరణితోనే సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో బిసిలపై అనేక దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ దాడులను చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. బిసి బిడ్డ అమరనాథ్ గౌడ్ హత్య, దళిత డాక్టర్ సుధాకర్ మరణాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో బిసిలు, దళితులతో పాటు అధికారంలోకి రావడానికి సహకరించిన వర్గాలపై కూడా దాడులు జరిగాయి. ఆయన నేరాలను అరికట్టకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు,” అని రామచంద్రయాదవ్ వ్యాఖ్యా...

16 నెలల్లో సగం గోపాలపట్నం - నరవ కొండ తవ్వేసిన మైనింగ్ మాఫియా!

కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతుందా విశాఖపట్నం జిల్లా పరిధిలోని గోపాలపట్నం – నరవ కొండ పరిసర ప్రాంతాలు గత 16 నెలలుగా మైనింగ్ మాఫియా బీభత్సానికి గురవుతున్నాయి. చట్టపరమైన అనుమతులు లేకుండా రాత్రివేళల్లో భారీ యంత్రాలతో కొండలను తవ్వి, ట్రక్కుల ద్వారా రాళ్లను తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు, పర్యావరణ శాఖ, పోలీసు విభాగం మౌనం పాటించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొండల తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల భూగర్భ జలాలు తగ్గిపోగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని గోపాలపట్నం, నరవ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలు ఈ మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళనలో ఉన్నారు.

నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ

  నేమకల్లు, అక్టోబర్ 18: బొమ్మన హా ల్ మండల పరిధిలోని నేమకల్లు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేద మంత్రోచ్చారణల మధ్య తెల్లవారుజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ: భక్తులు బావిలో నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి స్వామివారి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం:  పంచామృతాభిషేకం   కుంకుమార్చన   ఆకుపూజ   ప్రత్యేక పుష్పాలంకరణ వంటి విశేష పూజలను నిర్వహించారు. సందర్శనకు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు

ఇండియా అక్టోబర్ 18 భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు చేరాయి. యూపీలోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమే అన్నారు. పాక్‌ దుస్సాహసానికి తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. యూపీ.. రక్షణ పరిశ్రమ కారిడార్‌కు మైలురాయిగా నిలుస్తుందన్నారు.