Skip to main content

Posts

బన్ని ఉత్సవంలో విషాదం: కర్రల సమరంలో ఇద్దరు మృతి, వంద మందికి గాయాలు

  కర్నూల్ కర్నూలు జిల్లా, హొళగుంద మండలం: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, హొళగుంద మండలం, దేవరగట్టు ప్రాంతంలో ప్రతియేటా విజయదశమి సందర్భంగా జరిగే ప్రసిద్ధ బన్ని ఉత్సవం (కర్రల సమరం) ఈ ఏడాది కూడా రక్తసిక్తమైంది. సంప్రదాయం పేరుతో జరిగిన ఈ హింసాత్మక ఘర్షణలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన భక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధాన ఘర్షణ వివరాలు సుమారు 800 అడుగుల ఎత్తు కొండపై వెలసిన శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా పర్వదినాన ఈ ఉత్సవం జరిగింది. విజయదశమి రోజున అర్ధరాత్రి మొదలైన ఉత్సవంలో భాగంగా మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పరిసర గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో భీకరంగా కొట్టుకోవడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ సారి కూడా ఉత్సవమూర్తులను దక్కించుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. కర్రల దాడుల్లో తలలు పగిలి, కాళ్లు, చేతులకు గాయాలై, పలువురు భక్తులు తీవ్రంగ...

కారుణ్య నియామకం హక్కు కాదు: హైకోర్టు స్పష్టీకరణ

  అమరావతి: ఉద్యోగి మరణించిన తరువాత వారసులకు ఇచ్చే కారుణ్య నియామకం హక్కు కాదని, అర్హత ఉన్నప్పుడే ఇవ్వవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం ఆకస్మికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటమే ఈ పథక ఉద్దేశమని గుర్తుచేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామ పరిపాలన అధికారి (వీఏఓ) రాజేంద్ర పిళ్లై 1999లో కన్నుమూశారు. ఆయన కుమారుడు ఉదయ్ కిరణ్ 2009లో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోగా, అధికారులు తిరస్కరించారు. అనంతరం 2017లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి 2021లో ఉదయ్ కిరణ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్ అప్పీల్‌ వేశారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది జి.రాజు వాదిస్తూ, “ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు దరఖాస్తు చేయాలి. కానీ పిటిషనర్ 2009లో దరఖాస్తు చేశారు. కాబట్టి సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయాలి” అని విన్నవించారు. జస్టిస్‌ ఆర్.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ఎనిమిదేళ్ల జాప్యం తర్వాత హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం, జాప్యాని...

ప్రాణాలు కాపాడిన పోలీసులు

 ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అనంతపురం జిల్లాలో పోలీసుల మానవత్వం అనంతపురం జిల్లా: ఉరవకొండలో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఒక వ్యక్తిని ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడారు. గురువారం ఉరవకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ మహానందితో పాటు కానిస్టేబుళ్లు జాఫర్, ఇస్మాయిల్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులు, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, సీఐ మహానంది స్వయంగా దగ్గరుండి అతనికి చికిత్స అందేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను నిలబెట్టిన సీఐ మహానంది, కానిస్టేబుళ్ల తక్షణ చర్యలు, మానవతా దృక్పథాన్ని పలువురు ప్రశంసించారు.

ధర్మవరం: పార్థసారథి నగర్ గంగమ్మ తల్లికి ఘనంగా బోనాలు, మాంసం నైవేద్యం

  ధర్మమవరం:ట్రూ టైమ్స్ ఇండియా ధర్మవరం: పట్టణంలోని పార్థసారథి నగర్‌లో వెలసిన గంగమ్మ తల్లి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు పట్టి, యాటలను నరికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కె. మస్తానప్ప ముఖ్యపాత్ర వహించారు. కమిటీ సభ్యులు మాల్యవంతం నారాయణ స్వామి, మేకానిక్ సూరి, పి. శ్రీనివాసులు, సాకే రమేష్, గంగరాజు, పూజారి ఆనంద్, భాస్కర, దుర్గానగర్ రమేష్, చేన్నప్ప, అక్కులప్ప, రాధాక్రిష్ణ, గణేష్, రాప్తాడు రాజు, శంకర్, నాగభూషణ, బాలు, నాగరాజు సహా మిగతా సభ్యులందరూ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రజక సోదర సోదరీమణులందరికీ ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులందరి సహకారంతో గంగమ్మ తల్లి బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగిం...

స్వగ్రామంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రహ్మరథం!

  చెన్నయ్యపాలెం జన ప్రభంజనం: సామాన్య కార్యకర్తకు సమున్నత గౌరవం పల్నాడు జిల్లా, మాచవరం మండలం: విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో రెట్టింపు పండుగ వాతావరణం నెలకొంది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన తమ గ్రామబిడ్డ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊరంతా ఏకమై, దండులా కదిలి వచ్చి చైర్మన్‌కు బ్రహ్మరథం పట్టారు. శ్రమకు, పోరాటానికి దక్కిన సముచిత స్థానం సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సమున్నత పదవికి ఎదిగిన బ్రహ్మం చౌదరి ప్రస్థానం ప్రత్యేకమైనది. బాల్యంలో పట్టిన పసుపు జెండానే తన అజెండాగా మలుచుకుని, విద్యార్థి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఆయన కృషి, పట్టుదల, అవిశ్రాంతమైన పోరాటం పల్నాడు పౌరుషాన్ని రాష్ట్రమంతటా చాటిచెప్పాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బ్రహ్మం చౌదరికి ఉన్న అవ్యాజ్యమైన అభిమానం, తెలుగుదేశం పార్టీపై ప్రగాఢమైన ప్రేమ ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. ముఖ్యంగా, గత ప్రభుత్వ హయాంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని నిలబడిన వైనం ర...

దసరా ఉత్సవాల్లరెండవ మైసూర్ గా పేరొందిన ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి...

శ్రీ మత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శమీ దర్శనానికి వచ్చి తిరిగి అమ్మవారి శాలకు బయలుదేరారు... ప్రొద్దుటూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం , శివాలయం , శ్రీ చౌడేశ్వరి దేవాలయం , శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవాలయం , రాజరాజేశ్వరి స్వామి దేవాలయాల నుంచి అమ్మవార్లు సెమీ దర్శనానికి వచ్చారు... కొరపాడు రోడ్డు లోని జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆయా దేవాలయాలకు రంగురంగుల దీపాలంకరణలతో , వివిధ రకాల డప్పు వాయిద్యాలతో , దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు..

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 ఎంపికైన తాడిపత్రి

  *📍 ప్రదానోత్సవం వివరాలు*   1. తేదీ: ఈ నెల 6   2. స్థలం: విజయవాడ   3. ముఖ్య అతిథి: సీఎం చంద్రబాబు   4. అవార్డులు: రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలు మరియు పంచాయతీలకు ప్రదానం   ఎంపికైన మున్సిపాలిటీలు  1. మంగళగిరి-తాడేపల్లి   2. తాడిపత్రి   3. బొబ్బిలి   4. పలమనేరు   5. ఆత్మకూరు (నెల్లూరు)   6. కుప్పం    ఎంపికైన పంచాయతీలు 1. చౌడువాడ (అనకాపల్లి)   2. ఆర్.ఎల్.పురం (ప్రకాశం)   3. లోల్ల (కోనసీమ)   4. చల్లపల్లి (కృష్ణా)   5. చెన్నూరు (కడప)   6. కనమకుల పల్లె (చిత్తూరు)