Skip to main content

Posts

సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటన..

ట్రూ టైమ్స్ ఇండియా ఢిల్లీ అక్టోబర్ 07: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నం.. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ బూటుతో దాడికి లాయర్ యత్నం.. అడ్డుకున్న తోటి లాయర్లు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న సీజేఐ గవాయ్..ఇలాంటి బెదిరింపులు నన్ను ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్. ఈ దాడిని  ట్రూ టైమ్స్ ఇండియా ప్రధాన సంపాదకులు శ్రీనివాసులు మాలపాటి, వెంకటేష్, జిల్లా సహచ కార్యదర్శి మీనుగ మధు బాబు, ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు.

కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే మా ప్రభుత్వం.

 కల్తీ మద్యంపై విమర్శించే అర్హత జగన్‌కు ఎక్కడుంది? : మంత్రి నారా లోకేశ్ నిందితుల్లో ఇద్దరు టీడీపీ నేతలుంటే.. వారిని సస్పెండ్ చేశాం. ఐదేళ్లలో మీరేం చేశారో మర్చిపోయి.. విమర్శలు చేయవద్దు. జే బ్రాండ్స్‌తో వేలాదిమంది ప్రాణాలు తీశారు.. కల్తీ మద్యం వల్ల చనిపోతే నిందితులను కాపాడేందుకు యత్నించారు.*  కల్తీ మద్యం బాధితుల పట్ల జోగి రమేష్ అహంకారంగా మాట్లాడారు. పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటి అని జోగి రమేష్ మాట్లాడారు : మంత్రి నారా లోకేష్

హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీ

  ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07, 2025,  హనీట్రాప్.. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి నుంచి డబ్బులు దోచేసిన కిలేడీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఒక ఓ కిలేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. జునాగఢ్‌‌కు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ అధికారికి ఫేస్‌బుక్‌లో ఊర్మిళ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా హోటల్ గదిలో శృంగారం చేసేంతవరకు వెళ్లింది. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అయ్యానని, అబార్షన్ కోసం డబ్బు అవసరమని చెప్పి అతడి నుంచి డబ్బులు గుంజింది. అక్కడితో ఆగకుండా వారు ప్రైవేట్‌గా కలిసిన వీడియోలు బయటపెడతానని ఆ మహిళ వేరొకరితో బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేయించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

తుది దశకుచేరిన తాగునీటి ట్యాంకు నిర్మాణం

  . -రూ 35లక్షలతో 40వేల సామర్థ్యం. అపూర్వ పయ్యావుల సోదరులు.. అపూర్వ సేవలు. ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 7: మండల పరిధిలోని బూధగవి గ్రామ సచివాలయం సమీపంలో రూ 35 లక్షలు వెచ్చించి 40 వేల లీటర్ల సామర్థ్యం తో భూఉపరితల ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరు కొన్నాయి. పయ్యావుల సోదరులు సహకారం తో నిధులు మంజూరు జరిగాయి.తాగు నీటి కోసం నిధులు మంజూరు చేయించి నీరు ఇప్పిస్తున్న పయ్యావుల సోదరులు మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులుకు బూదగవి గ్రామ ప్రజలు ఎప్పటికి ఋణ పడి ఉంటారని టీడీపీ సీనియర్ నాయకులు చిరంజీవి తెలిపారు.

బీహార్ పీఠం కోసం ఉత్కంఠ పోరు

బీహార్ రాజకీయం మళ్లీ ఉత్కంఠభరిత మలుపు దిశగా సాగుతోంది.                                                                                     రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ దిశే కాకుండా, ముగ్గురు ప్రధాన నేతల భవితవ్యాలు కూడా నిర్ణయంకానున్నాయి. ఒకవైపు రెండు దశాబ్దాలుగా సుశాసన బాబు పేరుతో సింహాసనం కాపాడుకుంటున్న నితీశ్ కుమార్, మరోవైపు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు తపనపడుతున్న యువ నేత తేజస్వి యాదవ్, ఇంకోవైపు వ్యూహకర్తగా ఎన్నో విజయాలు సాధించిన ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు ముగ్గురూ బీహార్ రాజకీయ రంగస్థలంలో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నారు. నితీశ్ కుమార్: సుశాసన్ బాబుకు మళ్లీ సింహాసనం దక్కుతుందా? దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్‌ను నడిపిస్తున్న జేడీయూ నేత నితీశ్ కుమార్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. 74 ఏళ్ల వయసులో కూడా రాజకీయంగా చురుకుగా ఉన్న ఆయనకు ఈసారి పరిస్థితులు భిన్నంగా క...

సర్పంచుల నిధులు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌కి వినతి – ఉషశ్రీ చరణ్‌

జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేస్తున్న ఉషశ్రీ చరణ్ు, సర్పంచులు – పెనుకొండ, శ్రీ సత్యసాయి జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్  సర్పంచుల బృందంతో కలిసి నేడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మడకశిర సమన్వయకర్త ఈరలకప్ప గారు, నియోజకవర్గంలోని అనేక సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచులు మాట్లాడుతూ – “మేము గ్రామాభివృద్ధి పనులకు స్వంతంగా ఖర్చు పెట్టి పనులు పూర్తి చేశాం. ఇప్పుడు నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వెంటనే మా నిధులను విడుదల చేయాలి” అని కోరారు. ఉషశ్రీ చరణ్  మాట్లాడుతూ – “అధికారంలో ఉన్న మంత్రి సవిత గారు, అధికారులను అడ్డం పెట్టుకుని పెనుకొండ నియోజకవర్గ సర్పంచుల నిధులను కావాలనే నిలిపివేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల కోసం నిధు...

"ఆటో డ్రైవర్ల సేవలో " సభ సూపర్ సక్సెస్

హర్షం వ్యక్తం చేసిన మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల.జ్యోతి... సీతారామపురం :ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపు మేరకు ఉదయగిరిలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో" సభ సూపర్ సక్సెస్ కావడం హర్షణీయం అని సీతారామపురం మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల జ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉదయగిరి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుండి అపూర్వ స్పందన కనిపిస్తూ ఉండటం ఆయన పనితీరుకు నిదర్శనం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలనను సాగిస్తున్నదని కలివెల జ్యోతి కితాబునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తూ ఇది ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మంచి ప్రభుత్వం వేయినోళ్ల కీర్తించబడుతున్నదన్నారు. సూపర్ సిక్స్ పధకాలలో ప్రధానంగా మహిళల అభ్యున్నతి, ఆర్ధికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇవ్వడం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం అని కలివెల జ్యోతి తేల్చి చెప్పారు....