Skip to main content

Posts

ఏపీలో 9 పట్టాణాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింపు

  అమరావతి :  (నవంబర్ 22) ఏపీ రాష్ట్రంలో 9 అర్బన్ లోకల్ బాడీలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ ప్రత్యేక పాలన 2026 మే 5 వరకు లేదా స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇందులో రాజాం, రాజమండ్రి, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పొడిగించబడిన 9 అర్బన్ లోకల్ బాడీలు  1)రాజమండ్రి  2)రాజాం  3)భీమవరం  4)నరసరావుపేట  5)చీరాల  6)మార్కాపురం  7)కావలి  8)గుడివాడ  9)జగ్గయ్యపేట

అన్నదాత ఆక్రందన! పట్టించుకోని ప్రభుత్వం!

  -- వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ.   ‌‌ అన్నదాతల ఆక్రందన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెవిటి,మూగ, గుడ్డి దానిలా ప్రవర్తిస్తూ, అన్నదాత సుఖీభవ కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టి,ప్రస్తుతం 20,000 ఇస్తామనిచెప్పి, 17000కు కుదించి ఇస్తూ ఇదే రైతుల అన్ని సమస్యలకు పరిష్కారం అని అరచేయిని చూపించి మోచేతిని నాకిస్తున్నది.   2025-26 ఖరీఫ్ లో అతివృష్టి,అనావృష్టితో రైతులు ఆర్ధిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.     పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కు తున్నారు, పొలం లోనే పంటను వదిలేస్తున్నారు. అన్న దాతల కష్టాలను తీర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏ మాత్రం చేయడం లేదు.       ఖరీఫ్ లో రాయలసీమ లో ప్రధాన పంట వేరుశనగ సాగు సంక్షోభం, ఉల్లి,సజ్జ,మొక్కజొన్న,పత్తి, అమ్మకాలు సంక్షోభం.    రాయల సీమ హార్టికల్చర్ హబ్.పండ్లు,కూరగాయలు,పూల ఉత్పత్తిలో అగ్రస్తానం.    రాష్ట్రం మొత్తం అన్ని రకాల పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే,ఇందులో అరటి ఒక్కటే 74లక్షల టన్నులు.ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే.ప్రత్యేకంగా G 9 అరటి ఉత్పత...

