Skip to main content

Posts

సౌభాగ్య లక్ష్మీ గాఅవతరించిన ఉద్భవ లక్ష్మీ

   నేడు ధన లక్ష్మీగాఅమ్మోరు అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, గురు వారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు 4వ రోజు గురు వారం సౌభాగ్య లక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.  ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.  ఉద్భవ లక్ష్మీ, ధాన్య లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవలతో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు  నేడు ధన లక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. సెప్టెంబర్ 25,తేదీ గురు వారం: సౌభాగ్య లక్ష్మిరూపం లో భక్తులకు దర్శన మిస్తారని ఈఓ తిరుమల రెడ్డి తెలిపారు.

మాజీ ఉప సర్పంచు జిలకర మోహన్ అనారోగ్యం తో మృతి

 ఉరవకొండ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ జిలకర మోహన్ అనారోగ్యంతో బాధ పడుతూ అనంతపురం లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ నందు రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. ఆయన స్వగ్రామం కసాపురం లో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎలాంటి అరమరికలు సేవలు అందించిన ఆయన మృతి పట్ల ఉరవకొండ వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్, సోమా శేఖర్, లెనిన్ సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు, ఫోటో స్థాట్ వెంకటేష్ ఒక సంయుక్త ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు.

కర్నూలులో హైకోర్టు సాధనకై 4వ రోజుకు చేరిన న్యాయవాదుల నిరసన

  కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. 1937 నాటి శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీ నుంచి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం - న్యాయవాదుల ప్రధాన డిమాండ్ న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కాకుండా ప్రధాన హైకోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం 1937 నవంబర్ 16న కుదిరిన శ్రీ బాగ్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ హామీలు - నెరవేరని వాగ్దానాలు న్యాయవాదుల ఆందోళన ప్రధానంగా రాజకీయ నాయకుల గత హామీల చుట్టూ తిరుగుతోంది.  * 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: రాయలసీమలోని కర్నూలులో ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.  * 2019లో ...

కమ్యూనిస్టుల నిరాడంబర జీవితం: కేరళ మంత్రి ప్రసాద్

  విజయవాడ: కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్ సీపీఐ (CPI) జాతీయ మహాసభలకు ఒక సాధారణ కార్యకర్తలా హాజరయ్యారు. ఒక సాధారణ జీవితం, నిరాడంబరత, ఆర్భాటాలు లేని జీవనం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్టీ మహాసభలకు వచ్చిన ఆయన, ఒక సాధారణ కార్యకర్తలాగా నిరాడంబరంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలే తమను నిరాడంబరంగా జీవించేలా ప్రోత్సహిస్తాయని, ప్రజాసేవపై దృష్టి పెట్టేలా చేస్తాయని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు పదవిలో ఉన్నా, లేకపోయినా తమ ఆదర్శాలకు కట్టుబడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

నరసాపురంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

  పెరుపాలెం (నరసాపురం): రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న పెరుపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ గ్రామంలోని శ్రీ శివాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పెరుపాలెం చేరుకున్న మంత్రికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కార్మిక పరిషత్ ప్రతినిధులు

  విజయవాడ: కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.ఎస్. రావు, శేషగిరి రావు బుధవారం విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మిక పరిషత్ ఈడీ ఆంజనేయులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సమస్యలు, వాటి పరిష్కారంపై వారు చైర్మన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ కార్మిక వర్గాల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.

న్యాయవాదుల దీక్షలకు ప్రజా సంఘాల మద్దతు

  కర్నూలు: న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఆసిఫ్, టి.వెంకటేష్, రాము ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి, డేవిడ్, పీవోపీ నాయకుడు శ్రీనివాస రావు న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తామంతా న్యాయవాదులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు .