Skip to main content

Posts

ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతిపై నిరసన.

  విడుపనకల్ : గ్రామంలో ఇళ్లకు సంబంధించిన ఉపాధి హామీ బిల్లులు మంజూరు పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ జీ. సురేష్ రూ.2,000 లంచం డిమాండ్ చేస్తున్నాడంటూ బళ్లారి సుశీలా, బళ్లారి రాముడు, సరస్వతి మంగళవారం సచివాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అంటువారి మాటల్లో, “మేము ఇప్పటికే రూ.1,500 ఇచ్చినా బిల్లులు మంజూరు చేయలేదు. ఇంకా డబ్బులు అడుగుతున్నారు” అని వాపోయారు. దీనిపై అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్‌ను సచివాలయానికి పిలిపించి విచారించగా, సురేష్ బహిరంగంగానే, “నేను ఒక్కడినే తీసుకోలేదు… కింది స్థాయి నుంచి పైస్థాయి ఉన్నతాధికారుల వరకూ అందరికీ వాటా ఇవ్వాలి. ఈసీ వసూళ్లు చేసి ఇవ్వమంటేనే వసూళ్లు చేశాను” అని చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ ఈసీకి ఫోన్‌లో తెలియజేశారు. ఈసీ గురు ఫోన్‌లోనే సురేష్‌ను ప్రశ్నిస్తూ, “నేను నీకు వసూళ్లు చేయమని చెప్పానా? డబ్బులు తీసుకుని ఎవరికి ఇచ్చావు?” అని నిలదీశాడు. అప్పుడే సురేష్ మాట మార్చి, “ఎవ్వరూ చెప్పలేదు… నేనే వసూళ్లు చేసి నా దగ్గరే పెట్టుకున్నాను” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఉపాధి హామీ అధికారులు స్పందిస్తూ, “ఇళ్లకు సంబంధించిన ఉపాధి బ...

పెన్నహోబిలంలో లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం టెండర్లు, వేలం వాయిదా

  పెన్నాహోబిలం : ఉరవకొండ మండలం, పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నందు ఈరోజు (నవంబర్ 18, 2025) తలనీలాలు ప్రోగు చేసుకొనే హక్కు, పాత్ర సామానుల అద్దె హక్కు, మరియు దేవస్థాన భూముల కౌలుకు సంబంధించిన టెండర్లు, బహిరంగ వేలం ప్రక్రియను నిర్వహించారు. అయితే, సరైన ధర లభించకపోవడం, టెండర్ దారులు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల వేలం ప్రక్రియను వాయిదా వేశారు. తలనీలాల హక్కు వేలం వాయిదా తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు కోసం నిర్వహించిన ఈ-టెండర్ మరియు షీల్డ్ టెండర్‌కు ఏ ఒక్క టెండర్ దారుడు కూడా ముందుకు రాలేదు. అనంతరం నిర్వహించిన బహిరంగ వేలంలో ముగ్గురు డిపాజిట్ చెల్లించగా, ఇద్దరు మాత్రమే పాటలో పాల్గొన్నారు. పాట రూ. 15,20,000/- (పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు) వద్ద నిలిచిపోయింది. గత సంవత్సరంలో ఇదే హక్కుకు రూ. 27,00,000/- (ఇరవై ఏడు లక్షల రూపాయలు) కంటే తక్కువకు పాట ఆగినందున, దేవస్థానం అధికారులు వేలాన్ని వాయిదా వేశారు. పాత్ర సామానుల అద్దె హక్కుకు సరైన పాట కరువు అదేవిధంగా, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కుకు నిర్వహించిన షీల్డ్ టెండర్‌కు కూడా ఎవరూ స్పందించలేదు. బహిరంగ వేలంలో నలుగురు ...

మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన

    మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. అప్పటికప్పుడే కొన్ని సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో తక్షణమే మాట్లాడి, ప్రజల సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ, ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను పరిష్కరించడమేనని తెలిపారు. "కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించాం. మరికొన్నింటిని వచ్చే పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాం. ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు ఉంటే, అది ఎందుకు కాలేదో కూడా అర్జీదారులకు తెలియజేస్తాం" అని ఆయన వివరించారు. వైసీపీ విమర్శలపై ఎమ్మెల్యే కౌంటర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు పనిపాట లేక తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన...