గజ లక్ష్మీ వాహన సేవలో అమ్మవారు.. కరణం వెంకటేశ్వర ప్రసాద్ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తిరుమల శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతటి వైభవోపేతమైనవో, తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి జరిగే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా అంతే సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 1. అమ్మవారి అవతరణోత్సవం: పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి తిథినాడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరులోని "పద్మ సరోవరం"లో బంగారు తామర పువ్వు (Golden Lotus) నుండి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 2. ధ్వజారోహణంతో ప్రారంభం: ఉత్సవాలు "ధ్వజారోహణం"తో మొదలవుతాయి. అమ్మవారి వాహనమైన ఏనుగు బొమ్మతో కూడిన జెండాను (Gaja Dhwajam) ఎగురవేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఫోటోలలోని విశేషం: గజ వాహన సేవ (Gaja Vahanam) బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గజవాహన సేవ ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవ. * గజలక్ష్మి స్వరూపం: ఏనుగు ఐశ్వర్యానికి, రాజసానికి ప్రతీక. పాలసముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దిగ్గజాలు (ఏనుగులు) ఆమెను అభిషేకించాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారు ఈ వాహనంపై "గజలక్ష్మి" అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. * విశేష అలంకరణ: అమ్మవారు బంగారు ఆభరణాలు, భారీ పుష్పమాలికలు, ముఖ్యంగా కాసుల పేరు వంటి విశేష ఆభరణాలతో అలంకరించబడి ఉన్నారు. * బంగారు ఏనుగు: అమ్మవారు అధిరోహించిన ఏనుగు వాహనం పూర్తిగా బంగారు తొడుగుతో (Gold Plated) చేయబడి ఉంటుంది. ఇది భక్తుల జీవితాల్లో సిరిసంపదలను అనుగ్రహించే అమ్మవారి తత్వాన్ని సూచిస్తుంది. బ్రహ్మోత్సవాలలోని ఇతర ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల ఉత్సవాల్లో ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో వాహనంపై విహరిస్తారు: * చిన్న శేష వాహనం & పెద్ద శేష వాహనం: ఆదిశేషునిపై విహారం. * హంస వాహనం: అమ్మవారు జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. * ముత్యపు పందిరి వాహనం: చల్లని వెన్నెల కురిపించే ముత్యాల పందిరిలో విహారం. * సింహ వాహనం: దుష్ట శిక్షణ కోసం అమ్మవారు శక్తి స్వరూపిణిగా సింహంపై వస్తారు. * గరుడ వాహనం: ఇది చాలా విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిపై లక్ష్మీదేవి ఊరేగడం, ఆమె సర్వస్వతంత్రురాలు అని చాటిచెప్పే అద్భుత ఘట్టం. * రథోత్సవం: ఎనిమిదవ రోజు అమ్మవారు రథంపై ఊరేగుతారు. పంచమి తీర్థం (ఉత్సవాల ముగింపు) ఈ బ్రహ్మోత్సవాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైనది చివరి రోజైన "పంచమి తీర్థం". * ఈ రోజున తిరుమల నుండి శ్రీవారు పంపిన పసుపు, కుంకుమ, చీర, సారెలను గజవాహనంపై తీసుకువస్తారు. * ఆ సమయంలో పద్మ సరోవరంలో చక్రస్నానం (Holy Bath) ఆచరిస్తారు. * ఈ ముహూర్తంలో పద్మ సరోవరంలో మునిగితే సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్షం లభిస్తుందని కోట్లాది భక్తుల నమ్మకం. దీనిని "దక్షిణ కుంభమేళా" అని కూడా పిలుస్తారని తిరుపతి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన పూజారి కరణం వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.

  తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తిరుమల శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతటి వైభవోపేతమైనవో, తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి జరిగే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా అంతే సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 1 . అమ్మవారి అవతరణోత్సవం: పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి తిథినాడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరులోని "పద్మ సరోవరం"లో బంగారు తామర పువ్వు (Golden Lotus) నుండి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 2. ధ్వజారోహణంతో ప్రారంభం: ఉత్సవాలు "ధ్వజారోహణం"తో మొదలవుతాయి. అమ్మవారి వాహనమైన ఏనుగు బొమ్మతో కూడిన జెండాను (Gaja Dhwajam) ఎగురవేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఫోటోలలోని విశేషం: గజ వాహన సేవ (Gaja Vahanam)  బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గజవాహన సేవ ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవ.   గజలక్ష్మి స్వరూపం: ఏనుగు ఐశ్వర్యానికి, రాజసానికి ప్రతీక. పాలసముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దిగ్గజాలు (ఏనుగులు) ఆమెను అభిషేకించాయని పురాణాలు చ...

సిఐ . శంకరయ్య డిస్మిస్

  కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్  కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్   కర్నూల్. కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వుల మేరకు కర్నూలు వి ఆర్ లో ఉన్న సిఐ జె. శంకరయ్యను క్రమశిక్షణ చర్యల నిమిత్తం పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.

సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల మాయం?

  • విచారణ స్టేట్‌మెంట్ కనిపించడం లేదని సమాధానం • ఆర్టీఐ ద్వారా అడిగితే అంతుచిక్కని వ్యవహారం • అధికారుల తీరుపై బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి ఆవేదన • ఎంరో, వీఆర్వోలపై కుట్ర ఆరోపణలు.. ఉన్నతాధికారులు విచారణ జరపాలని విజ్ఞప్తి ( సింగరాయకొండ - ప్రతినిధి): సామాన్యులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే కీలక పత్రాలు మాయమవుతున్నాయా? విచారణలో వాస్తవాలు వెలుగుచూసినా, ఆ పత్రాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి). సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండ పరిధిలోని సర్వే నెంబర్ 338/3 లోని 14 సెంట్ల భూమికి సంబంధించి గతంలో వివాదం నెలకొంది. దీనిపై 03/07/2023 నాడు అప్పటి ఎమ్మార్వో ఉష గారి సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణకు కోమటిరెడ్డి కోటేశ్వరి మరియు ప్రతివాది మన్నం రంగారావు హాజరయ్యారు. ఆ రోజు జరిగిన విచారణలో తమ వాంగ్మూలాలను (Statements) రికార్డు చేశారని, ఆ భూమి కోటేశ్వరి వాళ్ళ నాన్నగారిదే అని స్పష్టమైందని, ఇదే ...

