Skip to main content

Posts

విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌కు ఎస్.సి. ఎస్.టి. విజిలెన్స్ కమిటీ వినతి

  గుంతకల్ రెవిన్యూ డివిజన్, అక్టోబర్ 27: ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తరుణంలో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న విడపనకల్లు ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్. హరి ప్రసాద్ యాదవ్ జిల్లా కలెక్టర్‌ను మీడియా ద్వారా కోరారు. విద్యార్థినుల ఆవేదన: గత కొద్ది రోజులుగా విడపనకల్ ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని హరి ప్రసాద్ యాదవ్ తెలిపారు. అక్టోబర్ 26, 2025 (ఆదివారం) మధ్యాహ్నం ఆయన వ్యక్తిగతంగా హాస్టల్‌ను సందర్శించారు.  * వార్డెన్ లేకపోవడం: తాను వెళ్లిన సమయంలో వార్డెన్ విధుల్లో లేకపోవడం గమనించారు. దీంతో ఆయన గేటు బయట నుంచే విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  * నాసిరకం భోజనం: ముఖ్యంగా, కడుపునిండా అన్నం పెట్టడం లేదని, చికెన్ ఇస్తే నీళ్లగా ఉండి కేవలం రెండు ముక్కలు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  * బెదిరింపులు: ఆహారం గురించి ప్ర...

విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు: మంత్రి గొట్టిపాటి

  A P : మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.  ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.  ఎక్కడైనా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే 1912 నంబరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు.  కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.

విద్యారంగంలో ఆందోళన: 8,000 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు!

  ఢిల్లీ అక్టోబర్ 27: దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఆందోళన కలిగించే అంశాలను కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 8,000 పాఠశాలల్లో (సుమారు 7,936) ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. అంతకు మించి, ఈ విద్యార్థులు లేని బడుల్లో 20 వేలకు పైగా (20,817) మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండటం ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఈ గణాంకాలు రాష్ట్రాల వారీగా విద్యా వ్యవస్థలో ఉన్న అసమతుల్యతను స్పష్టంగా చూపిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా పరిస్థితి   సున్నా నమోదు పాఠశాలల్లో అగ్రస్థానం:     ఈ జాబితాలో అత్యధిక సంఖ్యలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది.    తరువాత స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఒకే టీచరున్న బడుల్లో 33 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో సిబ్బంది కేటాయింపులో లోపాలున్నాయనే విషయాన్ని ఈ నివేదిక హైలైట్ చేసింది. దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా విద్యార్థులు కేవలం ఒకే ఒక్క టీచరు ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఇది విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (PTR)పై, బోధ...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా.*

 అమరావతి అక్టోబర్ 27: ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు అమరావతి రావాల్సి ఉన్న నిర్మలా సీతారామన్. మొంథా తుపాను కారణంగా కార్యక్రమం వాయిదా.

గురు కుల విద్యార్థి అదృశ్యం

 విద్యార్థి - అన్వేష 10th క్లాస్  గ్రామం: ఇల్లూరు  మండలం : గార్లదిన్నె  ఈ దినము అనగా 26/10/2025 వ తేదీ సుమారు సాయంత్రం 6.00 గంటల సమయంలో రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాల నుండి తప్పిపోయినాడు. పై తెలిపిన బాలుడి ఆచూకీ తెలిసిన వెంటనే క్రింది ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చెయ్యగలరు.           వజ్రకరూర్ SI no -9440901867   ఉర్వకొండ CI సార్ no -9490108514 గుంతకల్ SDPO sir no -944079 6828.

ఉరవకొండలో 'ఇన్‌ఛార్జి' పాలనపై ప్రజాగ్రహం!

  ఇదేనా సుపరిపాలన? ఉరవకొండ, అక్టోబర్ 26: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవస్థానాల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కీలక స్థానాల్లో అధికారుల కొరత, ఇన్‌ఛార్జి పాలన, మరియు బాధ్యతారహిత ప్రవర్తనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై 'ఇదేనా సుపరిపాలన?' అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.   పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఇన్‌ఛార్జిల రాజ్యం ఉరవకొండలో పాలనా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కీలక శాఖలలో పరిస్థితి దారుణంగా ఉంది.   పోలీస్ శాఖ: ఉరవకొండ గ్రామీణ సర్కిల్ అధికారి (సీఐ) పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. అంతేకాకుండా, గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ సైతం లేరు. కేవలం ఇన్‌ఛార్జి పాలనతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.దొంగతనాలు,పేకాట జూదాలు, ఊరూరా బెల్టు దుకాణలతో పోలీస్ నియంత్రణ కష్టతరమైంది.   రెవెన్యూ కార్యాలయం: ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ కూడేరుకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకుని, క...

రానున్న "లోకల్ ఎన్నికల్లో" వడ్డెరలకు ప్రాధాన్యం : మంత్రి సవిత*

 " వడ్డే ఓబన్న" విగ్రహ ప్రతిష్ట "సూపర్... సక్సెస్" గోరంట్ల పట్టణంలో బస్టాండ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత స్వహస్తలతో ఆదివారం నాడు వడ్డెరల తో కలసి అంగరంగా వైభవం గా ప్రారంభించారు. ముందుగా మండలంలోని వడ్డెర కులస్తులందరు కలసి హెచ్. పి పెట్రోల్ బాంక్ దగ్గర నుండి కలిశాలతో ఊరేగింపుగా బయలుదేరి బస్టాండ్ దగ్గర వరకు కొనసాగించారు. అనంతరం మంత్రి ఆవిష్కరించారు. మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీ, నామినేటెడ్ పదవులతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వడ్డెర కులస్తులకు గతంలో ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వడ్డెర కులస్తులు కోరారని సొంత నిధులతో విగ్రహాన్ని అంద చేశానని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బీసీలకు టీడీపీతో, రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ, విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, కనకదాస జయంతిని అధ...