Skip to main content

Posts

రాయలసీమ లాయర్ల ఐక్యతకు పిలుపు: కర్నూలులో హైకోర్టు/బెంచ్ సాధనకు కీలక పోరాటం.

  అధికారమనేది నీటి మీద బుగ్గ. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, న్యాయవాద వృత్తి విస్తరణకు అత్యంత కీలకమైన ఆంధ్ర హైకోర్టు ప్రధాన బెంచ్ (లేదా హైకోర్టు)ను కర్నూలులో సాధించేందుకు స్థానిక న్యాయవాదుల మధ్య ఐక్యత అవసరమని ప్రముఖ న్యాయవాద వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రాపకంలో వ్యక్తిగత లబ్ధి కంటే, ప్రాంతీయ ప్రయోజనాలే ముఖ్యమని, హైకోర్టు స్థాపనతో వేలాది మంది న్యాయవాదులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నియామకాలపై ఆగ్రహం: రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొద్దిమంది లాయర్లకు (సుమారు 10 మందికి) తాత్కాలిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టులు ఇవ్వడం మినహా, రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే హైకోర్టు ఏర్పాటుకు చిత్తశుద్ధి చూపడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది నీటి మీద బుగ్గ లాంటిది" అని పేర్కొంటూ, రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలు అభివృద్ధికి హైకోర్టు కీలకం: రాయలసీమ ప్రాంత కేంద్రమైన కర్నూలులో ఆంధ్ర హైకోర్టు లేదా శాశ్వత బెంచ్ ఏర్పాటైతే ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా న్యాయ ప్...

ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి – గూగుల్‌తో ఏపీ ఒప్పందం

  వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏఐ హబ్ ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, నిర్మలాసీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గూగుల్ ప్రతినిధులు విశాఖలో పెట్టుబడిపై తమ సంస్థ ఎంతో ఆసక్తిగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల మేర ఖర్చుపెడతామని తెలిపారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో టెక్ ద్వారా పది బిలియన్ డాలర్లు, నేరుగా గూగుల్ ద్వారా మరో ఐదు బిలియన్ డాలర్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఉన్నాయి. 2029 నాటికి డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని … విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని గుర్తు చేశారు. జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందు...

సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!

  హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ - శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది...!!

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం – హరీష్ బాబు

 ధర్మవరం పట్టణంలోని లోనికోట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు స్వయంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు నందు మరియు మధు లా విన్నపం మేరకు, మంగళవారం హరీష్ బాబు లోనికోట వార్డుకు వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోవడం, దుర్వాసన వ్యాప్తి వంటి సమస్యలను ప్రజలు వివరించారు. వెంటనే హరీష్ బాబు మున్సిపల్ అధికారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించి, కాల్వల శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలనీ, శానిటేషన్ విభాగం పర్యవేక్షణను నిత్యకృత్యంగా నిర్వహించాలనీ కోరారు. అలాగే వీధి దీపాలు పనిచేయకపోవడం పై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను గమనించి, విద్యుత్ విభాగం సిబ్బందికి దీపాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలనీ, రోడ్ల మరమ్మత్తు పనులపై వివరణాత్మక ప్రణాళిక రూపొందించాలనీ మున్సిపల్ అధికారులకు సూచించారు. పాడైన రోడ్లను తక్షణమే మరమ్మతు చేసి, అవసరమున్న చోట కొత్త రోడ్లు వేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ ఇంజినీర్లకు...

గంగమ్మ కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ప్రశంస

ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రధాని ధన్ ధాన్య యోజన మరియు సహజ వ్యవసాయ ధ్రువపత్రం కార్యక్రమంలో, శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన సహజ వ్యవసాయ రైతు మహిళ సాకే గంగమ్మ, అన్నమయ్య జిల్లాకు చెందిన సురం శ్రీదేవి తో కలిసి దేశ గర్వకారణమైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, భారతీయ సహజ వ్యవసాయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సామల చిత్రకళ మరియు ఎద్దుల బండి ప్రతిరూపంతో సన్మానించారు. ఈ సత్కారం భారతదేశ సహజ వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంప్రదాయాన్ని సంరక్షించే క్రమంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆత్మను ప్రతినిధ్యం వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గంగమ్మ ని అభినందిస్తూ – ప్రకృతి ముందుకు నడిపితే రైతులు ఎదుగుతారు, భారత్ అభివృద్ధి చెందుతుంది అని పేర్కొని, సహజ వ్యవసాయం పట్ల తన మద్దతును వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, రాఘవంపల్లి గ్రామానికి వెళ్లి గంగమ్మ ని స్వగృహంలో సన్మానించి, ఆమెను, మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడించారు. మంత్రి సత్య కుమ...

షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్‌ పర్సన్ ను కలిసిన వైకాపా నేతలు .

  సాలూరు: జాతీయ షెడ్యూల్డు తెగల చైర్ పర్సన్ అంతర్ సింగ్ ఆర్యను రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరకు, తిరుపతి ఎంపిలు డాక్టర్ తనూజా రాణి, డాక్టర్ మద్దెల గురుమూర్తిల ఆధ్వర్యంలో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందటం, వంద మందికి పైగా విద్యార్థినిలు ఆసుపత్రిలో చేరటం తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేసారు.  కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని పిర్యాదు చేశారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణిలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ జి. మాధవి, జిసిసి మాజీ చైర్పర్సన్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ స్వాతీ రాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్...

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...