జెమ్మి చెట్టు ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడం బాధాకరం

  ఉరవకొండ దసరా పండుగ నాడు భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన జమ్మి చెట్టు ప్రాంతం, ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం నిజంగా బాధాకరం. మన సంస్కృతిలో జమ్మి చెట్టుకు ఉన్న విశిష్టతను మరిచిపోయి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం.  పవిత్రతకు భంగం: విజయదశమి నాడు సకల విజయాలు కలగాలని పూజించే దివ్యమైన స్థలం అది. అటువంటి చోట మందు సీసాలు, చెత్తాచెదారం వేయడం ఆ ప్రాంత పవిత్రతను దెబ్బతీస్తోంది.  సామాన్యులకు ఇబ్బంది: తాగుబోతుల సంచారం వల్ల సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది.   నిఘా లోపం: ఇది బహిరంగ ప్రదేశం అయినప్పటికీ, సరైన పోలీసు నిఘా లేకపోవడం వల్లనే వారు ఇలా రెచ్చిపోతున్నారు. సివిల్ పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది:   నిరంతర గస్తీ ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి వేళల్లో జమ్మి చెట్టు ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాలు తిరగాలి.  హెచ్చరిక బోర్డులు: "ఇది పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ మద్యం సేవించడం నేరం" అని స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి.  కఠిన చర్యలు: బహ...

డీ హెచ్ 256 వేరుశనగ సాగు తో అధిక దిగుబడి.

  ఉరవకొండ   డిహెచ్ 256 వేరుశనగ నూతరకాన్ని ఉరవకొండ నియోజకవర్గం లో యువ రైతు దంపతులు (రఘు అంబిక) ఖరీఫ్ సీజన్లో ఒకటి 1.5 ఎకరాలలో నల్లరేగిడి పొలంలో డిహెచ్256 వేరుశనగ విత్తనాలను ప్రయోగపూర్వకంగా సాగు చేశారు, దీనితో అధిక దిగుబడి వచ్చింది.ఈ సీజన్లు విపరీత వర్షాలు వచ్చినప్పటికీ మంచి నాణ్యతతో కూడిన 60 నుంచి 70 బస్తాలు వేరుశనగ కాయలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు దంపతులు తెలియజేశారు. తక్కువ విత్తనం మోతాదు, తెగుళ్లు, పురుగులను & దోమలను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యం ఉండటం, ప్రక్క కు కొమ్మలు అధికంగా రావడం, ఎక్కువ కాయలు కాయటం, ఆకు దిగుబడి అంటే పొట్టు కూడా ఎక్కువ గా రావటం చేత రైతులoదరికీ లాభ సాటిగా ఉంటుందనితెలిపారు. డిహెచ్256 వేరుశనగ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేశారు* *DH-256 యొక్క ముఖ్య లక్షణాలు*: *ఆరిజిన్: వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం (యుఎఎస్), ధార్వాడ వేరుశనగ పరిశోధన కేంద్రం చేత అభివృద్ధి చేయబడిన స్పానిష్ బంచ్ వేరుశనగ రకం DH-256, ఈ వేరుశనగరకం తుప్పు తెగులు మరియు సర్క్కోస్ఫర ఆకుమచ్చ తగులను తట్టుకోవటంలో ప్రసిద్ది చెందింది మరియు స్పోడోప్టెరా, త్రిప్స్ మరియు లీఫ్‌హాపర్స...