కార్యకర్తలే నా బలం, భరోసా: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం  అనంతపురం అర్బన్ నూతన కమిటీల ప్రమాణస్వీకారోత్సవం; యం వై ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.జిల్లా కేంద్రం తమ రాజకీయ జీవితానికి, విజయానికి కార్యకర్తలు, నాయకులే అసలైన బలమని అనంతపురం అర్బన్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) దగ్గుపాటి ప్రసాద్ ఉద్ఘాటించారు. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన నూతన క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణస్వీకారోత్సవం బుధవారం నాడు స్థానిక ఫంక్షన్ హాలులో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది పార్టీ శ్రేణులు హాజరు కాగా, ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా కొత్త కమిటీ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.  కొత్తవారికి న్యాయం చేసే బాధ్యత నాదే ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, "కొత్త కార్యవర్గం ఏర్పాటులో కొంతమందికి అవకాశాలు రాకపోయి ఉండవచ్చు. కానీ, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత పూర్తిగా నాదే" అని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో మీరే అండ: గతంలో తనకు టికెట్ లభించినప్పుడు సొంత పక్షంలోనే నిరసనలు, వైఎస్సార్‌సీపీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అటువంటి క్లిష్ట సమయంలో తనను ముందుకు నడిపించింది కార్యకర్తలేనని ఆయన కొనియాడారు....

రాయదుర్గంలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్–కాలేజ్ బస్సుల అక్రమాలపై ఏఐవైఎఫ్–ఏఐఎస్ఎఫ్ నిరసన

రాయదుర్గం నియోజకవర్గంలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్–కాలేజ్ బస్సులు రవాణా నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో, విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పెరుగుతోందని ఏఐవైఎఫ్–ఏఐఎస్ఎఫ్ విద్యార్థి–యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. విదేశాలలో దాదాపు వినియోగం తగ్గిపోయిన డబుల్ డెక్కర్ బస్సులు మనదేశంలో మాత్రమే నడుస్తుండటం ప్రమాదకరమని నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి బస్సులను రవాణా సేవల నుండి పూర్తిగా తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్, కాలేజ్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సేఫ్టీ గ్రిల్ లేకుండా బస్సులను నడపడం, ఫిట్‌నెస్ లేకుండా రోడ్డుపై వాహనాలను వదలడం వంటి అంశాలు విద్యార్థుల భద్రతకు తీవ్రమైన ముప్పని నాయకులు తెలిపారు. వృద్ధ డ్రైవర్లను కొనసాగించడం, అనుభవం లేని డ్రైవర్ల చేతిలో బాధ్యతలు పెట్టడం కూడా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రెష్ , ఏఐ...

కారంచేడు కీర్తి కిరీటం: జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో డైరెక్టర్‌గా డా. దగ్గుపాటి లేఖాజ్ నియామకం!

  అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం... సర్జికల్ న్యూరో ఆంకాలజీ విభాగం పగ్గాలు తెలుగు డాక్టర్‌కు అప్పగింత. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ (The George Washington University) లో కారంచేడు వాసి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దగ్గుపాటి లేఖాజ్ అరుదైన బాధ్యతలను స్వీకరించారు. ఆయన యూనివర్సిటీకి చెందిన సర్జికల్ న్యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకంపై స్వగ్రామమైన కారంచేడులో, అలాగే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  ఉన్నత శిఖరంపై తెలుగు కీర్తి పతాక ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన డాక్టర్ లేఖాజ్, అగ్రశ్రేణి వైద్య విద్యా సంస్థల్లో శిక్షణ పొంది, సుదీర్ఘ అనుభవాన్ని గడించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ వైద్య నిపుణుల వద్ద ఆయన మెళకువలు నేర్చుకోవడం, ఇప్పుడు ఆయన్ను అమెరికన్ యూనివర్సిటీలో కీలక స్థానానికి చేర్చింది. సర్జికల్ న్యూరో ఆంకాలజీ అనేది మెదడు, వెన్నుముకలో వచ్చే కణితులు (Tummors) మరియు క్యాన్సర్ సంబంధిత రుగ్మతలకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన వైద్య విభాగం. ఈ సున్నితమైన విభాగానికి డైరెక్టర్‌గా నియమితులవడం డ...

దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)

  దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)ఉరవకొండ ఆర్. టీ. సి డిపో మేనేజర్ గారికి మంగళవారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ. ఐ. ఎస్. ఏ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఉరవకొండ మండల అధ్యక్షులు మంజునాధ్ నాయక్ మాట్లాడుతూ.... దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి విద్యార్థులు ఉరవకొండ పట్టణం కు వచ్చి విద్యను అభసిస్తున్నారు. కావున వారికీ సరైన బసు సౌకర్యం లేదు బడి బసు కూడా లేదు విద్యార్థులు రోజు ప్యాసింజర్ బాసులో చాలా ఇబంధులకు గురి అవుతూ వారు రోజు ప్రయాణం చేస్తున్నారు అంతే కాకా వారికీ సరైన సమయం లో బస్సు లేక ఉన్న అది ఫుల్ అవ్వడం డోర్ లో వరకు నిలబడడం కొంత మంది విద్యార్థులకు బస్సు లో సీట్లు దొరకక వారు కళాశాలలకు, పాఠశాలలకు వారు సరైన సమయం వెళ్లలేక విద్యార్థులు ఇబంధులు పడుతున్నారు.కావున వీరి పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి ప్రత్యేక బడి బస్సు ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ. ఐ. ఎస్. ఏ నాయకులు సుధాకర్, ల...