Skip to main content

Posts

ఏపీ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో EMT, డ్రైవర్ల నియామకాలు

విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం, EMT పోస్టులకు B.Sc Nursing, GNM, B.Sc Life Sciences, B.Sc Physiotherapy, B.Sc/M.Sc EMT అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) మరియు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు కూడా గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడలోని మంగళరావుపేటలో ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, PMD బ్రాంచ్ ఆఫీస్ (మెగాసిటీ ప్లాజా సమీపంలో) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికేట్లు, ...

చేనేతల చూపు. ప్రత్యమ్నాయం వైపు

 నేతన్నకు నిరాధారణ - పట్టు కోల్పోతున్న చేనేత - జీఎస్టీ గుదిబండగా మారిన వైనం - అమలు కానీ చేనేత1985 రిజర్వేషన్ చట్టం. - చేనేత పై పవర్ లూమ్స్.  ఆధిపత్యం - పవర్ లూమ్స్ కార్మికునికి తప్పని కష్టాలు.  - చేనేత వస్త్రాల తయారీపై 30% రాయితీ ఇవ్వాలి. దశాబ్దాలకు పైగా ఆడిన మగ్గం నేడు మూలాన పడింది. హరివిల్లు లాంటి అందమైన పట్టు చీరను తయారుచేసే నేతన్న కష్టాల కడలిలో పడ్డాడు. వ్యవసాయం తర్వాత అత్యధికమంది జీవనం సాగిస్తున్న చేనేతపై పాలకుల చిన్నచూపు కొనసాగడంతో ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు వేల మందికి ఉపాధినిచ్చిన చేనేత నేడు దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.  చిన్న చూపు అధికారుల నిర్లక్ష్యం వెరసి నేతన్న వృత్తికి దూరమవుతున్నాడు.  ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చే పార్టీల నాయకులు ఆ తర్వాత వాటిలో పది శాతం కూడా అమలు చేయడం లేదు..  కొత్తవి అమలు చేయకపోగా పాత వాటిని రద్దు చేయడంతో కార్మికులు ప్రభుత్వ సహాయానికి దూరం అవుతున్నారు.ఉన్న కష్టాలకు తోడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పట్టు చీరల వ్యాపారాలపై జీఎస్టీ విధించటంతో చేనేత రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. మూలిగే నక్కపై తాటి...

ముక్త్యాల రాజా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు.

   - నల్గొండ,ఖమ్మం,గుంటూరు కృష్ణాజిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాలు భూమి దానం,చేశారు. ఆరోజుల్లోనే లక్షలాదిà రూపాయలు ప్రాజెక్టు కోసం సహాయం చేసి, ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర వహించిన రాజా వారికి ఘన నివాళులర్పించారు.. పల్నాడు ప్రజలందరు రాజా గారికి ఋణపడి ఉన్నారు..  హృదయంలో ఆయనను దేవునిగా కొలుస్తారు.  నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం  ఆ మహానుభావుడే.ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల లో ప్రజలు ఈ రోజు సుభిక్షం గా పాడి పంటల తో ఉన్నారంటే వారే కారణం,వంశ పారం పర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు. ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, తన సొంత ఖర్చులతో వూరు వూరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద( నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంకా ఉపయోగపడి ఆనీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని తలంచి, అనకట్టలు ఆధునిక డేవాలయాలని భావిం...

విజయవాడ దుర్గగుడి ధర్మకర్తల మండలిలో 16 మంది కొత్త సభ్యుల నియామకం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం) ధర్మకర్తల మండలి పునర్‌వ్యవస్థీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ జాబితాను ఖరారు చేసింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా 11 స్థానాలు, జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. అదనంగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడకు చెందిన మార్తి రమాబ్రహ్మం, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్లను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే పోరంకి ప్రాంతానికి చెందిన బొర్రా రాధాకృష్ణను ఆలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకటించిన జాబితాతో ధర్మకర్తల మండలి పూర్తయింది. ఈ నియామకాలు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్నాయి. మండలి సభ్యుల జాబితా: విజయవాడ వెస్ట్ నుంచి అవ్వారు శ్రీనివాసరావు (బీజేపీ), విజయవాడ సెంట్రల్ నుంచి బడేటి ధర్మారావు (టీడీపీ), మైలవరం నుంచి గూడపాటి వెంటక సరోజినీ దేవి (టీడీపీ), రేపల్లె నుంచి జీవీ నాగేశ్వర్ రావు (టీడీపీ), హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ (టీడీపీ తెలంగాణ), తాడ...

ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!

 ​.కొందరికి మోదం.. అందరికీ ఖేదం. -​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై   డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. డిపో మేనేజర్ చర్యలు అందరి ప్రయోజనాలకు కాకుండా కొందరికి మాత్రమే మేలు చేకూరేలా ఉందనే విమర్శలు వెళ్ళుతున్నాయి. ఇది ఇలా ఉంటే రమణమ్మ పరిస్థితి నేటి యొక్క ఒకనాటి కోడలు అన్న చందంగా మారింది. కండక్టర్ స్థాయి నుంచి ఎస్ టి ఐ స్థాయికి ఎదిగిన ఆమె సిబ్బంది పట్ల బూతులు వల్లించడం ఉద్యోగస్తులకు మింగుడు పడటం లేదు. ఆమెన్ పై అనేక అవినీతి ఆరోపణలు రాత మూలకంగా ఫిర్యాదు చేసిన అవి బుట్ట దాఖలు కావటం హాట్ టాపిక్ గా మారింది. మేం ఇంతే మారం అంతే అన్న చందంగా ఇరువురి పరిస్థితులతో సిబ్బంది తలబాదుకుంటున్నారు. ​ఉరవకొండ డిపోలో ఉద్యోగులు గత కొంతకాలంగా రెండు ప్రధాన సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించమని పలుమార్లు డిపో మేనేజర్‌ను కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక పరిషత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ​1. డిజిటల్...

కావలి ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు బలి చేసుకున్నారు

సైబర్ మోసగాళ్ల బారిన సామాన్యులు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్ నేరగాళ్లకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 22న ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సప్ నంబర్‌కు ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఓ లింకు వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన బకాయిలుగా భావించిన ఆయన ఆ లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆయన సిమ్ బ్లాక్ అయ్యింది. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. 25 రోజుల తరువాత సిమ్ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే, ఆ కాలంలోనే ఎమ్మెల్యేకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ లావాదేవీల రూపంలో మొత్తంగా రూ.23,16,009 నగదు మాయం అయినట్లు కంపెనీ సిబ్బంది గమనించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 16 వరకు దశల వారీగా డబ్బు డెబిట్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో అసలు విషయం బయటపడింది. సైబర్ నేరగాళ్లు ఈ దందా వెనుక ఉన్నారని గ్రహించిన ఎమ్మెల్యే, వెంటనే కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ...

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

 Uravakonda ​ ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు-ఉరవకొండ-తుమకూరు మరియు గుంతకల్లు-కళ్యాణదుర్గం-మడకశిర-మధుగిరి రైలు మార్గాల నిర్మాణానికి వారు డిమాండ్ చేశారు. ​ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రైలు మార్గాలు అత్యంత అవసరమన్నారు  ఈ నేపథ్యంలో, గుంతకల్లు నుండి ఉరవకొండ మీదుగా కర్ణాటకలోని తుమకూరు వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించాలని కేశవ్ నాయక్, లాలెప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థికమంత్రులను వారు డిమాండ్ చేశారు. ​అదేవిధంగా, గుంతకల్లు నుండి కళ్యాణదుర్గం, మడకశిర మీదుగా కర్ణాటకలోని మధుగిరి వరకు మరో రైలు మార్గాన్ని కూడా నిర్మాణ ఆవశ్యకత ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు మార్గాల నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇది ఉరవకొండ నియోజకవర్గంతో పాటు వందలాది గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాపార, వ...